*750 ఎకరాల బీడు భూములను సాగులోకి తేవడమే లక్ష్యం* *మరో నెలలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి* *చెక్ డ్యాం నిర్మించడంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తాం* *ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నపటికీ దళిత, గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం* *వెంకటాచలం మండలం పూడిపర్తిలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న భూముల పరిశీలన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *జంగిల్ క్లియరెన్స్ పనుల పరిశీలన,...అక్కడే అధికారులతో సమీక్ష* *డ్వామా పీడీ గంగాభవాని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభారాణి తదితరులతో చర్చలు...సాధ్యమైనంత త్వరగా భూములను సాగులోకి తేవడంపై సమాలోచనలు* *సోమిరెడ్డి కామెంట్స్* పూడిపర్తిలో 1981లో 191 మంది దళితులకు 382 ఎకరాలు పంపిణీ చేశారు దాదాపు 45 ఏళ్లుగా ఈ భూములను బీడుగా పెట్టారు 382 ఎకరాలు పోను మరో 158 ఎకరాలు పంపిణీ చేయాల్సివుంది అడవిగా మారిన ఈ భూములను గత జనవరిలో అధికారులతో కలిసి సందర్శించాం అప్పటి నుంచి మిషన్లతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాం ఇప్పటి వరకు 230 ఎకరాలు శుభ్రం చేశారు..మరో 320 ఎకరాలు క్లియర్ చేయాల్సివుంది మరో నెలలో ఆ పనులు కూడా పూర్తవుతాయి నాలుగైదు రోజుల్లో అధికారులతో మరో సమావేశం నిర్వహిస్తాం ఒక ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించి మరో ప్రాంతంలో లిఫ్ట్ పెట్టాలని చెబుతున్నారు జలధార కార్యక్రమంలో భాగంగా చెక్ డ్యాం నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం మరో 37 ఎకరాల గిరిజనుల భూములకు కూడా లిఫ్ట్ పెట్టాల్సివుంది అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఈ భూములకు సాగునీరు అందించి సాగులోకి తెస్తాం 1992లో 71 మంది నిరుద్యోగులకు మరో 71 హెక్టార్లు పంపిణీ చేశారు ఆ భూముల్లో కొందరు రొయ్యల సాగు చేసుకుంటుండగా, మరికొందరివి బీడుగా ఉన్నాయి...ఆ భూములనూ సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం దళితులు, గిరిజనులకు ప్రభుత్వం పంపిణీ చేసిన వందల ఎకరాల భూములు ఇలా నిరుపయోగంగా మారడం సరికాదు భూములు సాగుకు అవసరమైతే ఎంపీ ల్యాడ్స్ ద్వారా వసతులు కల్పించే ప్రయత్నం చేస్తాం
*750 ఎకరాల బీడు భూములను సాగులోకి తేవడమే లక్ష్యం* *మరో నెలలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి* *చెక్ డ్యాం నిర్మించడంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తాం* *ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నపటికీ దళిత, గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం* *వెంకటాచలం మండలం పూడిపర్తిలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న భూముల పరిశీలన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *జంగిల్ క్లియరెన్స్ పనుల పరిశీలన,...అక్కడే అధికారులతో సమీక్ష* *డ్వామా పీడీ గంగాభవాని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభారాణి తదితరులతో చర్చలు...సాధ్యమైనంత త్వరగా భూములను సాగులోకి తేవడంపై సమాలోచనలు* *సోమిరెడ్డి కామెంట్స్* పూడిపర్తిలో 1981లో 191 మంది దళితులకు 382 ఎకరాలు పంపిణీ చేశారు దాదాపు 45 ఏళ్లుగా ఈ భూములను బీడుగా పెట్టారు 382 ఎకరాలు పోను మరో 158 ఎకరాలు పంపిణీ చేయాల్సివుంది అడవిగా మారిన ఈ భూములను గత జనవరిలో అధికారులతో కలిసి సందర్శించాం అప్పటి నుంచి మిషన్లతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాం ఇప్పటి వరకు 230 ఎకరాలు శుభ్రం చేశారు..మరో 320 ఎకరాలు క్లియర్ చేయాల్సివుంది మరో నెలలో ఆ పనులు కూడా పూర్తవుతాయి నాలుగైదు రోజుల్లో అధికారులతో మరో సమావేశం నిర్వహిస్తాం ఒక ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించి మరో ప్రాంతంలో లిఫ్ట్ పెట్టాలని చెబుతున్నారు జలధార కార్యక్రమంలో భాగంగా చెక్ డ్యాం నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం మరో 37 ఎకరాల గిరిజనుల భూములకు కూడా లిఫ్ట్ పెట్టాల్సివుంది అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఈ భూములకు సాగునీరు అందించి సాగులోకి తెస్తాం 1992లో 71 మంది నిరుద్యోగులకు మరో 71 హెక్టార్లు పంపిణీ చేశారు ఆ భూముల్లో కొందరు రొయ్యల సాగు చేసుకుంటుండగా, మరికొందరివి బీడుగా ఉన్నాయి...ఆ భూములనూ సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం దళితులు, గిరిజనులకు ప్రభుత్వం పంపిణీ చేసిన వందల ఎకరాల భూములు ఇలా నిరుపయోగంగా మారడం సరికాదు భూములు సాగుకు అవసరమైతే ఎంపీ ల్యాడ్స్ ద్వారా వసతులు కల్పించే ప్రయత్నం చేస్తాం
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *కడప జిల్లా :* వీరబల్లి మండలంలో ఉద్రిక్తత... సంగంవాండ్లపల్లి వద్ద వీరబల్లి-రాయచోటి రహదారి పై బైఠాయించిన సంగంవాండ్లపల్లి, పెద్దివీడు గ్రామాల ప్రజలు... నిలిచిపోయిన రాకపోకలు... ఆక్రమణకు గురైన తిమ్మారెడ్డి చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలి అంటూ నినాదాలు... కబ్జాదారులకు వీరబల్లి రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణ...1