ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం అత్యవసరమని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సర్వే అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు అనేక చోట్ల సిబ్బంది కొరత, మందుల కొరత, పరికరాల లేమి కారణంగా పూర్తిస్థాయిలో అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ తగిన సంఖ్యలో వైద్యులు లేకపోవడంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అవసరమైన పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీంతో పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు మరింత బలోపేతం చేయాలని, అత్యవసర విభాగాలు 24 గంటలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని రకాల మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే, ఇతర నిర్ధారణ పరీక్షల కోసం ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, రోగులకు పడకలు, ఫ్యాన్లు, తగినంత విద్యుత్, వేచివుండే షెడ్లు, తల్లిపాలు ఇచ్చే గదులు వంటి ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు. రోగులు, వారి సహాయకులతో గౌరవప్రదంగా వ్యవహరించేలా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని, అన్ని నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా నిర్వహించాలని అన్నారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, పడకలు తదితర సౌకర్యాలు మెరుగుపరచాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు బలోపేతం చేయాలని, పేద ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, లేకపోతే ప్రజలను సమీకరించి ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పాలడుగు ప్రభావతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యురాళ్లు మనుల అరుణ, కొంపెల్లి కౌసల్య, ఐద్వా నాయకులు సూదిని కళమ్మ, డి.లలిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం అత్యవసరమని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సర్వే అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు అనేక చోట్ల సిబ్బంది కొరత, మందుల కొరత, పరికరాల లేమి కారణంగా పూర్తిస్థాయిలో అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ తగిన సంఖ్యలో వైద్యులు లేకపోవడంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అవసరమైన పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీంతో పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు మరింత బలోపేతం చేయాలని, అత్యవసర విభాగాలు 24 గంటలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని రకాల మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే,
ఇతర నిర్ధారణ పరీక్షల కోసం ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, రోగులకు పడకలు, ఫ్యాన్లు, తగినంత విద్యుత్, వేచివుండే షెడ్లు, తల్లిపాలు ఇచ్చే గదులు వంటి ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు. రోగులు, వారి సహాయకులతో గౌరవప్రదంగా వ్యవహరించేలా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని, అన్ని నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా నిర్వహించాలని అన్నారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, పడకలు తదితర సౌకర్యాలు మెరుగుపరచాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు బలోపేతం చేయాలని, పేద ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, లేకపోతే ప్రజలను సమీకరించి ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పాలడుగు ప్రభావతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యురాళ్లు మనుల అరుణ, కొంపెల్లి కౌసల్య, ఐద్వా నాయకులు సూదిని కళమ్మ, డి.లలిత తదితరులు పాల్గొన్నారు.
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగాదేవి గుడి దగ్గర నైట్ నైట్ మట్టి అమ్ముతున్నారు చెరువు మట్టి అమ్ముతున్నారు అమ్మే దొంగలు ఎవరు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాను1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- బస్సు సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు పాలాభిషేకం,....... నడిగూడెం: కోదాడ నుంచి నడిగూడెం మీదుగా మోతే వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.1
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- శ్రీశ్రీ గంగాదేవి గుడి దగ్గర అర్ధరాత్రి చర్లమట్టి కొడుతున్నారు అలాగే కాంటాక్ట్ వరకు కూడా ఉదయం పనిచేస్తున్నారు నైట్ నైటు కొట్టే మట్టి ఇటుక బట్టీలకు పోతుంది అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1