అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ సీఐ సీతారామిరెడ్డి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అగ్నిమాపక ఆఫీసర్, సిఐ సీతారామిరెడ్డి బద్వేలు ,ఏప్రిల్ 14 : అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజులపల్లె వెంకటసుబ్బారెడ్డి చేతులమీదుగా కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు,ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ శాఖ సిఐ సీతారామరెడ్డి కి పలువురు అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు, అనంతరం సీఐ సీతారామిరెడ్డి, హెచ్ఎం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించి అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు, ప్రజలందరూ కూడా అగ్ని ప్రమాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, ఏదైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనోధర్యంగా ఎదుర్కొంటూ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు, ఇటీవల బద్వేల్ ప్రాంతంలో జరిగిన అనేక ప్రమాదాలలో అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి ప్రజలకు రక్షణగా నిలబడ్డారన్నారు, ప్రజలందరికీ అగ్ని ప్రమాదాల పట్ల అనేకచోట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలను వారు కొనియాడారు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆపదలో ఉన్నవారిని కాపాడటమే లక్ష్యంగా అగ్నిమాపక సిబ్బంది చేసే సాహసాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా వారు కొనియాడారు." "వేసవి కాలం దృష్ట్యా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉన్నందున, గృహాల్లోనూ మరియు వ్యాపార సముదాయాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు." "కేవలం వారోత్సవాల సమయంలోనే కాకుండా, ప్రతి రోజూ అగ్నిమాపక నిబంధనలను పాటించడం ద్వారా భారీ ఆస్తి మరియు ప్రాణ నష్టాలను నివారించవచ్చని స్పష్టం చేశారు." "ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో అగ్నిమాపక యంత్రాల వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలని, యువత సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు." అనంతరం అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలో వారం రోజులు పాటు ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్ బంకులు, అపార్ట్మెంట్లు, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు మరియు అనేక చోట్ల అగ్ని ప్రమాదాల వారోత్సవాలను నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు, అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మాన్స్ సుధాకర్,,హరికృష్ణ, డ్రైవర్ ఆపరేటర్స్ జి చెన్నయ్య, పి మాబురెడ్డి, ప్రభాకర్, ఫైర్ మాన్స్ పి సిద్దేశ్వర్, బి శ్రీనివాసులు,, పాములేట్ నాయక్, హోంగార్డ్స్ బాలయ్య, రాజు, రాజశేఖర్ తోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ సీఐ సీతారామిరెడ్డి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అగ్నిమాపక ఆఫీసర్, సిఐ సీతారామిరెడ్డి బద్వేలు ,ఏప్రిల్ 14 : అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజులపల్లె వెంకటసుబ్బారెడ్డి చేతులమీదుగా కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు,ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ శాఖ సిఐ సీతారామరెడ్డి కి పలువురు అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు, అనంతరం సీఐ సీతారామిరెడ్డి, హెచ్ఎం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించి అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు
అభినందనీయమన్నారు, ప్రజలందరూ కూడా అగ్ని ప్రమాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, ఏదైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనోధర్యంగా ఎదుర్కొంటూ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు, ఇటీవల బద్వేల్ ప్రాంతంలో జరిగిన అనేక ప్రమాదాలలో అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి ప్రజలకు రక్షణగా నిలబడ్డారన్నారు, ప్రజలందరికీ అగ్ని ప్రమాదాల పట్ల అనేకచోట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలను వారు కొనియాడారు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆపదలో ఉన్నవారిని కాపాడటమే లక్ష్యంగా అగ్నిమాపక సిబ్బంది చేసే సాహసాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా వారు కొనియాడారు." "వేసవి కాలం దృష్ట్యా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉన్నందున, గృహాల్లోనూ మరియు వ్యాపార సముదాయాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు." "కేవలం వారోత్సవాల సమయంలోనే కాకుండా, ప్రతి రోజూ అగ్నిమాపక నిబంధనలను పాటించడం ద్వారా
భారీ ఆస్తి మరియు ప్రాణ నష్టాలను నివారించవచ్చని స్పష్టం చేశారు." "ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో అగ్నిమాపక యంత్రాల వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలని, యువత సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు." అనంతరం అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలో వారం రోజులు పాటు ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్ బంకులు, అపార్ట్మెంట్లు, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు మరియు అనేక చోట్ల అగ్ని ప్రమాదాల వారోత్సవాలను నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు, అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మాన్స్ సుధాకర్,,హరికృష్ణ, డ్రైవర్ ఆపరేటర్స్ జి చెన్నయ్య, పి మాబురెడ్డి, ప్రభాకర్, ఫైర్ మాన్స్ పి సిద్దేశ్వర్, బి శ్రీనివాసులు,, పాములేట్ నాయక్, హోంగార్డ్స్ బాలయ్య, రాజు, రాజశేఖర్ తోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.1
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- Post by Palakattu nagendra1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- Post by Bondhu Suresh1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.1