logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాలు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నిరసనల పరంపరలో భాగంగా, జూన్ 4న బొబ్బిలి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన "బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" బాండ్ పేపర్లను దగ్ధం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసనలు తెలిపారు. జూన్ 9న శ్రీ సూర్య రెసిడెన్సీలో రైతులు, మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి ఇండోర్ మీటింగ్ నిర్వహించి, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రశ్నించారు. అలాగే, శుక్రవారం బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఓంకార్ థియేటర్ జంక్షన్ నుండి తాండ్రపాపారాయుడు విగ్రహం వరకు భారీ ఊరేగింపు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన అన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ అని చెప్పి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, బ్యాక్ డోర్ పద్ధతిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు ₹1500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే కాలేజీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై మాట్లాడుతూ, "మీరు ఎన్ని ఆంక్షలు విధించినా మేం వెనక్కి తగ్గేదే లేదు. మేం గోడకు కొట్టిన బంతి లాంటి వాళ్లం, ప్రజా సమస్యలపై మరింత దీటుగా ప్రజల తరుపున పోరాడుతాము" అని శంబంగి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ ఇంటి గోపాలరావు, జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి శంబంగి వేణు గోపాల్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణారావు, బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదర రావు, బొబ్బిలి పట్టణ పార్టీ అధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, తెర్లాం మండలం పార్టీ అధ్యక్షులు తెంటు సత్యం నాయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు యమల శివప్రసాద్, తెర్లాం మండల అధ్యక్షులు ఉమా లక్ష్మీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలు, మండలాల యువజన అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు మరియు నాలుగు మండలాల & పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

18 hrs ago
user_బొబ్బిలి గణేష్
బొబ్బిలి గణేష్
Salesperson బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాలు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నిరసనల పరంపరలో భాగంగా, జూన్ 4న బొబ్బిలి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన "బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" బాండ్ పేపర్లను దగ్ధం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసనలు తెలిపారు. జూన్ 9న శ్రీ సూర్య రెసిడెన్సీలో రైతులు, మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి ఇండోర్ మీటింగ్ నిర్వహించి, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రశ్నించారు. అలాగే, శుక్రవారం బొబ్బిలి మాజీ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఓంకార్ థియేటర్ జంక్షన్ నుండి తాండ్రపాపారాయుడు విగ్రహం వరకు భారీ ఊరేగింపు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు అడుగడుగునా ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన అన్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ అని చెప్పి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, బ్యాక్ డోర్ పద్ధతిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు ₹1500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే కాలేజీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై మాట్లాడుతూ, "మీరు ఎన్ని ఆంక్షలు విధించినా మేం వెనక్కి తగ్గేదే లేదు. మేం గోడకు కొట్టిన బంతి లాంటి వాళ్లం, ప్రజా సమస్యలపై మరింత దీటుగా ప్రజల తరుపున పోరాడుతాము" అని శంబంగి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నెంబర్ ఇంటి గోపాలరావు, జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి శంబంగి వేణు గోపాల్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ కృష్ణారావు, బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదర రావు, బొబ్బిలి పట్టణ పార్టీ అధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, తెర్లాం మండలం పార్టీ అధ్యక్షులు తెంటు సత్యం నాయుడు, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు యమల శివప్రసాద్, తెర్లాం మండల అధ్యక్షులు ఉమా లక్ష్మీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు ఇన్చార్జిలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలు, మండలాల యువజన అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు మరియు నాలుగు మండలాల & పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 12న విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ఆట, పాట పిల్లలకు పని, పాట పెద్దలకు' అనే వాల్ పోస్టరును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ మరియు ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పోస్టరును ఆవిష్కరించిన అనంతరం ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, బాలలు పనుల్లో కాకుండా బడిలో మాత్రమే ఉండాలని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పిల్లలను బాల కార్మికులుగా వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100/112కు అందించాలని కోరారు. చిట్టి చేతులతో పనులు చేయించడం దుర్మార్గమైన చర్య అని, ఆట, పాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలను పనుల్లో వినియోగించడం నేరమన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాదులు వేయాలని, వారిని చదివించే ఆర్థిక స్థితి లేకుంటే ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించాలని సూచించారు. బాలల సంరక్షణకు కృషి చేసే ఎన్.