*పేదల క్వారీ పై బడా కాంట్రాక్టర్ దౌర్జన్యం దుర్మార్గం - తక్షణమే మారుతి రామా సోసైటికీ మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలి* _లేని పక్షంలో ఆందోళన ఉధృతం_ _సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ_ మా క్వారీని మాకు కేటాయించండి - కబ్జా దారుడు బడా _కాంట్రాక్టర్ పెమ్మసాని శ్రీధర్ నుండి మా క్వారీని కాపాడండి_ 👉 ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాక్కియ కు క్వారీ సొసైటీ సభ్యులు మరియు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి వి కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు పి వి ఆంజనేయులు, ఇబ్రహీంపట్నం సిపిఎం మండల కార్యదర్శి యం మహేష్ కలిసి సమస్యపై జాయిన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి *ఇబ్రహీంపట్నం, మార్చి 30, (గళమ్ న్యూస్)* కొండపల్లి కొత్త గేటు ఇబ్రహీంపట్నం కి చెందిన వడ్డెర సామాజిక వర్గం మారుతి కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు జి కొండూరు మండలం లోయ ప్రాంతంలో కడియం పోతవరం గ్రామ పరిధిలో ఆర్ఎస్ నెంబర్ 26/2 లో 6 హెక్టార్లకు ప్లీజ్ క్వారీని చేసుకునేందుకు డిడిని మైనింగ్ డిపార్ట్మెంట్ కి కట్టి స్వాధీనం చేసుకున్న మా క్వారీని కబ్జాక్ దారుడు బడా కాంట్రాక్టర్ పెమ్మసాని శ్రీధర్ అనే అతను దౌర్జన్యంగా మమ్మల్ని మా క్వారీలోకి వెళ్ళనివ్వకుండా రాజకీయ పలుకుబడితో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ మైనింగ్ డిపార్ట్మెంట్ స్పందించి మా క్వారీని మాకే ఇప్పించాలని నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి జాయింట్ కలెక్టర్ కు పి జె ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని మాకు మద్దతుగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ కార్యదర్సి వర్గ సభ్యులు పీవీ ఆంజనేయులు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ హాజరయ్యి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించిన పక్షంలో వడ్డెర నిరుపేదలైన మారుతి సొసైటీ వారికి అండగా ఉండేందుకు పోరాడుతామని తెలిపారు.ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ క్వారీలు బంగారు గనులు అయ్యాయని పేదలకు చెందాల్సిన క్వారీని బడా కాంట్రాక్టర్లు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని పేదలపైన దౌర్జన్యాలు అధికార బెదిరింపులు పాల్పడుతున్నారని అలాంటి వారిపై మైనింగ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని అసలైన లబ్ధిదారులుగా ఉన్న మారుతిరామా సొసైటీ వారికి ఆ క్వారీని పనిచేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో క్వారీ వద్ద సొసైటీ సభ్యులతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ యన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ రెవిన్యూ డివిఎన్, ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం గ్రామము. మారుతిరామా క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, రిజిష్టరు నెం. 3213, సొసైటీ క్వారీ ఇబ్రహీంపట్నం - 521456. విషయము: జి. కొండూరు మండలం, లోయ గ్రామము, ఆర్.యస్. నెం. 26/2 రు దాఖలా 5 Date of Payment: 18.07.2025 Transaction ID: TMNC00017573, Application ID MN0625002783. Applicant Name: Pedda Mattaiah Alakunta, CFMS Transaction ID: 90071864652025, Application Fee Amount Rs. 7500/- Security Deposit Amount: Rs.4,02,500/-, User Charges Amount: Rs. 4,08,000/- అయ్యా! ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన హిందూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారమైన మేము మా తాతలు తండ్రుల నుండి క్వారీయింగ్ పనులు అయిన రోడ్మెటల్ కంకరు తయారుచేయు దైనందిన కూలీలము అందరము సంఘటితంగా ఏర్పడి 1984 సం|| నుండి శ్రీ మారుతిరామా క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీ,రిజిష్టర్డు నెం.