logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

6 days ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
6 days ago
8500815e-5414-4916-ad41-f56547322282

*పార్కిన్సన్ రోగులకు అండగా ఉంటాం : అపోలో ఆధ్వర్యంలో వాకథాన్* పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన సంరక్షణ, అవగాహన మరియు అత్యాధునిక చికిత్సను అందించే దిశగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్ స్పష్టం చేశారు. శనివారం ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె నగరంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ప్రజలతో కలిసి ఆమె వాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకూ సాగిన ఈ వాకథాన్ ను డాక్టర్ బింధు మీనన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ ద్వారా పార్కిన్సన్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పార్కిన్సన్ తొలి దశ లక్షణాలు, జీవన శైలి మార్పులు మరియు సకాలంలో చికిత్స తీసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాస్పిటల్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. నిపుణులతో జరిగిన ఈ సదస్సులో రోగులలోని అపోహలను తొలగించి, వారిలో ధైర్యాన్ని నింపాయి. ప్రపంచ పార్కిన్సన్ దినోత్సవ లోగోను డాక్టర్ బింధుమీనన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ పార్కిన్సన్ అనేది మెదడులోని నరాల బలహీనతకు సంబంధించిన ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పారు. శరీరంలో వణుకు, కదలికలు మందగించడం, కండరాల బిగుతు మరియు నడకలో స్థిరత్వం లేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. కేవలం శారీరక కదలికలే కాకుండా నిద్రలేని, మానసిక ఒత్తిడి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా రోగుల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న రోగుల కోసం " డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ " ( DBS ) వంటి అత్యాధునిక చికిత్సలను నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో తాము అందుబాటులోకి తీసుకోచ్చినట్లు డాక్టర్ బింధుమీనన్ వెల్లడించారు. ఈ చికిత్స ద్వారా రోగుల శారీరక కదలికలలో గణనీయమైన మార్పు రావడమే కాకుండా, వారు వాడే మందుల మోతాదును తగ్గించి, రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని తెలియజేశారు. '' ఇంటర్నేషనల్ పార్కిన్సన్ అండ్ మూవ్‌మెంట్ డిజార్డర్ సొసైటీ '' ద్వారా తాము ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అవగాహన, ముందస్తు రోగ నిర్ధారణ మరియు బహుళ విభాగాల సంరక్షణను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. "మెరుగైన మెదడు ఆరోగ్యం మరియు బలమైన సమాజం వైపు మనమందరం కలిసి అడుగులు వేద్దాం" అని డాక్టర్ బిందు మీనన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కిన్సన్ రోగులకు అండగా నిలుస్తూ, పరిశోధనలు మరియు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి , డాక్టర్ రష్మీ, డాక్టర్ శివశంకర్, డాక్టర్ వెంకట్ మరియు వైద్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు, ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు. రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది . రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    1
    బద్వేలు,  ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు.
రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది .
రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది .
ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    1
    నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి  గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
    1
    పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్  ఫీల్డ్ కు వెళ్లి జనగణన   సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • *పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం ACB అధికారులు సోదాలు నిర్వహించారు* . *పుంగనూరు మండలం, కంగానంపల్లి కి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వర్ అలియాస్ ఆనంద్ 2017-18 సంవత్సరంలో చేసిన నీరు చెట్టు పనులకు ఆరు లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. 8 సంవత్సరాల నుండి బిల్లులు పెట్టాలని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.* పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అబ్దుల్ రజాక్ బిల్లులు పెట్టాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పి సీతారామారావు తెలిపారు. చివరికి 13000 రూపాయలు ఇస్తానని చెప్పి, డబ్బులు ఇస్తుండగా ముందస్తుగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ రజాక్ ను పట్టుకున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.
    1
    *పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం ACB అధికారులు సోదాలు నిర్వహించారు* 
. *పుంగనూరు మండలం, కంగానంపల్లి కి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వర్ అలియాస్ ఆనంద్  2017-18 సంవత్సరంలో చేసిన నీరు చెట్టు పనులకు ఆరు లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. 8 సంవత్సరాల నుండి బిల్లులు పెట్టాలని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.*
పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అబ్దుల్ రజాక్ బిల్లులు పెట్టాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పి సీతారామారావు తెలిపారు. చివరికి 13000 రూపాయలు ఇస్తానని చెప్పి, డబ్బులు ఇస్తుండగా ముందస్తుగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ రజాక్ ను పట్టుకున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు
    1
    జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    3
    పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    5 hrs ago
  • ఎమ్మెల్సీ భరత్.. రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు.. తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పరచడానికి చిత్తూరు నుండి పీపీలను రప్పించి శ్రీహరిని రిమాండ్ చేయాలని ప్రయత్నించారు.. చట్టం గెలుస్తుందని ఈ ఘటన ఒక ఉదాహరణ.. వైసీపీ పార్టీ ఎప్పటికీ న్యాయం వైపు నిలబడుతుంది.. జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడడానికి కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు..
    1
    ఎమ్మెల్సీ భరత్..
రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు..
తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పరచడానికి చిత్తూరు నుండి పీపీలను రప్పించి శ్రీహరిని రిమాండ్ చేయాలని ప్రయత్నించారు..
చట్టం గెలుస్తుందని ఈ ఘటన ఒక ఉదాహరణ..
వైసీపీ పార్టీ ఎప్పటికీ న్యాయం వైపు నిలబడుతుంది..
జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడడానికి కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త #WomenReservationBill #YSRCPForWomen
    1
    చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త 
#WomenReservationBill
#YSRCPForWomen
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.