జి.ఓ.ల సహకారం తీసుకోవాలని, బాలలను పనుల్లో పెట్టినా, వారితో పనులు చేయించినా బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతీ పోలీసు స్టేషనులో ఒక సబ్ ఇన్‌స్పెక్టరు స్థాయి అధికారి బాలల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వెల్లడించారు. అనంతరం, జిల్లా ఎస్పీ బాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. 18 సం. లోపు బాలల హక్కులు ఉల్లంఘించినా, బాల కార్మికులు కనిపించినా, బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100/112కు లేదా స్థానిక పోలీసులకు అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) 1992లో జూన్ 12ను అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. కార్మికులుగా ఉన్న బాలలకు విద్యను అందించడం, వారి కుటుంబాలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఐ.ఎల్.ఓ. అన్ని దేశాలను ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా దేశంలో అమలవుతున్న బాల కార్మిక నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనరు పి.చిట్టిబాబు, డి.వి.ఎస్.యు. రాష్ట్ర కో-ఆర్డినేటరు కే.సిహెచ్.బంగారురాజు, ఇతర అధికారులు మరియు బాలలు పాల్గొన్నారు.
    1
    అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 12న విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ఆట, పాట పిల్లలకు పని, పాట పెద్దలకు' అనే వాల్ పోస్టరును జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ మరియు ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పోస్టరును ఆవిష్కరించిన అనంతరం ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, బాలలు పనుల్లో కాకుండా బడిలో మాత్రమే ఉండాలని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పిల్లలను బాల కార్మికులుగా వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100/112కు అందించాలని కోరారు. చిట్టి చేతులతో పనులు చేయించడం దుర్మార్గమైన చర్య అని, ఆట, పాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలను పనుల్లో వినియోగించడం నేరమన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాదులు వేయాలని, వారిని చదివించే ఆర్థిక స్థితి లేకుంటే ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించాలని సూచించారు. బాలల సంరక్షణకు కృషి చేసే ఎన్.జి.ఓ.ల సహకారం తీసుకోవాలని, బాలలను పనుల్లో పెట్టినా, వారితో పనులు చేయించినా బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతీ పోలీసు స్టేషనులో ఒక సబ్ ఇన్‌స్పెక్టరు స్థాయి అధికారి బాలల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వెల్లడించారు. అనంతరం, జిల్లా ఎస్పీ బాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. 18 సం. లోపు బాలల హక్కులు ఉల్లంఘించినా, బాల కార్మికులు కనిపించినా, బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100/112కు లేదా స్థానిక పోలీసులకు అందించాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) 1992లో జూన్ 12ను అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. కార్మికులుగా ఉన్న బాలలకు విద్యను అందించడం, వారి కుటుంబాలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఐ.ఎల్.ఓ. అన్ని దేశాలను ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా దేశంలో అమలవుతున్న బాల కార్మిక నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనరు పి.చిట్టిబాబు, డి.వి.ఎస్.యు. రాష్ట్ర కో-ఆర్డినేటరు కే.సిహెచ్.బంగారురాజు, ఇతర అధికారులు మరియు బాలలు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షులు ఎం. జబ్బు నాయుడు డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు పలు ఇతర అంశాలపై పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించగా, భారీ సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం. జబ్బు నాయుడు ప్లాంట్‌లోని పరికరాలను మెయింటెనెన్స్ చేయాలని, కార్మికుల ప్రాణాలకు తగిన భద్రత కల్పించాలని, మరియు అవసరమైన స్పేర్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే, ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
    1
    స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షులు ఎం. జబ్బు నాయుడు డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు పలు ఇతర అంశాలపై పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించగా, భారీ సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎం. జబ్బు నాయుడు ప్లాంట్‌లోని పరికరాలను మెయింటెనెన్స్ చేయాలని, కార్మికుల ప్రాణాలకు తగిన భద్రత కల్పించాలని, మరియు అవసరమైన స్పేర్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే, ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
    user_N.S.R.Guptha
    N.S.R.Guptha
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాసలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పలాస కాంప్లెక్స్‌ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కాశీబుగ్గలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ఘనంగా సాగింది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. పార్టీ జెండాలు, నినాదాలతో పలాస-కాశీబుగ్గ ప్రధాన రహదారులు మార్మోగాయి. కార్యకర్తలు వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటూ నినాదాలు చేశారు. అనంతరం కాశీబుగ్గలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుపేదల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రజలకు చెప్పిన మాటలు నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని విధాలుగా అమలు చేశారని సిదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పలాసలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పలాస కాంప్లెక్స్‌ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కాశీబుగ్గలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ఘనంగా సాగింది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. పార్టీ జెండాలు, నినాదాలతో పలాస-కాశీబుగ్గ ప్రధాన రహదారులు మార్మోగాయి. కార్యకర్తలు వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటూ నినాదాలు చేశారు. అనంతరం కాశీబుగ్గలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుపేదల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రజలకు చెప్పిన మాటలు నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని విధాలుగా అమలు చేశారని సిదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన విభాగం సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ratnala Ramesh
