యువతకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇవ్వాలి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.. బద్వేలు:రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకునే ను అధికారంలోకి వస్తే యువతి యువకులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించకపోవడం మరోసారి నిరుద్యోగులను మోసం చేయడమేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. బద్వేలు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చంద్రమోహన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ గడిచిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు నిరుద్యోగ భృతి ఏ ఒక్క నిరుద్యోగి అయిన ఇచ్చిన పరిస్థితి కనబడలేదు అన్నారు. నిరుద్యోగ భృతి ఇంతకు ఇస్తారా లేకుంటే ఇవ్వరా అనేది కూడా నిరుద్యోగులలో అయోమయం పరిస్థితిలో నెలకొన్నాయి ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంత యువత పట్టణ కేంద్రాలలో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాలు తరబడి కోచింగ్ తీసుకుంటూ వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి ఎన్నికల హామీల లో భాగంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని కోరారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగు అందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ అధ్యక్షులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ,పట్టణ నాయకులు రవికుమార్ ,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇవ్వాలి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.. బద్వేలు:రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకునే ను అధికారంలోకి వస్తే యువతి యువకులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించకపోవడం మరోసారి నిరుద్యోగులను మోసం చేయడమేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. బద్వేలు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చంద్రమోహన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ గడిచిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు నిరుద్యోగ భృతి ఏ ఒక్క నిరుద్యోగి అయిన ఇచ్చిన పరిస్థితి కనబడలేదు అన్నారు. నిరుద్యోగ భృతి ఇంతకు ఇస్తారా లేకుంటే ఇవ్వరా అనేది కూడా నిరుద్యోగులలో అయోమయం పరిస్థితిలో నెలకొన్నాయి ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంత యువత పట్టణ కేంద్రాలలో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాలు తరబడి కోచింగ్ తీసుకుంటూ వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి ఎన్నికల హామీల లో భాగంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని కోరారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగు అందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ అధ్యక్షులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ,పట్టణ నాయకులు రవికుమార్ ,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
- బద్వేలు: మండల పరిధిలోని తిరువెంగళాపురం నుంచి మూలవారిపల్లి వెళుతుండగా ఒక వ్యక్తిపొద్దు పొద్దున్నే తాగిన మత్తులో రెండు ద్విచక్ర వాహనాలు గుంతపల్లి పొలాల దగ్గర మలుపు ఎక్కువగా ఉండటంతో ఢీ కొనడం జరిగిందని స్థానికుల సమాచారం ఇచ్చారు... పూర్తి వివరాలు తెలియవలసి వుంది.1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- రాజీవ్ నగర్ కాలనీ లొ నీటి కి కటకట.. పబ్లిక్ బోర్ ను వాడుకుంటూ *మహిళ లను అసభ్యంగా* తిడుతున్న వాటర్ ప్లాంట్ నిర్వహుడు బుజ్జి అధకార పార్టీ మాదే అంటూ మహిళలను కులం పేరు తో దూషిస్తున్న వాటర్ ఫాంట్ నిర్వహకుడు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రౌడీల రాజ్యం అంటూ మహిళల ఆవేదన బుజ్జి వ్యవహారం తో కాలని లో అధికారపార్టీ పై పెరుగుతున్న వ్యతిరేకత మహిళలను తిట్టడం , పబ్లిక్ బోర్ ను సొంతానికి వాడుతున్న బుజ్జి పై చర్యలు తీసుకోవాలని మహిళల అభ్యర్థన.. వాటర్ ఫ్లాంట్ కు తాళం వేసి నిరసన1
- Post by Venkat Rathnam3
- ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని గ్రానైట్ క్వారీల ప్రాంతంలో రాష్ట్ర మైనింగ్ బృందం బుధవారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఇటీవల అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలు వార్తల నేపథ్యంలో మైనింగ్ బృందం అక్కడికి చెరుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నివేదిక ఉన్నత అధికారులకు సమర్పిస్తామని బృందం వెల్లడించింది. తర్వాత ఎమ్మెల్యే విజయ్ కుమార్ బృందం కాసేపు స్థానిక పరిస్థితులపై చర్చించారు.1
- Post by Sandeep mohith2
- బోగోలు చేరుకున్న నారా లోకేష్ గారికి అఖండ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలకు కరచాలనం చేసిన నారా లోకేష్ బాబు1
- బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.2