ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల హార్డ్ కాపీలు అందజేత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల హార్డ్ కాపీలు అందజేత అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ: డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా | ఆగస్టు 27: ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR రెండో దశ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా హార్డ్ కాపీలను ఎల్లారెడ్డి నియోజకవర్గ SIR కోఆర్డినేటర్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబాకు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల హార్డ్ కాపీలు అందజేత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల హార్డ్ కాపీలు అందజేత అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ: డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా | ఆగస్టు 27: ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR రెండో దశ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా హార్డ్ కాపీలను ఎల్లారెడ్డి నియోజకవర్గ SIR కోఆర్డినేటర్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబాకు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఆయన సూచించారు.
- ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.1
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్హాల్లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్రెడ్డి, భాస్కర్రావు, బాల్రెడ్డి, రంజిత్గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. గురువారం సిరిసిల్లలోని స్థానిక 12వ వార్డులో జీపీ మోటార్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు షోరూంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించి, వాటి పనితీరును, సాంకేతికతను, వినియోగదారులకు అందించే సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా అన్నారు . సిరిసిల్ల ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మెరుగైన సేవలు అందించాలని జీపీ మోటార్స్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మొగిలి నాగరాజు, జీపీ మోటార్స్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.1
- బాన్సువాడలో రాఖీ పండుగ సందడి రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు. రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్లో సందడి మరింత పెరిగింది.1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4