కేటీఆర్ పీఏ, పీఆర్వోకు హైకోర్టులో మధ్యంతర ఊరటదర్యాప్తు కొనసాగించేందుకు పోలీసులకు అనుమతి BREAKING NEWS హైదరాబాద్, సెప్టెంబర్ 14, 2026: తెలంగాణ శాసనసభ వద్ద సెప్టెంబర్ 7న జరిగిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు కుంబాల మహేందర్రెడ్డి, మీడియా కోఆర్డినేటర్, పీఆర్వో మాణిక్య మహేష్లకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర ఊరట లభించింది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జె. శ్రీనివాసరావు పోలీసులను వారిపై తదుపరి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇందులో అరెస్టు వంటి బలవంతపు చర్యలు కూడా ఉంటాయి. అయితే, కేసు దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించలేదు. దర్యాప్తు అధికారి తన విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి వివరణ కోరిన కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 21, 2026కు వాయిదా వేసింది. ఈ కేసు సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద పోలీసులు, అసెంబ్లీ మార్షల్స్ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ ఆరోపణలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ⚖️ న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మధ్యంతర రక్షణకు సంబంధించినవే తప్ప కేసు నుంచి పూర్తిస్థాయి విముక్తి లేదా ఎఫ్ఐఆర్ రద్దు అయినట్లు భావించరాదు. తదుపరి విచారణలో ఇరు పక్షాల వాదనలు, పోలీసుల సమాధానం ఆధారంగా న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. -షురూ న్యూస్ -
కేటీఆర్ పీఏ, పీఆర్వోకు హైకోర్టులో మధ్యంతర ఊరటదర్యాప్తు కొనసాగించేందుకు పోలీసులకు అనుమతి BREAKING NEWS హైదరాబాద్, సెప్టెంబర్ 14, 2026: తెలంగాణ శాసనసభ వద్ద సెప్టెంబర్ 7న జరిగిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు కుంబాల మహేందర్రెడ్డి, మీడియా కోఆర్డినేటర్, పీఆర్వో మాణిక్య మహేష్లకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర ఊరట లభించింది. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జె. శ్రీనివాసరావు పోలీసులను వారిపై తదుపరి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇందులో అరెస్టు వంటి బలవంతపు చర్యలు కూడా ఉంటాయి. అయితే, కేసు దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించలేదు. దర్యాప్తు అధికారి తన విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పోలీసుల నుంచి వివరణ కోరిన కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 21, 2026కు వాయిదా వేసింది. ఈ కేసు సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద పోలీసులు, అసెంబ్లీ మార్షల్స్ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ ఆరోపణలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ⚖️ న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మధ్యంతర రక్షణకు సంబంధించినవే తప్ప కేసు నుంచి పూర్తిస్థాయి విముక్తి లేదా ఎఫ్ఐఆర్ రద్దు అయినట్లు భావించరాదు. తదుపరి విచారణలో ఇరు పక్షాల వాదనలు, పోలీసుల సమాధానం ఆధారంగా న్యాయస్థానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. -షురూ న్యూస్ -
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.1
- హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.టైటిల్: 🚨 హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.1
- : మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ..దమ్మపేట సర్పంచ్ వినూత్న కార్యక్రమం మట్టి వినాయకులతోనే పర్యావరణ పరిరక్షణ..దమ్మపేట సర్పంచ్ వినూత్న కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మట్టి వినాయకుల పంపిణీ పర్యావరణ పరిరక్షణకు సర్పంచ్ రమాదేవి రాంబాబు పిలుపునిచ్చారు.దమ్మపేట పంచాయతీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ లో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకుని పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో గ్రామ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను అందజేస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. POP విగ్రహాల వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయి. అందుకే పర్యావరణ హితమైన మట్టి వినాయకులను పూజించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. గ్రామ ప్రజలందరూ సహకరించి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1