Shuru
Apke Nagar Ki App…
స్వామివారి దర్శనానికి నాయకులకు ఆహ్వానం అందించిన హాలహర్వి గ్రామ పెద్దలు నందవరం మండలం హాలహర్వి గ్రామంలో శ్రీశ్రీశ్రీ శివాలయ ఆంజనేయస్వామి శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ, వైసీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ తదితర నాయకులను గ్రామ పెద్దలు ఆహ్వానించారు. నాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
K AMPAIAH ACHARI
స్వామివారి దర్శనానికి నాయకులకు ఆహ్వానం అందించిన హాలహర్వి గ్రామ పెద్దలు నందవరం మండలం హాలహర్వి గ్రామంలో శ్రీశ్రీశ్రీ శివాలయ ఆంజనేయస్వామి శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం ఈనెల 11న సాయంత్రం 4 గంటలకు వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ, వైసీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ తదితర నాయకులను గ్రామ పెద్దలు ఆహ్వానించారు. నాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.1
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.1
- నందికొట్కూరు ఎస్సై చంద్రశేఖర్ మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు 7993485111కి, బాల్య వివాహాలు లేదా పిల్లల నేరాలకు 1098కి కాల్ చేయాలని ఆయన సూచించారు. మారుతి నగర్లో జరిగిన ఈ అవగాహన సదస్సులో స్థానిక మహిళలు పాల్గొన్నారు.1
- నాగర్ కర్నూల్ లో ముంచెత్తిన వాన.. ముద్దయిన మొక్కజొన్న నెలికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాయంత్రం వేళ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో యార్డులో ఆరబోసిన పంట నీటిపాలైంది. ధాన్యం కొట్టుకుపోకుండా రైతులు ప్లాస్టిక్ కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని రైతాంగం కోరుతోంది1
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.1
- మే 11వ తేదీన ఒంగోలు ఎస్పీ కార్యాలయం మరియు మార్కాపురం ఎస్వీ కార్యాలయాలలో మీకోసం కార్యక్రమం ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మే 11 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 11 గంటల వరకే నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై 11 గంటల లోపే ముగుస్తుంది అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.1
- పన్ను రాబడిలో భారీ పతనం.. కూటమిపై వైసీపీ విమర్శలు.. చేతగానితనాన్ని లెక్కలతో బయటపెట్టిన కాగ్ నివేదిక సంపద సృష్టి పేరుతో రాష్ట్ర ఖజానా ఖాళీ: కారుమూరు వెంకటరెడ్డి1
- తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.1
- ఆంధ్రప్రదేశ్లో వీధి పేర్ల వివాదం మత విద్వేషాలకు దారితీస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానవత్వాన్ని పెంపొందించాల్సిన మతాలు ఇలాంటి చిచ్చుకు కారణమవడం విచారకరం. ఈ సంఘటనలను అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1