సేవా సంకల్ప్ అభియాన్ విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి * శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు (శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాల సూచనల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన వివిధ సేవా కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా, విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, కార్యక్రమాల నిర్వహణ, సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలోని వివిధ వర్గాలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సేవా సంకల్ప్ అభియాన్ను విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, ఎచ్చెర్ల నియోజకవర్గ బి ఎల్ ఏ-1 నడుకుదిటి తేజబాబు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ రామనంద స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ సూరపునాయుడు, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు ధన్నాన మదన్మోహన్, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి సలానా రాఘవ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు, జిల్లా కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి బోర గోపి, బీజేపీ నాయకులు తమ్మినేని ఆనందరావు, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు ముత్యాల గౌతమీ తదితరులు పాల్గొన్నారు.
సేవా సంకల్ప్ అభియాన్ విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి * శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు (శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాల సూచనల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన వివిధ సేవా కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా, విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, కార్యక్రమాల నిర్వహణ, సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలోని వివిధ వర్గాలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సేవా సంకల్ప్ అభియాన్ను విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సిరిపురం తేజేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, ఎచ్చెర్ల నియోజకవర్గ బి ఎల్ ఏ-1 నడుకుదిటి తేజబాబు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ రామనంద స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ సూరపునాయుడు, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు ధన్నాన మదన్మోహన్, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి సలానా రాఘవ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు, జిల్లా కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి బోర గోపి, బీజేపీ నాయకులు తమ్మినేని ఆనందరావు, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు ముత్యాల గౌతమీ తదితరులు పాల్గొన్నారు.
- 'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు శ్రీకాకుళం: మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక 'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- రాజీవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ఆధ్యాత్మిక సమాచారం. తేదీ. 14. 9. 2026. సోమవారం ఉదయం. శ్రీశ్రీశ్రీ సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవములు సందర్భముగా. రాజీవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సీతారామాలయం నుండి శ్రీ సిద్ధి వినాయక స్వామిని పూజా కార్యక్రమం నిర్వహించి ఊరేగింపుగా తీసుకువచ్చి రాజీవ్ నగర్ కాలనీలో గల వినాయక మండపమునకు తీసుకువచ్చి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన దృశ్యం. ఈ కార్యక్రమంలో. 1.పతివాడ గిరీశ్వరరావు. అధ్యక్షులు. రాజీవ్ సేవా సంఘం . 2. బురల్లి. శంకరరావు. మాజీ సర్పంచ్. నరసన్నపేట గ్రామపంచాయతీ. రాజీవ్ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు. రాజీవ్ సేవా సంఘం యువజన విభాగం సభ్యులు. పెద్దలు. మహిళలు. యువతీ యువకులు పిల్లలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు. పతివాడ గిరీశ్వర రావు. అధ్యక్షులు. మరియు కార్యవర్గం. రాజీవ్ సేవా సంఘం. నరసన్నపేట టౌన్. శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్.1
- నెల్లిమర్ల నగరం లో ఘనంగా డిజె సౌండ్ లతో గణపతి నిమజ్జనం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం గణేష్ నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు లో భాగంగా.. ఉదయం పూజలు చేసి సాయంత్రం నగరంలో ఉన్న కొన్ని వినాయక విగ్రహాలు డిజె సౌండ్ల మధ్య ఆనందంగా కేరింతలతో,డ్యాన్సులతో, బాణాసంచాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు.1
- మత సామరస్యానికి ప్రతీక ఖాదర్ బాబా దర్గా సూఫీ పీఠాధిపతి ఖ్వాజా మొహియినుద్దీన్ విజయనగరం, సెప్టెంబర్ 15: శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యానికి బాబామెట్టలోని హజరత్ ఖాదర్ బాబా దర్గా షరీఫ్ ప్రతీకగా నిలుస్తోందని చీమలపాడు సూఫీ పీఠాధిపతి, సజ్జాదా నషీన్ మొహమ్మద్ ఖ్వాజా మొహియినుద్దీన్ అన్నారు. బుధవారం నిర్వహించనున్న హజరత్ ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం బాబామెట్ట దర్బార్ షరీఫ్లో ధర్మకర్త డాక్టర్ ఎం.డీ. ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ (ఖలీల్ బాబు)తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖ్వాజా మొహియినుద్దీన్ మాట్లాడుతూ ఖాదర్ బాబా జన్మదినం సూఫీ పరంపరలో విశిష్టమైన పర్వదినమన్నారు. మానవత్వంతో కూడిన సూఫీ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి విస్తరించిన మహనీయుల్లో బాబా ఖాదర్ షా ఒకరని కొనియాడారు. సుమారు 850 ఏళ్ల క్రితమే భారతదేశంలో సూఫీ పరంపర ప్రారంభమైందని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు అందించడం, మాటలతోగానీ చేతలతోగానీ ఇతరులను బాధించకుండా మానవత్వంతో జీవించడమే సూఫీ మార్గమని వివరించారు. ఈ పరంపరలో ఎంతోమంది మహనీయులు భారతదేశంలో జన్మించారని, నాగ్పూర్ తాజుద్దీన్ బాబా శిష్యుల్లో అగ్రగణ్యుడిగా బాబా ఖాదర్ షా నిలిచారని తెలిపారు. 