జి-3213,170 మెంబర్సు మరియు కుటుంబాలు (ఒకే సామాజిక వర్గం) వారము,రెక్కలు ముక్కలు చేసుకొని బండలు బట్టలు చేసుకొని జీవనము చేయుచున్నాము.లోగడ కొండపల్లి గ్రామము ప్రస్తుతం నగరపంచాయితీగా అవతరించిన గ్రామానికి చెందిన 484 నందు 0.4-80ర్లు విస్తీర్ణం గల క్వారీకి ప్రతిపాదించిన స్థలం జ్యోల్ డెవలప్మెంట్ ప్లాను ప్రకారం నివాస యోగ్యంగా ఉన్నదని విజిటియం ఉదా ఉపాధ్యాక్షులు విజయవాడ వారు తిరస్కరించినారు.గాన ఎటువంటి జీవనాధారం లేని మా 170 సంఘ మెంబర్లు కుటుంబాలకు సదరు జి. కొండూరు మండలం,లోయ గ్రామానికి చెందిన ఆర్.యస్.నెం.26/2 రు దాఖలా 6 హెక్టార్ల క్వారీని పొందుటకు అప్లికేషన్ మైనింగ్ కార్యాలయమునకు డిడి చెల్లించి అర్జీ సమర్పించారు.కొంతమంది.బినామీదార్లను పెట్టి కొన్ని అప్లికేషన్లను వారి మనుషుల ద్వారా పెట్టించి లేబర్ సొసైటీ కూలీలుగా ఉన్న మా పై దౌర్జన్యంతో మేము కట్టిన సర్వే నెంబరులో పని ప్రారంభించి మా 170 కుటుంబాలు నోటీకాడ జీవనము పొందకుండా అడ్డుకుంటున్నారు.కావున మానవీయకోణంలో చూచి మాకు న్యాయం జరిపించగలరు.అని తమరి ఘనతను మిక్కిలి వినయముతో కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఆలకుంట మట్టయ్య,వైస్ ప్రెసిడెంట్ వల్లపు కనకయ్య,కొంచెం విష్ణు,బాల,మహిళలు సోసైటి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
*పేదల క్వారీ పై బడా కాంట్రాక్టర్ దౌర్జన్యం దుర్మార్గం - తక్షణమే మారుతి రామా సోసైటికీ మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వాలి* _లేని పక్షంలో ఆందోళన ఉధృతం_ _సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ_ మా క్వారీని మాకు కేటాయించండి - కబ్జా దారుడు బడా _కాంట్రాక్టర్ పెమ్మసాని శ్రీధర్ నుండి మా క్వారీని కాపాడండి_ 👉 ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాక్కియ కు క్వారీ సొసైటీ సభ్యులు మరియు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి వి కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు పి వి ఆంజనేయులు, ఇబ్రహీంపట్నం సిపిఎం మండల కార్యదర్శి యం మహేష్ కలిసి సమస్యపై జాయిన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి *ఇబ్రహీంపట్నం, మార్చి 30, (గళమ్ న్యూస్)* కొండపల్లి కొత్త గేటు ఇబ్రహీంపట్నం కి చెందిన వడ్డెర సామాజిక వర్గం మారుతి కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు జి కొండూరు మండలం లోయ ప్రాంతంలో కడియం పోతవరం గ్రామ పరిధిలో ఆర్ఎస్ నెంబర్ 26/2 లో 6 హెక్టార్లకు ప్లీజ్ క్వారీని చేసుకునేందుకు డిడిని మైనింగ్ డిపార్ట్మెంట్ కి కట్టి స్వాధీనం చేసుకున్న మా క్వారీని కబ్జాక్ దారుడు బడా కాంట్రాక్టర్ పెమ్మసాని శ్రీధర్ అనే అతను దౌర్జన్యంగా మమ్మల్ని మా క్వారీలోకి వెళ్ళనివ్వకుండా రాజకీయ పలుకుబడితో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ మైనింగ్ డిపార్ట్మెంట్ స్పందించి మా క్వారీని మాకే ఇప్పించాలని నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి జాయింట్ కలెక్టర్ కు పి జె ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని మాకు మద్దతుగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ కార్యదర్సి వర్గ సభ్యులు పీవీ ఆంజనేయులు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ హాజరయ్యి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించిన పక్షంలో వడ్డెర నిరుపేదలైన మారుతి సొసైటీ వారికి అండగా ఉండేందుకు పోరాడుతామని తెలిపారు.ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ క్వారీలు బంగారు గనులు అయ్యాయని పేదలకు చెందాల్సిన క్వారీని బడా కాంట్రాక్టర్లు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని పేదలపైన దౌర్జన్యాలు అధికార బెదిరింపులు పాల్పడుతున్నారని అలాంటి వారిపై మైనింగ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని అసలైన లబ్ధిదారులుగా ఉన్న మారుతిరామా సొసైటీ వారికి ఆ క్వారీని పనిచేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో క్వారీ వద్ద సొసైటీ సభ్యులతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ యన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ రెవిన్యూ డివిఎన్, ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం గ్రామము. మారుతిరామా క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, రిజిష్టరు నెం. 3213, సొసైటీ క్వారీ ఇబ్రహీంపట్నం - 521456. విషయము: జి. కొండూరు మండలం, లోయ గ్రామము, ఆర్.యస్. నెం. 26/2 రు దాఖలా 5 Date of Payment: 18.07.2025 Transaction ID: TMNC00017573, Application ID MN0625002783. Applicant Name: Pedda Mattaiah Alakunta, CFMS Transaction ID: 90071864652025, Application Fee Amount Rs. 7500/- Security Deposit Amount: Rs.4,02,500/-, User Charges Amount: Rs. 4,08,000/- అయ్యా! ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన హిందూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారమైన మేము మా తాతలు తండ్రుల నుండి క్వారీయింగ్ పనులు అయిన రోడ్మెటల్ కంకరు తయారుచేయు దైనందిన కూలీలము అందరము సంఘటితంగా ఏర్పడి 1984 సం|| నుండి శ్రీ మారుతిరామా క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీ,రిజిష్టర్డు నెం.జి-3213,170 మెంబర్సు మరియు కుటుంబాలు (ఒకే సామాజిక వర్గం) వారము,రెక్కలు ముక్కలు చేసుకొని బండలు బట్టలు చేసుకొని జీవనము చేయుచున్నాము.లోగడ కొండపల్లి గ్రామము ప్రస్తుతం నగరపంచాయితీగా అవతరించిన గ్రామానికి చెందిన 484 నందు 0.4-80ర్లు విస్తీర్ణం గల క్వారీకి ప్రతిపాదించిన స్థలం జ్యోల్ డెవలప్మెంట్ ప్లాను ప్రకారం నివాస యోగ్యంగా ఉన్నదని విజిటియం ఉదా ఉపాధ్యాక్షులు విజయవాడ వారు తిరస్కరించినారు.గాన ఎటువంటి జీవనాధారం లేని మా 170 సంఘ మెంబర్లు కుటుంబాలకు సదరు జి. కొండూరు మండలం,లోయ గ్రామానికి చెందిన ఆర్.యస్.నెం.26/2 రు దాఖలా 6 హెక్టార్ల క్వారీని పొందుటకు అప్లికేషన్ మైనింగ్ కార్యాలయమునకు డిడి చెల్లించి అర్జీ సమర్పించారు.కొంతమంది.బినామీదార్లను పెట్టి కొన్ని అప్లికేషన్లను వారి మనుషుల ద్వారా పెట్టించి లేబర్ సొసైటీ కూలీలుగా ఉన్న మా పై దౌర్జన్యంతో మేము కట్టిన సర్వే నెంబరులో పని ప్రారంభించి మా 170 కుటుంబాలు నోటీకాడ జీవనము పొందకుండా అడ్డుకుంటున్నారు.కావున మానవీయకోణంలో చూచి మాకు న్యాయం జరిపించగలరు.అని తమరి ఘనతను మిక్కిలి వినయముతో కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఆలకుంట మట్టయ్య,వైస్ ప్రెసిడెంట్ వల్లపు కనకయ్య,కొంచెం విష్ణు,బాల,మహిళలు సోసైటి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.1
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- Post by Syyed taher1
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా హైదరాబాదులో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నా అభినయంతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు పాటకు శోభన్ బాబును అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే స్టెప్పులను చూసిన ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.3
- నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- Post by Ramprasad islavath1