బాలుడు కొరకు సంప్రదించండి శ్రీకాకుళం:జిల్లా బాలల రక్షణ విభాగం (డి.సి.పి.యు) – శ్రీకాకుళం జిల్లా జిల్లా మహిళ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం మిషన్ వాత్సల్య కార్యక్రమం ఇందు తెలియజేయునది ఏమనగా ప్రక్క ఫోటో లో ఉన్న బాలుడు పేరు సోయల్ అలియాస్ సెంతి(ఎ)రాసియా, వయస్సు సుమారు 9సం.లు, ఈ బాలుడు తే 25.09.2023 ది న చెన్నై రైల్వే స్టేషన్ వద్ద, రైల్వే పోలీసులకు దొరికాడు. చెన్నై రైల్వే పోలీసులు అదే రోజున చెన్నై నార్త్ జోన్ బాలల సంక్షేమ సమితి ముందు సదరు బాలుడిని హాజరు పరచి స్థానిక బాలల రక్షిత గృహంలో ఆశ్రయం కల్పించి తదుపరి విచారణ జరిపిన పిదప చెన్నై బాలల రక్షణ అధికారులు బాలుడుది, శ్రీకాకుళం జిల్లా అని తే 27.02.2024 ది న శ్రీకాకుళం జిల్లా బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. వెంటనే బాలల సంక్షేమ సమితి, శ్రీకాకుళం వారు శ్రీకాకుళం పట్టణంలో గల శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం బాలుర రక్షిత గృహంలో ఆశ్రయం కల్పించుట జరిగింది. అనంతరం జిల్లా బాలల రక్షణ విభాగం సిబ్బంది బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించగా తన పేరు సోయల్ అని తప్పా అమ్మా, నాన్నలు పేర్లు గానీ, చిరునామా గాని చెప్పలేక పోతున్నాడు. బాలుడుకు మానసిక పరిపక్వత తక్కువగా ఉన్నందున వివరాలు ఏమీ చెప్పలేక పోతున్నాడు. ప్రస్తుతం బాలుడు బాలల సంక్షేమ సమితి, శ్రీకాకుళం వారి ఆదేశములతో విశాఖపట్నం లో గల ప్రభుత్వ బాలుర రక్షిత గృహంలో ఆశ్రయం పొందుతున్నాడు. బాలుడి యొక్క తల్లిదండ్రులుగాని, ఇతర బంధువులుగాని బాలుడి కి సంబందించిన తగిన ఆధారాలు తీసుకువచ్చినయడల, వారికి బాలల సంక్షేమ సమితి, శ్రీకాకుళం వారి ద్వారా బాలుడిని అప్పగించబడును. అలాగే బాలుని ఎవరైనా గుర్తుపట్టినచో వెంటనే బాలుని చిరునామాను ఈ క్రింద తెలియజేసిన పోన్ నంబర్లకు పోన్ చేసి తెలియజేయవలసినదిగా కోరడమైనది. సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్స్: 9440030230 / 9989634481.
బాలుడు కొరకు సంప్రదించండి శ్రీకాకుళం:జిల్లా బాలల రక్షణ విభాగం (డి.సి.పి.యు) – శ్రీకాకుళం జిల్లా జిల్లా మహిళ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం మిషన్ వాత్సల్య కార్యక్రమం ఇందు తెలియజేయునది ఏమనగా ప్రక్క ఫోటో లో ఉన్న బాలుడు పేరు సోయల్ అలియాస్ సెంతి(ఎ)రాసియా, వయస్సు సుమారు 9సం.లు, ఈ బాలుడు తే 25.09.2023 ది న చెన్నై రైల్వే స్టేషన్ వద్ద, రైల్వే పోలీసులకు దొరికాడు. చెన్నై రైల్వే పోలీసులు అదే రోజున చెన్నై నార్త్ జోన్ బాలల సంక్షేమ సమితి ముందు సదరు బాలుడిని హాజరు పరచి స్థానిక బాలల రక్షిత గృహంలో ఆశ్రయం కల్పించి తదుపరి విచారణ జరిపిన పిదప చెన్నై బాలల రక్షణ అధికారులు బాలుడుది, శ్రీకాకుళం జిల్లా అని తే 27.02.2024 ది న శ్రీకాకుళం జిల్లా బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. వెంటనే బాలల సంక్షేమ సమితి, శ్రీకాకుళం వారు శ్రీకాకుళం పట్టణంలో గల శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం బాలుర రక్షిత గృహంలో ఆశ్రయం కల్పించుట జరిగింది. అనంతరం జిల్లా బాలల రక్షణ విభాగం సిబ్బంది బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించగా తన పేరు సోయల్ అని తప్పా అమ్మా, నాన్నలు పేర్లు గానీ, చిరునామా గాని చెప్పలేక పోతున్నాడు. బాలుడుకు మానసిక పరిపక్వత తక్కువగా ఉన్నందున వివరాలు ఏమీ చెప్పలేక పోతున్నాడు. ప్రస్తుతం బాలుడు బాలల సంక్షేమ సమితి, శ్రీకాకుళం వారి ఆదేశములతో విశాఖపట్నం లో గల ప్రభుత్వ బాలుర రక్షిత గృహంలో ఆశ్రయం పొందుతున్నాడు. బాలుడి యొక్క తల్లిదండ్రులుగాని, ఇతర బంధువులుగాని బాలుడి కి సంబందించిన తగిన ఆధారాలు తీసుకువచ్చినయడల, వారికి బాలల సంక్షేమ సమితి, శ్రీకాకుళం వారి ద్వారా బాలుడిని అప్పగించబడును. అలాగే బాలుని ఎవరైనా గుర్తుపట్టినచో వెంటనే బాలుని చిరునామాను ఈ క్రింద తెలియజేసిన పోన్ నంబర్లకు పోన్ చేసి తెలియజేయవలసినదిగా కోరడమైనది. సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్స్: 9440030230 / 9989634481.
- Post by APPARAO KONCHADA1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.4
- పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు.1
- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- Post by APPARAO KONCHADA1