ఈద్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. –తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈద్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. –తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు. నియోజకవర్గం లో ఉన్న ఈద్గాలు, మసీదులు, కబ్రస్తాన్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ. కోటి నిధులు మంజూరు చేసిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. తాండూర్ పట్టణంలోని చెన్ గేస్ పూర్ రోడ్ మార్గంలో ఉన్న ఈద్గా పరిరక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 35 లక్షలు మంజూరు కావడంతో,ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సొమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈద్గా పరిరక్షణతో పాటు మైనారిటీ ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు,మంజూరైన నిధులతో చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.ఈద్గాలు, మసీదులు, కబ్రస్తాన్ల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈద్గా అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ రహూప్, మాజీ చైర్మన్లు బాల్ రెడ్డి, నర్సింహులు, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈద్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. –తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈద్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. –తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు. నియోజకవర్గం లో ఉన్న ఈద్గాలు, మసీదులు, కబ్రస్తాన్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ. కోటి నిధులు మంజూరు చేసిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. తాండూర్ పట్టణంలోని చెన్ గేస్ పూర్ రోడ్ మార్గంలో ఉన్న ఈద్గా పరిరక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ. 35 లక్షలు మంజూరు కావడంతో,ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సొమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈద్గా పరిరక్షణతో పాటు మైనారిటీ ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు,మంజూరైన నిధులతో చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.ఈద్గాలు, మసీదులు, కబ్రస్తాన్ల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈద్గా అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, సీనియర్ నాయకులు అబ్దుల్ రహూప్, మాజీ చైర్మన్లు బాల్ రెడ్డి, నర్సింహులు, కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో న్యాయం చేయాలి. కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలలో తగు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత శాఖ అధికారులతో ఎస్సీ ఎస్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు కేసుల పరిశీలన పై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీల కేసులను వేగవంతంగా పరిష్కరించి న్యాయం చేయాలని భక్కి వెంకటయ్య సూచించారు.1
- విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు విద్యుత్ తీగలతో రైతులకు ముప్పు మనిషికి అoదేoత ఎత్తు లో వేలాడుతున్న తీగలు పలుమార్లు మోటార్లు కాలిపోతు న్నా పట్టిoచుకోని అధికారులు ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ శివారు లోని సర్వే నంబర్ 37 లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిoదికి వేలాడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తo చేస్తున్నారు దాదాపు నాలుగు ఎకరాల పొడవునా విద్యత్ తీగలు మనిషి కి ఆoదేoత ఎత్తులో ఉoడటoతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుoదోనని రైతులు భయాoదోళనకు గురవుతున్నారు ఈ సమస్య పై పలుమార్లు లైన్ మెన్ కు విన్నవిoచినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కరo లేదు1
- మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే *బైపాస్ రోడ్డు ప్రయాణంలో ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో ప్రయాణికులకు ప్రజలకు తెలుసు* .. *మా ఎమ్మెల్యే ఆరాటం HMDA నాన్స్ ప్రకారం బైపాస్ రోడ్డు విస్తీరణ ఉండాలి* ... *కూల్చాడు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే విడ్డూరంగా ఉంది...* *50 ఫీట్ల రోడ్డుతో ఎవ్వరికి ఉపయోగం...* *మాటలు నరకడం ఆపి రోడ్డు గుంతలను పూడ్చాలి...* *మీ ప్రయోజనాలకోసం ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు* .. *ముగ్గురు సీఎం లు మారిన రాజీవ్ పార్క్ ఎందుకు బాగు చేయలేదు... ?* సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి అని మాజీ సిడిసి చైర్మన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, రామప్ప, కౌన్సిలర్ లు పొన్న రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ మీడియా తో మాట్లాడారు.. వ్యక్తిగత విమర్శలు, అనవసర ఆరోపణలు కాకుండా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డుపై ప్రతిరోజూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాజీ ఎమ్మెల్యేకు తెలియవా? గుంతలు, ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా సాగుతున్న పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైపాస్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్. 50 అడుగుల రోడ్డుతో సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? లేక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల ఉన్న చోట 80. అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డును నిర్మించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలా? అనేది ప్రజలే ఆలోచించాలి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టంగా చెబుతున్నది ఒక్కటే ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు నిర్మాణం జరగాలి. భవిష్యత్లో మళ్లీ రోడ్డు విస్తరణ అవసరం రాకుండా ఇప్పుడే సరైన ప్రణాళికతో పని పూర్తి చేయాలి. ఇక రోడ్డు పనుల నాణ్యతపై, పనులు ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి? గడువులోగా ఎందుకు పూర్తి చేయడం లేదు? ప్రజలకు వివరించాలి... మొన్న సీఎం వచ్చినపుడు ఐబీ ఆవరణలో రోడ్డు పనుల కోసం గోడలు కూల్చినప్పుడు, ఆగమేఘాల మీద పనులు చేపట్టినప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేదా? ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే విమర్శలు చేయడం ఎందుకు? అభివృద్ధి కోసం అవసరమైన చోట రోడ్డు విస్తరణ, ప్రభుత్వ ఆస్తుల మార్పులు, నిర్మాణ పనులు చేపట్టాల్సి వస్తే వాటిని నిబంధనల ప్రకారం పూర్తి చేయడం ముఖ్యం. ఎన్నికల సమయంలో సంగారెడ్డి పట్టణంలోని ప్రతి వార్డుకు 8.కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తామని ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఇటీవల ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చిన సమయంలో పట్టణానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారు? ప్రజలకు ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా సంవత్సరాలుగా ముగ్గురు సీఎం లు మారిన ఒక పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇంత కాలం ఎందుకు పడుతోంది? గతంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో పట్టణ అభివృద్ధికి 50కోట్ల నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. సంగారెడ్డి ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు — అభివృద్ధి. మాటలు కాదు — పనులు. హామీలు కాదు — నిధులు. ప్రచారం కాదు — నాణ్యమైన రోడ్లు. రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 అడుగుల రోడ్డు ఉన్న చోట 80 అడుగులు 60 అడుగులు ఉన్న చోట 60 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు కాదు… ప్రజలకు ఉపయోగపడే పనులపై చర్చ జరగాలి. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాలి. సంగారెడ్డి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో ఏ పని జరిగింది అన్నది ప్రజలకు తెలుసు. కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ లు ,లాడే మల్లేశం, నవీన్, సురేష్, కసిని శ్రీకాంత్, విఠల్, వజిత్ తదితరులు ఉన్నారు.4
- సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు మార్పు అంటే ఇదేనా రేవంతూ.. తూ.. ఒక్క కల్వకుర్తి నియోజకవర్గం లొనే 308 ఎకరాలు అంటే .. రాష్ట్రo.. పక్క రాష్ట్రo లో ఎంత ఉందొ మొత్తం లెక్కలు వొస్తాయి.. ఎలా సంపాదించావు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసిందన్నారు. ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం అన్నారు.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్పై కల్పిత వ్యాఖ్యలతో పుస్తకం రాశారంటూ ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు దాడిగా నరేశ్, నియోజకవర్గ ఇన్చార్జ్ కుమార్ ఆరోపించారు. ప్రసాద్ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, రచనలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువజన కార్యకర్తలు, స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.1
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1