ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఓయూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మేరెడ్డి చంద్రారెడ్డి క్రీడోత్సవం-2026 క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి ఆల్ ఇండియా స్టేట్ యూనివర్సిటీస్ ప్రముక్ శ్రీ"అశ్విన్ ఠాగూర్"గారు టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న మందు, సిగరెట్, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలు సమాజానికి మరియు యువత భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అలాగే మొబైల్ ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల యువత ఆరోగ్యం మరియు చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. కాబట్టి యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండి, మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడల వైపు అడుగులు వేయాలి.ప్రతి రోజు కొంత సమయం గ్రౌండ్కి వెళ్లి క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్, స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ గంధం నరేందర్, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు గెల్లిశేఖర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తన్మై, జస్వంత్, అజయ్, మహేష్, సందీప్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఓయూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మేరెడ్డి చంద్రారెడ్డి క్రీడోత్సవం-2026 క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి ఆల్ ఇండియా స్టేట్ యూనివర్సిటీస్ ప్రముక్ శ్రీ"అశ్విన్ ఠాగూర్"గారు టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో పెరుగుతున్న మందు, సిగరెట్, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలు సమాజానికి మరియు యువత భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అలాగే మొబైల్ ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల యువత ఆరోగ్యం మరియు చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. కాబట్టి యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండి, మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడల వైపు అడుగులు వేయాలి.ప్రతి రోజు కొంత సమయం గ్రౌండ్కి వెళ్లి క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్, స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ గంధం నరేందర్, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు గెల్లిశేఖర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తన్మై, జస్వంత్, అజయ్, మహేష్, సందీప్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ / రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.1