Shuru
Apke Nagar Ki App…
మైలవరం సీఐ కిషోర్ బాబును కలిసిన ఏపీడబ్ల్యూజెఎఫ్ నేతలు *మైలవరం, మార్చి 11, (గళమ్ న్యూస్)* మైలవరం నూతన సీఐ కిషోర్ బాబును ఏపీడబ్ల్యూజెఎఫ్ నాయకులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. సంఘం తరఫున డైరీ అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు చేసే కృషికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి మెరుగుమాల రాఘవులు,మైలవరం నియోజకవర్గ నాయకులు ఉయ్యూరి వెంకట్ పాల్గొన్నారు.
వేముల నాగరాజు
మైలవరం సీఐ కిషోర్ బాబును కలిసిన ఏపీడబ్ల్యూజెఎఫ్ నేతలు *మైలవరం, మార్చి 11, (గళమ్ న్యూస్)* మైలవరం నూతన సీఐ కిషోర్ బాబును ఏపీడబ్ల్యూజెఎఫ్ నాయకులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. సంఘం తరఫున డైరీ అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు చేసే కృషికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి మెరుగుమాల రాఘవులు,మైలవరం నియోజకవర్గ నాయకులు ఉయ్యూరి వెంకట్ పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by డాక్టర్ బాబు 70364451131
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- Post by Gift maker1
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో.. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పని ఒక రైతును రోడ్డున పడేసింది. గ్రామానికి చెందిన రైతు గుండగాని రాజు, తనకున్న పొలంలో ఎంతో ఆశతో మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండిందని, ఈసారి మంచి దిగుబడి వస్తుందని సంతోషిస్తున్న తరుణంలో.. కొందరు దుండగులు పంట చేనుకు నిప్పు పెట్టారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో మొక్కజొన్న కంకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయిపొలానికి వెళ్లిన రాజుకు.. కాలిపోయిన పంటను చూసి గుండె తరుక్కుపోయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తనకు, ఇప్పుడు మిగిలింది కేవలం బూడిదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గుండగాని రాజు వేడుకుంటున్నారు.1