కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి అందిన సమాచారం మేరకు, తీగల గుట్టపల్లిలోని సరస్వతి నగర్ శివారులో ఒక పేకాట స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో మూడు ముక్కల పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 53 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి: తన్నీరు శ్రీను, ఓర్సు సందీప్, తన్నీరు శేషయ్య, పొట్లపాటి అబ్రహం, వల్లెపు రవి, కుంచాల నాగేంద్రబాబు, వల్లెపు పుల్లరాజు, పుల్లపు వెంకటరావు. వీరంతా గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుండి కరీంనగర్కు వచ్చి, సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారని, బిల్డింగులు కట్టడానికి కాంట్రాక్టు తీసుకొని పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టుకు పంపనున్నారు. ఈ పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను పట్టుకోవడంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి అందిన సమాచారం మేరకు, తీగల గుట్టపల్లిలోని సరస్వతి నగర్ శివారులో ఒక పేకాట స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో మూడు ముక్కల పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 53 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి: తన్నీరు శ్రీను, ఓర్సు సందీప్, తన్నీరు శేషయ్య, పొట్లపాటి అబ్రహం, వల్లెపు రవి, కుంచాల నాగేంద్రబాబు, వల్లెపు పుల్లరాజు, పుల్లపు వెంకటరావు. వీరంతా గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుండి కరీంనగర్కు వచ్చి, సరస్వతి నగర్లో నివాసం ఉంటున్నారని, బిల్డింగులు కట్టడానికి కాంట్రాక్టు తీసుకొని పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. తదుపరి చర్య నిమిత్తం వారిని కోర్టుకు పంపనున్నారు. ఈ పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను పట్టుకోవడంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.
- ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కొందరు యువకులు బైక్ ర్యాలీలతో పెద్ద హంగామా సృష్టించారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ మార్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ట్రాఫిక్లో ఆగి ఉన్న ఒక లారీపైకి ఎక్కి, ఏకంగా దాని అద్దంపై నిలబడి విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఈ నిర్లక్ష్యపు సంబరాలపై వాహనదారులు, స్థానికులు స్పందిస్తూ, గెలుపు సంబరాలు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.1
- ఆదివారం సెలవు దినం మరియు గిరి ప్రదక్షిణ పురస్కరించుకుని కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు క్షేత్రపాలకుడైన శ్రీ బేతలస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 25 వేల మంది భక్తులు ఆలయానికి విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ లో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిత్రపటాలను ప్రదర్శించి, చెప్పులతో కొట్టి, అనంతరం దహనం చేశారు. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.4
- శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాష్ట్రంలో భారీ ఇసుక తుఫాను (బవండర్) తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురూ, బికనేర్, శ్రీగంగానగర్ జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశమంతటా దాదాపు కిలోమీటరు ఎత్తున దట్టమైన నలుపు, పసుపు రంగు ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో, పగటిపూటే దట్టమైన చీకటి అలుముకుంది. సుమారు అరగంట పాటు వీధులన్నింటినీ చుట్టుముట్టేసిన ఈ తుఫాను జీరో విజిబిలిటీకి దారితీయగా, రహదారులపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు కొట్టుకుపోగా, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండలు, హీట్వేవ్లతో అల్లాడుతున్న ప్రజలకు ఈ తుఫాను భయాందోళనలు కలిగించినప్పటికీ, దీని అనంతరం కురిసిన వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ధోల్పూర్ పరిధిలోని బారిలో గరిష్టంగా 58 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. పశ్చిమ విక్షోభం (Western Disturbance) ప్రభావం వల్ల రాబోయే మరికొద్ది రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని జైపూర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజస్థాన్లోని జైపూర్, అజ్మీర్, కోట, జోధ్పూర్, ఉదయ్పూర్ డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.1
- మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ నస్పూర్ మండలంలో గల సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉపరితలంపై పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, జీఎం శ్రీనివాస్ వారికి ఎండ తీవ్రత నుండి ఉపశమనం కల్పించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మరియు గొడుగులు అందజేశారు. ఈ చర్య కార్మికులకు వేడి నుండి రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడింది. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపరితలంపై పనిచేసే కార్మికులకే కాకుండా, మ్యానువే దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రంజాన్ మాసంలో ఉపరితలంపై పనిచేస్తున్న కార్మికుల కోసం నీటి నిల్వను తగినంతగా ఉంచాలని, కార్మికులు ఎల్లప్పుడూ నీరు తాగుతూ, వారి కోసం ఏర్పాటు చేసిన నీడలో ఉండాలని ఆయన సూచించారు. ఎండ తీవ్రత నుండి కార్మికులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.1
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాధారణ ప్రయాణికుడి మాదిరిగా వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక వాహనం లేదా ఆర్భాటం లేకుండా, ఆయన సామాన్య ప్రయాణికుడిలా ట్రైన్లో ప్రయాణించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి జూపల్లి శనివారం హైదరాబాద్ నుండి వందే భారత్ ట్రైన్లో ఆసిఫాబాద్ జిల్లాకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలో, మంత్రి తోటి ప్రయాణికులతో కలిసి ట్రైన్లో అందించిన భోజనం చేశారు. మంత్రి చూపిన ఈ నిరాడంబరతను చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోగా, కొందరు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో జూపల్లి కృష్ణారావు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకుని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు.1
- కరీంనగర్లో టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, టీయూడబ్ల్యూజే హెచ్143 కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం కోసం మరో పోరాటం అనివార్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, కోశాధికారి జేరిపోతుల సంపత్, ఎలక్ట్రానిక్ మీడియా కో కన్వీనర్ హృషీకేష్, అలాగే జిల్లా నాయకులు శ్రీనివాస్, వెంకటరమణ, ప్రశాంత్, సుధాకర్, శ్రీధర్, సురేందర్, దేవేందర్ తదితరులు పాలుపంచుకున్నారు.1