    Ratnala Ramesh
    Teacher పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. మల్లికార్జున నాయక్ శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్‌తో కలిసి జిల్లా స్థాయి అధికారులతో ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజూరైన వివిధ శాఖల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి కోసం రబ్బర్, పామాయిల్ తోటల పెంపకంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై వరి విత్తనాలను అందించాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని, పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహాలను జూలై చివరినాటికి పూర్తి చేయాలని ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీలు, బాలబాలికల్లో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని మల్లికార్జున నాయక్ ఉద్ఘాటించారు. అలాగే, గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, వీధిలైట్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి పి. అంబేద్కర్, వివిధ శాఖల అధికారులు, ఈఈలు, తహసిల్దార్లు మరియు ఎంపీడీవోలు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. మల్లికార్జున నాయక్ శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్‌తో కలిసి జిల్లా స్థాయి అధికారులతో ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజూరైన వివిధ శాఖల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉపాధి హామీ పథకం కింద ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి కోసం రబ్బర్, పామాయిల్ తోటల పెంపకంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీపై వరి విత్తనాలను అందించాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని, పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహాలను జూలై చివరినాటికి పూర్తి చేయాలని ముఖ్య కార్యదర్శి స్పష్టం చేశారు.

గర్భిణీ స్త్రీలు, బాలబాలికల్లో రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని మల్లికార్జున నాయక్ ఉద్ఘాటించారు. అలాగే, గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, వీధిలైట్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి పి. అంబేద్కర్, వివిధ శాఖల అధికారులు, ఈఈలు, తహసిల్దార్లు మరియు ఎంపీడీవోలు పాల్గొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్సీపి ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. 'చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు' అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్న వైయస్సార్సీపి శ్రేణులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి ఇంచార్జ్ ముద్రగడ గిరి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
    3
    కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్సీపి ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. 'చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు' అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్న వైయస్సార్సీపి శ్రేణులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి ఇంచార్జ్ ముద్రగడ గిరి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    12 hrs ago
  • అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తిలోని సావరం గ్రామంలో శ్రీ కోదండరామ సాంస్కృతిక భవనానికి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ, ఫ్లోరింగ్, మరియు షెడ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి మండలం, గ్రామ కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    2
    అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తిలోని సావరం గ్రామంలో శ్రీ కోదండరామ సాంస్కృతిక భవనానికి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ, ఫ్లోరింగ్, మరియు షెడ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి మండలం, గ్రామ కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • అనపర్తి ప్రధాన కేంద్రంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు ఒక భారీ నిరసన ర్యాలీని నిర్వహించాయి. "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" అనే కార్యక్రమం కింద ఈ నిరసన జరిగింది. ఇందులో పార్టీ శ్రేణులు చంద్రబాబు రాజకీయ విధానాలపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో భాగంగా, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలకు దృశ్యరూపంలో వివరించేందుకు ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఆ తర్వాత "సూపర్-6" హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారనే సందేశాన్ని కళాత్మకంగా ఆవిష్కరించారు. "సూపర్-6" పథకాల ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తులను, చంద్రబాబు మాస్కులు ధరించిన వ్యక్తులు గుణపాలు, కత్తులతో వెన్నుపోటు పొడుస్తున్నట్లుగా ప్రదర్శించి, ఎన్నికల హామీలు ఎలా నెరవేరలేదో ప్రతీకాత్మకంగా వివరించారు. ఈ వినూత్న నిరసన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకోగా, పలువురు ఆసక్తిగా తిలకించి తమ మద్దతు తెలియజేశారు.