1900 నుంచి 1961 వరకు విజయనగరంలో ఖాదర్ బాబా వారి ఆధ్యాత్మిక సందర్శనా కాలంగా పేర్కొన్నారు. ఈ కాలంలో బాబా అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసి, శాంతి, మత సామరస్య సందేశాన్ని విస్తరించారని చెప్పారు. అన్నార్తుల ఆకలి తీర్చడం, వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చడం, బాధితులకు అండగా నిలవడం వంటి సేవలతో బాబా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని పేర్కొన్నారు. బాబా పవిత్ర సమాధిని దర్శించుకునే భక్తులకు నేటికీ ఆశీస్సులు లభిస్తున్నాయన్న విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. ఖాదర్ బాబాపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఘనంగా జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించనున్న ఖాదర్ బాబా 130వ జన్మదిన వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బాబా భక్తులు హాజరుకానున్నారని ఖ్వాజా మొహియినుద్దీన్ తెలిపారు. భక్తుల కోసం అవసరమైన వసతి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మంగళవారం నుంచే దర్బార్ షరీఫ్లో ఉత్సవ సందడి నెలకొందన్నారు. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం భారీ అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బాబా దివ్య సమాధికి చాదర్, సుగంధ ద్రవ్యాలు, పూలు, మిఠాయిలు సమర్పించి విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి దర్బార్ షరీఫ్లో భారీ అన్న సమారాధన నిర్వహించడంతో పాటు రాత్రి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఖలీల్ బాబు తనయుడు ఎం.డీ. అహ్మద్ బాబు, నాగేంద్ర బాబాయ్, రంగారావు బాబాయ్ తదితరులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, టిడిపి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం... విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజవర్గ పరిధిలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చిన్న శ్రీను గారుకి పరిచయం చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన . - మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఫోటోలు. - నియోజకవర్గ జనసేన నాయకులను పరిచయం చేసన బేబీనాయన. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)*శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* ఆహ్వానం మేరకు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటకు వచ్చారు.. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దర్బార్ మహల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే*బేబీనాయన* గారు మాట్లాడుతూ, మజ్జి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి రావడం *తనకు చాలా సంతోషంగా ఉందని* అన్నారు.. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తరుపున స్వాగతం పలికారు.. అలానే, *వారి చేరికను తాను వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు*.. వారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందని తనకి పూర్తి నమ్మకం ఉందన్నారు.. రాజకీయంగా వేరే పార్టీలలో పనిచేసినా కూడా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు మాకు లేవని స్పష్టతనిచ్చారు.. అందరం కలసికట్టుగా పనిచేసి, గౌరవ ప్రధానమంత్రి *నరేంద్ర మోదీ* ముఖ్యమంత్రి శ్రీ *నారా చంద్రబాబునాయుడు* , ఉప ముఖ్యమంత్రి *పవన్ కళ్యాణ్* గారు నాయకత్వాన్ని బలపరిచి మన నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ *మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుకి ఎల్లప్పుడూ తాను సహకరిస్తానని, చిరస్థాయిగా వారు రాజకీయంగా ఎదగాలని అన్నారు.. గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని.. ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగుతామని, పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం మేరకు పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రి శ్రీ సుజయ్ నాయన మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు తో కూడా మాట్లాడానని, వారిని కూడా కలుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి , విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్ , ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్రావు మరియు చింతల రామకృష్ణ, బొబ్బిలి పట్టణం మరియు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాస్ , మాజీ మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఉద్యమం.. మద్దతు తెలిపిన సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామాల సందర్శన కార్యక్రమం కొనసాగుతోంది. పార్వతీపురం, కొమరాడ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని గ్రామాలను సందర్శిస్తూ రైతులు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన దుశృర్ల సత్యనారాయణ సాధన సమితి సభ్యులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో తన వంతు సహాయ సహకారాలు అందించి, జంఝావతి ప్రాజెక్టు సాధన కోసం కలిసి పనిచేస్తానని తెలిపారు. 50 ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయి, కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలాయని, జంఝావతి మన్యం ప్రజలకు జీవనాడి వంటిదని ఆయన పేర్కొన్నారు.1
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అకాల మరణం,................ కాంగ్రెస్ నాయకునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004 నుంచి 2009 వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో మరణించారు. అత్తగారింటికి పండగకి గాని వచ్చిన ఆయనకు ఊహించని విధంగా గుండెలో నొప్పి రావడంతో హుటాహుటిన నగరంలోని సీతమ్మదార లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు తరలించగా ఆయన అక్కడ మృతి చెందారు.1
- విజయనగరం జిల్లా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వక కలిసిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్.. విజయనగరం జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని కలిసిన మజ్జి శ్రీను,గత వారం రోజులుగా విజయనగరం జిల్లాలో రాజకీయాల్లో మార్పు వచ్చింది జడ్పీ చైర్మన్, వైసీపీ నాయకులు మజ్జి శ్రీను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ నాయకుల లోకేష్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి మజ్జి శ్రీను రావటం జిల్లాలో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆశిస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, చంద్రబాబు గారి నిర్ణయాన్ని అమలు చేయటానికి సమన్వయంతో పనిచేస్తామన్న మజ్జి శ్రీను, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని తెలిపిన మజ్జి శ్రీను,తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులతో డబల్ ఇంజన్ సర్కార్ 2029 ఏర్పాటు చేయటానికి కృషి చేస్తానని తెలిపిన మజ్జి శ్రీను, స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కష్టపడి పనిచేయాలని ఆదేశం,ద్వితీయ శ్రేణి నాయకులతో సైతం సమన్వయం చేసుకొని ముందుకు సాగుతానన్న మజ్జి శ్రీను , మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీను.2