*కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం – కెకెసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా* ఖమ్మం, ఆగస్టు 1: అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి) ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కెకెసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ గారి ఆధ్వర్యంలో కెకెసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, కేక్ కట్ చేసి సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి అసంఘటిత రంగ కార్మికుల శ్రమే వెన్నెముక అని, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, సంక్షేమం కోసం KKC నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశంలోని కార్మికులు, రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక న్యాయం పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మిక సంక్షేమం మరియు సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెకెసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చేయడం కెకెసి ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రతి కార్మికుడు సంఘటితమై తన హక్కుల సాధన కోసం ముందుకు రావాలని, కార్మికుల ఐక్యతతోనే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ లో చేరిన కార్మికులకు కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్, టెలికామ్ అడ్వైసర్ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, షేక్ ఇమామ్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దామల్ల స్వరూప, కోర్లపాటి అన్నపూర్ణ ,రామకృష్ణ రెడ్డి, నాగేశ్వరావు, మొగిలిచర్ల సైదులు, ఎయిర్టెల్ నరసింహారావు, KKC ఆటో యూనియన్ పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట్ నాయుడు,ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి మార్ట్ జానీ నగర అధ్యక్షులు బి సతీష్ ఖమ్మం త్రీ టౌన్ అధ్యక్షులు సిహెచ్ రాజు నాయకులు, KKC జిల్లా నాయకులు పుల్లారావు, సంగయ్య,నరసింహారావు, వీరా గౌడ్, వేణు, బాలకృష్ణ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని KKC ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
*కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం – కెకెసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా* ఖమ్మం, ఆగస్టు 1: అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి) ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కెకెసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ గారి ఆధ్వర్యంలో కెకెసి జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, కేక్ కట్ చేసి సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి అసంఘటిత రంగ కార్మికుల శ్రమే వెన్నెముక అని, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, సంక్షేమం కోసం KKC నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశంలోని కార్మికులు, రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక న్యాయం పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మిక సంక్షేమం మరియు సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెకెసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చేయడం కెకెసి ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రతి కార్మికుడు సంఘటితమై తన హక్కుల సాధన కోసం ముందుకు రావాలని, కార్మికుల ఐక్యతతోనే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. అనంతరం యూనియన్ లో చేరిన కార్మికులకు కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్, టెలికామ్ అడ్వైసర్ కమిటీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, షేక్ ఇమామ్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దామల్ల స్వరూప, కోర్లపాటి అన్నపూర్ణ ,రామకృష్ణ రెడ్డి, నాగేశ్వరావు, మొగిలిచర్ల సైదులు, ఎయిర్టెల్ నరసింహారావు, KKC ఆటో యూనియన్ పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట్ నాయుడు,ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి మార్ట్ జానీ నగర అధ్యక్షులు బి సతీష్ ఖమ్మం త్రీ టౌన్ అధ్యక్షులు సిహెచ్ రాజు నాయకులు, KKC జిల్లా నాయకులు పుల్లారావు, సంగయ్య,నరసింహారావు, వీరా గౌడ్, వేణు, బాలకృష్ణ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని KKC ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- బాలకృష్ణకు ఫోన్ చేసిన అభిమాని.నల్లమల రంజిత్ .VIDEO.... ఖమ్మం :ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ఖమ్మం పట్టణానికి చెందిన అభిమాని నల్లమల రంజిత్ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రమాద సంఘటన తనతో పాటు అభిమానులను కలచివేసిందని రంజిత్ బాలయ్యకు వివరించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు మరో 3 వారాలు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని దేవుడికి పూజ చేయించినట్లు రంజిత్ చెప్పగానే బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.2
- ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.1
- ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.1
- పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు1
- భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...1
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.1
- భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు1