Shuru
Apke Nagar Ki App…
కొత్తపల్లిలో సూచిక బోర్డులు లేక వాహనదారుల, ప్రయాణికుల ఇబ్బందులు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, కొత్తగా వచ్చే వాహనదారులు, ప్రయాణికులు ఏ గ్రామం ఎంత దూరంలో ఉందో, ఏ వైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులను ఆపి దారి తెలుసుకుంటున్నారు. అధికారులు స్పందించి, గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద సూచికలు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జిల్లపల్లి ఇంద్ర
కొత్తపల్లిలో సూచిక బోర్డులు లేక వాహనదారుల, ప్రయాణికుల ఇబ్బందులు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, కొత్తగా వచ్చే వాహనదారులు, ప్రయాణికులు ఏ గ్రామం ఎంత దూరంలో ఉందో, ఏ వైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులను ఆపి దారి తెలుసుకుంటున్నారు. అధికారులు స్పందించి, గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద సూచికలు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1
- ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. బైట్:విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు2
- Post by Sampathkumar neerudu1
- మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో *అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,* జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం, కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలను కచ్చితంగా అమలుపరచాలని, పరిష్కరించిన ఫైళ్ళ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల అధికారులు, క్షేత్రస్థాయి మండల అధికారులకు సూచించారు, సీనియర్ సిటిజన్స్, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్, దివ్యాంగుల పెన్షన్, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు, *మండల ప్రధాన కార్యాస్థానం నుండి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత ఇనుగుర్తి, గార్ల, డోర్నకల్, కేసముద్రం, చిన్న గూడూరు, తహసిల్దార్లతో భూ సమస్య పరిష్కారం చేయుటకు ఆదేశాలు జారీ చేశారు,* ఈ సోమవారం దంతాలపల్లి మండలం తూర్పు తండ గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోతు నాగమణి తనకు చెందిన భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా భవన నిర్మాణానికి మంజూరి ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాలక వర్గం అట్టి భవన నిర్మాణం మరొక స్థలంలో నిర్మించుచున్నారని, ఇట్టి విషయంలో హైకోర్ట్ వారిని సంప్రదించామని, విచారణ చేసి హైకోర్టు నుండి తీర్పు వెలువడే వరకు అట్టి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయకుండా నిలుపుదల చేయమని కోరారు. డోర్నకల్ మండల కేంద్రంలోని యాదవ నగర్ కు చెందిన బొల్లం విజయ తన పేరు మీద మహబూబాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తన ఇంటి పట్టా భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసారని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని పరిశీలించి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. నెల్లికుదురు మండలం శ్రీరాం నగర్ గ్రామం శివారు వెంకటాపూరు కు చెందిన బుర్ర కర్ణాకర్ తాను దివ్యాంగుడినని వికలాంగుల స్కూటి ఇప్పించగలరని కోరారు. కురవి మండల కేంద్రానికి చెందిన నిమ్మల భిక్షం తనకు ఉన్న సర్వే నెంబర్ లో గల భూమి రోడ్డు అని చూపిస్తుందని దానిని సరిచేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా పాసు పుస్తకము ఇప్పించగలరని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో వివిధ శాఖలకు సంబంధించి ( 156 ) వచ్చిన దరఖాస్తులకు సంబందిత అధికారులకు పరిష్కారానికి ఆదేశించారు.1
- Spilak (Chipkali) ki tahari, Mahboob tahari centre par hangama, ek shaqs ki tahari se nikli paki hui chipkali...#Purani haveli Hyderabad1
- प्यार में इनकार का खौफनाक बदला! महिला को लगाया HIV संक्रमित खून का इंजेक्शन एकतरफा प्यार में इनकार से बौखलाए युवक ने हैरान कर देने वाली वारदात को अंजाम दिया। आरोप है कि युवक ने शादी के लिए महिला पर दबाव बनाया, लेकिन जब उसने साफ इनकार कर दिया तो उसने बदला लेने की ठान ली। बताया जा रहा है कि आरोपी ने HIV संक्रमित खून का इंतजाम किया और मौका पाकर महिला के शरीर में इंजेक्शन लगा दिया। उसकी सोच थी कि अगर महिला संक्रमित हो जाएगी तो कोई उससे शादी नहीं करेगा और आखिरकार उसे उसी के पास आना पड़ेगा। घटना सामने आने के बाद इलाके में सनसनी फैल गई है। पुलिस मामले की जांच कर रही है और आरोपी की तलाश जारी है। यह घटना समाज में बढ़ती विकृत मानसिकता पर बड़ा सवाल खड़ा करती है।1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో నీటి కొరత రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఎండిపోగా, వరి పంటలు ఎండిపోతున్నాయి. రావూరు, సీత్యాతండాకు చెందిన రైతు రమావత్ దసురు 2.16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రూ.50 వేల పెట్టుబడి పెట్టిన ఆయన, చేసేదేమీ లేక పంటను పశువులకు మేతగా వదిలివేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మ! హైదరాబాద్ : టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్, టీ20 వరల్డ్ కప్-2026 విజేత తిలక్ వర్మ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి నగరానికి చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ గడ్డ గర్వపడేలా చేసినందుకు తిలక్ వర్మను సీఎం ప్రశంసించారు.కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1
- Post by Sampathkumar neerudu1