logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాడేరు ఐటీడీఏ ఎదుట జలగలగడ్డ వాసులు చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. తమ గ్రామస్తులపై దాడి చేసిన కొరుబయలు వాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, జలగలగడ్డ గ్రామానికి రహదారి నిర్మాణం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడేదాకా ఈ న్యాయ పోరాటం ఆపబోమని బాధితులు స్పష్టం చేశారు.

on 11 March
user_Shyam
Shyam
Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
on 11 March

పాడేరు ఐటీడీఏ ఎదుట జలగలగడ్డ వాసులు చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. తమ గ్రామస్తులపై దాడి చేసిన కొరుబయలు వాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, జలగలగడ్డ గ్రామానికి రహదారి నిర్మాణం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడేదాకా ఈ న్యాయ పోరాటం ఆపబోమని బాధితులు స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    1
    ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా  కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.  అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు.  ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    1 hr ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    22 hrs ago
  • దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    1
    దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. 
కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 
అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. 
ఒక పౌరుడికి ఒకటే ఓటు  కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది 
ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    user_P. Ashok
    P. Ashok
    Media company అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    3
    పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    22 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
    1
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.