*పదవ తరగతి విద్యార్థులకు పరిక్షలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఐడిసి డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని* ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కేంద్రము లోని శాగం శివరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల అనగా మార్చి 16 వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి స్ఫూర్తితో సుమారు 70 మంది విద్యార్థులకు పరిక్షలకు అవసరమైన ప్యాడ్, పెన్నులు, జామెట్రీ బాక్స్ తదితర వస్తువులను రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు మరియు పాఠశాల పూర్వ విద్యార్థి తమ్మిశెట్టి దుర్గారావు గారితో కలిసి అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత స్థానాలకు వెళ్లడానికి పదవ తరగతి మెదటి అడుగు, కావున విద్యార్ధులు అందరూ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు, అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో కలిసి హాల్ టికెట్ విద్యార్థులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.
*పదవ తరగతి విద్యార్థులకు పరిక్షలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఐడిసి డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని* ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కేంద్రము లోని శాగం శివరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల అనగా మార్చి 16 వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి స్ఫూర్తితో సుమారు 70 మంది విద్యార్థులకు పరిక్షలకు అవసరమైన ప్యాడ్, పెన్నులు, జామెట్రీ బాక్స్ తదితర వస్తువులను రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు మరియు పాఠశాల పూర్వ విద్యార్థి తమ్మిశెట్టి దుర్గారావు గారితో కలిసి అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత స్థానాలకు వెళ్లడానికి పదవ తరగతి మెదటి అడుగు, కావున విద్యార్ధులు అందరూ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు, అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో కలిసి హాల్ టికెట్ విద్యార్థులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1