    1
    అనపర్తి ప్రధాన కేంద్రంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు ఒక భారీ నిరసన ర్యాలీని నిర్వహించాయి. "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" అనే కార్యక్రమం కింద ఈ నిరసన జరిగింది. ఇందులో పార్టీ శ్రేణులు చంద్రబాబు రాజకీయ విధానాలపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాయి.

ఈ నిరసనలో భాగంగా, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలకు దృశ్యరూపంలో వివరించేందుకు ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఆ తర్వాత "సూపర్-6" హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారనే సందేశాన్ని కళాత్మకంగా ఆవిష్కరించారు. "సూపర్-6" పథకాల ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తులను, చంద్రబాబు మాస్కులు ధరించిన వ్యక్తులు గుణపాలు, కత్తులతో వెన్నుపోటు పొడుస్తున్నట్లుగా ప్రదర్శించి, ఎన్నికల హామీలు ఎలా నెరవేరలేదో ప్రతీకాత్మకంగా వివరించారు. ఈ వినూత్న నిరసన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకోగా, పలువురు ఆసక్తిగా తిలకించి తమ మద్దతు తెలియజేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    15 hrs ago
  • కాకినాడలోని జగన్నాధపురం ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. థియేటర్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ములగపాటి సందీప్ అనే యువకుడు తమ కుమార్తెను ఉరివేసి హత్య చేశాడని, ఆ తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు, ఎస్సై, పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ కేసులో అనుమానితుడైన సందీప్‌ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని వారు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గత ఏడు నెలలుగా మృతురాలు లాఫి మరియు సందీప్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గతంలో ఈ విషయంపై ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారని, అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు సర్దిచెప్పి పంపించారని వారు తెలిపారు. ప్రస్తుతం తమ కుమార్తెను కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కాకినాడలోని జగన్నాధపురం ప్రాంతంలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. థియేటర్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ములగపాటి సందీప్ అనే యువకుడు తమ కుమార్తెను ఉరివేసి హత్య చేశాడని, ఆ తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు, ఎస్సై, పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఈ కేసులో అనుమానితుడైన సందీప్‌ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని వారు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గత ఏడు నెలలుగా మృతురాలు లాఫి మరియు సందీప్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. గతంలో ఈ విషయంపై ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారని, అయితే ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు సర్దిచెప్పి పంపించారని వారు తెలిపారు.

ప్రస్తుతం తమ కుమార్తెను కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • శుక్రవారం విశాఖ బీచ్‌రోడ్డులోని నోవాటెల్ ఎదురుగా ఉన్న సముద్ర తీరానికి ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. ఈ సమాచారం అందుకున్న మెరైన్ మరియు ఎంఆర్‌పేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతురాలు ఎవరు, అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఎంఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు, ఇంకా పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
    1
    శుక్రవారం విశాఖ బీచ్‌రోడ్డులోని నోవాటెల్ ఎదురుగా ఉన్న సముద్ర తీరానికి ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. ఈ సమాచారం అందుకున్న మెరైన్ మరియు ఎంఆర్‌పేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతురాలు ఎవరు, అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఎంఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు, ఇంకా పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
    user_N.S.R.Guptha
    N.S.R.Guptha
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.