Shuru
Apke Nagar Ki App…
Hajigamilcom Baba
More news from తెలంగాణ and nearby areas
- Post by Merugu Rajitha1
- ప్రజా సమస్యలు గాలికి వదిలి బలప్రదర్శన దిగిన పాలకపక్షం మరియు ప్రధాన ప్రతిపక్షం. *జీవన్ రెడ్డి చేరిక ద్వార తెలంగాణ ప్రజలతో బిఆర్ఎస్ పార్టీ పేగు బంధం తెగిపోయింది.* *రాజశేఖరరెడ్డి మెప్పు కోసం తెలంగాణ ప్రయోగాలను తాకట్టు పెట్టిన జీవన్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు.* రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులు గుర్తుకురసని మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇంపుడే ఎందుకుగుర్తుకు వచ్చిందో సామధానం చెప్పాలి గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జాగృతి, కరీంనగర్. కరీంనగర్ నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి మరియు జాగృతి నాయకురాలు కొమిరి పద్మ. మరియు మనకోండూర్ మండలానికి కొలిపాక గౌతమి ఆద్వర్యంలో పలువురు నాయకులు మహిళల కవితక్కను తెలంగాణ రాష్టానికి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతిలో పనిచేస్తామని ఈరోజు తెలంగాణ జాగృతిలో చేరడం జరిగింది. వారికి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువాలు కప్పి సాదరంగా జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 25.న తెలంగాణ ప్రజల ఉజ్వలమైన భవిష్యత్త్ కోసం కవితక్క నూతన రాజకీయ పార్టీ ప్రారంభిస్తారని అ యొక్క పార్టీలో పనిచేయడం కోసం ఇప్పటికే చాలా మంది ముందుకు వస్తున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలను భారతదేశంలో ఉన్న అనేక జాతీయ అంశాలతోపాటు తెలంగాణ ఒకటని కానీ తెలంగాణ జాగృతి కేవలం ఈ రాష్ట్ర ప్రయోగాలే ప్రధాన అజెండా ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికే మా కృషి ఉంటుందని వారు అన్నారు. తెలంగాణలో ఉన్న పాలకపక్షం మరియు ప్రధాన ప్రతిపక్షం రెండు జాతీయ పార్టీలే ముఖ్యంగా కేసిఆర్ నాయకత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకుని జాతీయ రాజకీయలోకి పోయిందని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడ తెలంగాణ ప్రయోగాల విషయంలో పట్టించుకోలేదని. మరో జాతీయ పార్టీ బిజెపికి కూడ ఉత్తర భారతదేశ ప్రయోగాలే ముఖ్యం అని వారు అన్నారు. నిన్నటి రోజున బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బల ప్రదర్శన దిగిన సంగతి ప్రజలకు తెలుసని అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు గుర్తుకురాని మేడిగడ్డ ముఖ్యమంత్రి గారికి నిన్ననే గుర్తుకు వచ్చిందని పోని ప్రాజెక్ట్ సంబంధించిన మంచి విషయాలు కానీ, రైతులకు నీళ్ళు అందించే ముచ్చట ఎదైనా చెబుతాడు కావచ్చు అనుకుంటే కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం అయ్యాడు ముఖ్యమంత్రి. మరి ప్రధాన ప్రతిపక్షం తీరు కూడ అదేవిధంగా ఉంది నిన్న జగిత్యాలలో తెలంగాణకు బద్దవ్యతిరేకి, కేవలం తాను ఒక్కడే ఉండాలి మరెవ్వరూ కూడ ఉండోద్దు అని యువతను రాజకీయంగా అనగదొక్కిన కలం చెల్లిన నాయకుడిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వారి గొయ్యిని వారే తీసుకున్నారు వరుసగా ఓటమిలో హైట్రిక్ కొట్టిన జీవన్ రెడ్డితో బిఆర్ఎస్ కు ఏం లాభం జరుగుతుందో వారే చెప్పాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కవితక్క నాయకత్వంలో తెలంగాణ ప్రయోగాల కోసం తెలంగాణలో పేరుకు పోయిన సమస్యల పరిష్కారం కోసం కవితక్క కృషి చేస్తుందని రోజురోజుకు తెలంగాణ జాగృతి ఒక బలపడుతుందని ఈ రాష్ట్రానికి కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.1
- హుజురాబాద్ లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ బైక్ ల పంపిణీ లో ప్రోటోకాల్ వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రోటోకాల్ పాటించకుండా దివ్యాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ నాయకులతో దివ్యాంగులకు బైకులు పంపిణీ చేయడంపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం నినాదాలు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో ఒకే సమయంలో రెండు ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లోర్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేస్తే మరో ఫ్లోర్ లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు స్కూటీ లు పంపిణీ చేశారు. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వికలాంగులకు బైకులు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికంగానే తాను ఉన్నప్పటికీ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా నా, ఎమ్మెల్యే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తు పద్ధతి మార్చుకోవాలని మందలించారు. జరిగిన పొరపాటును కప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నించగా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని సూచిస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు బైకులు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.1
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని వెల్కమ్ హోటల్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.3
- Post by Merugu Rajitha1