జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ కు శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన ప్రస్తుత ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి.ఎం. సంతోష్ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ కు శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ మొదటిసారిగా సంతోష్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక జిల్లా పరిపాలనపై పట్టు సాధించారని కొనియాడారు. అన్ని శాఖల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పూర్వపు కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ హైదరాబాదులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసి మొదటి సారి జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ గా పనిచేయడంతో మంచి అనుభవం పొందానని, జిల్లా అధికార యంత్రాంగంతో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి పనిచేయడం జరిగిందన్నారు. జిల్లాలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా నిర్వహించడంలో పూర్వపు కలెక్టర్ సంతోష్ సహకారం మరువలేనిదని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగిందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పూర్వపు కలెక్టర్ సంతోష్ తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ ను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ శ్రీనివాసరావు, ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ కు శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన ప్రస్తుత ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి.ఎం. సంతోష్ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ కు శనివారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ మొదటిసారిగా సంతోష్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక జిల్లా పరిపాలనపై పట్టు సాధించారని కొనియాడారు. అన్ని శాఖల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పూర్వపు కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ హైదరాబాదులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసి మొదటి సారి జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ గా పనిచేయడంతో మంచి అనుభవం పొందానని, జిల్లా అధికార యంత్రాంగంతో కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి పనిచేయడం జరిగిందన్నారు. జిల్లాలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా నిర్వహించడంలో పూర్వపు కలెక్టర్ సంతోష్ సహకారం మరువలేనిదని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగిందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పూర్వపు కలెక్టర్ సంతోష్ తో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్లిన బి. ఎం. సంతోష్ ను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, ఆర్డిఓ శ్రీనివాసరావు, ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- కర్నూలు జిల్లా ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయ సాధనలో ముందుకు సాగాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చాటిచెప్పారన్నారు . మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ప్రపంచమే మన రాజ్యాంగం వైపు చూసేలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.అంబేడ్కర్ జీవించే హక్కు కల్పించారని ఆమె స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలో రెండవ రోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగఅరైవ్ -అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రజలతో అధికారులతో చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూనే మానసిక దృఢత్వంతో భద్రతగా వాహనాలు నడపాలని సూచించారు. మారుమూల ప్రాంతాల వరకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచాలని అన్నారు.1
- అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతం1