MKS మహజన కార్మిక సంక్షేమ సంఘం ఈ రోజు 31.07.2026 ,ITC వైస్ ప్రెసిడెంట్ HR శ్రీ శ్యామ్ కిరణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన MKS టీం . ఈ సందర్భంగా మా MKS టీం సభ్యులందరూ తమను తాము పరిచయం చేసుకొని, టీంలోని పదవులు, బాధ్యతలను వివరించాము. అలాగే ఇప్పటివరకు మేము నిర్వహించిన సేవా కార్యక్రమాలు, కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశాము. మా వివరాలను విన్న శ్యామ్ కిరణ్ గారు చాలా మంచి పని చేశారు అని ఆత్మీయంగా MKS టీమ్ అలింగణం చేసుకొని అభినందిస్తూ MKS టీమ్ మరింత బలోపేతం కావడానికి విలువైన సూచనలు, సలహాలు, అవగాహన కల్పించే సందేశాలను అందించారు. వారి ప్రోత్సాహకరమైన స్పందనతో MKS టీం సభ్యులకు సంతోషాన్ని , ఉత్సాహన్ని కలిగించింది. ఈ ఆత్మీయ సమావేశం మా MKS టీంకు మరింత ప్రేరణనిచ్చింది. అలాగే శ్యామ్ కిరణ్ గారికి ప్రమోషన్ వచ్చిన సందర్బాన్ని గుర్తు చేస్తూ MKS టీం శాల్వాలు కప్పి సన్మానము చేయడం జరిగింది. గౌరవనీయులైన శ్యామ్ కిరణ్ గారు MKS టీం ని ఉద్దేశించి ఇలా ఒక ట్రస్ట్ లా కలిసి మంచి కార్యక్రమాల తో మీరు మిగతా కార్మికులకు అవగాహన కలిపిస్తూ కార్మికులకు రోల్ మోడల్ గా మీ MKS టీం నిలబడాలని శ్రీ శ్యామ్ కిరణ్ గారు ప్రసంశించారు. ధన్యవాదాలతో, MKS మహజన కార్మిక సంక్షేమ సంఘం టీం
MKS మహజన కార్మిక సంక్షేమ సంఘం ఈ రోజు 31.07.2026 ,ITC వైస్ ప్రెసిడెంట్ HR శ్రీ శ్యామ్ కిరణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన MKS టీం . ఈ సందర్భంగా మా MKS టీం సభ్యులందరూ తమను తాము పరిచయం చేసుకొని, టీంలోని పదవులు, బాధ్యతలను వివరించాము. అలాగే ఇప్పటివరకు మేము నిర్వహించిన సేవా కార్యక్రమాలు, కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశాము. మా వివరాలను విన్న శ్యామ్ కిరణ్ గారు చాలా మంచి పని చేశారు అని ఆత్మీయంగా MKS టీమ్ అలింగణం చేసుకొని అభినందిస్తూ MKS టీమ్ మరింత బలోపేతం కావడానికి విలువైన సూచనలు, సలహాలు, అవగాహన కల్పించే సందేశాలను అందించారు. వారి ప్రోత్సాహకరమైన స్పందనతో MKS టీం సభ్యులకు సంతోషాన్ని , ఉత్సాహన్ని కలిగించింది. ఈ ఆత్మీయ సమావేశం మా MKS టీంకు మరింత ప్రేరణనిచ్చింది. అలాగే శ్యామ్ కిరణ్ గారికి ప్రమోషన్ వచ్చిన సందర్బాన్ని గుర్తు చేస్తూ MKS టీం శాల్వాలు కప్పి సన్మానము చేయడం జరిగింది. గౌరవనీయులైన శ్యామ్ కిరణ్ గారు MKS టీం ని ఉద్దేశించి ఇలా ఒక ట్రస్ట్ లా కలిసి మంచి కార్యక్రమాల తో మీరు మిగతా కార్మికులకు అవగాహన కలిపిస్తూ కార్మికులకు రోల్ మోడల్ గా మీ MKS టీం నిలబడాలని శ్రీ శ్యామ్ కిరణ్ గారు ప్రసంశించారు. ధన్యవాదాలతో, MKS మహజన కార్మిక సంక్షేమ సంఘం టీం
- పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు * వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టు కున్నారు. బీఆర్ఎస్ నాయకుల తో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగా నికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకు డిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు.అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్1
- పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్వాటర్ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్వాటర్ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్వాటర్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.1