logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట నియోజకవర్గాన్ని పునర్విభజనలో ఏర్పాటు చేయడానికి, అలాగే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే వీరేశం గారు హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనలకు మద్దతుగా నిలిచిన ప్రజాప్రతినిధులకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు తెలిపిన వారిలో రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బస్ రాములు, అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర. రమేష్ గౌడ్, కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, పెండం రవీందర్ తదితరులు ఉన్నారు.

1 hr ago
user_నరేష్ nakarekantihttps://shuru
నరేష్ nakarekantihttps://shuru
Auto Accessories Store యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
1 hr ago
c64ae044-a965-4ac2-b08c-531e6a2e0dcc

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట నియోజకవర్గాన్ని పునర్విభజనలో ఏర్పాటు చేయడానికి, అలాగే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే వీరేశం గారు హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనలకు మద్దతుగా నిలిచిన ప్రజాప్రతినిధులకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు తెలిపిన వారిలో రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బస్ రాములు, అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర. రమేష్ గౌడ్, కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, పెండం రవీందర్ తదితరులు ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నకిరేకల్ నియోజకవర్గ ప్రజల సేవకుడిగా మన దైద రవీందర్ అన్న నిలిచారు. ఎలాంటి అధికారిక పదవి దక్కకపోయినప్పటికీ, ఎన్ని అవమానాలు, కష్టాలు మరియు కన్నీళ్లు ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. క్యారెక్టర్ అనే తన ఉత్తమమైన గుణంతో నిరంతరం ప్రజల కోసమే ఆయన దృఢంగా నిలబడుతున్నారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గ ప్రజల సేవకుడిగా మన దైద రవీందర్ అన్న నిలిచారు. ఎలాంటి అధికారిక పదవి దక్కకపోయినప్పటికీ, ఎన్ని అవమానాలు, కష్టాలు మరియు కన్నీళ్లు ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. క్యారెక్టర్ అనే తన ఉత్తమమైన గుణంతో నిరంతరం ప్రజల కోసమే ఆయన దృఢంగా నిలబడుతున్నారు.
    user_నరేష్ nakarekantihttps://shuru
    నరేష్ nakarekantihttps://shuru
    Auto Accessories Store యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం ఒక సీఎం మాట్లాడే భాషేనా అని ఆయన నిలదీశారు. బ్యారేజీల గురించి రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే కరుస్తున్నావని, అదే ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు మాట్లాడితే వారిపై ఏసీబీ దాడులు చేయిస్తున్నావని హరీష్ రావు సీఎంపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం సరికాదన్న ఆయన, ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా కాపాడుకోవాలనే తపన ఉండాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదులుతూ తన గురువు (CBN)కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలను రక్తం పారిస్తా, కోస్తా అంటావా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    2
    తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం ఒక సీఎం మాట్లాడే భాషేనా అని ఆయన నిలదీశారు.

బ్యారేజీల గురించి రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే కరుస్తున్నావని, అదే ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు మాట్లాడితే వారిపై ఏసీబీ దాడులు చేయిస్తున్నావని హరీష్ రావు సీఎంపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం సరికాదన్న ఆయన, ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా కాపాడుకోవాలనే తపన ఉండాలని హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదులుతూ తన గురువు (CBN)కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలను రక్తం పారిస్తా, కోస్తా అంటావా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని పలు మాంసం విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 20 కిలోల నాసిరకం, పరిశుభ్రత లేని మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యాపారిపై రూ. లక్ష భారీ జరిమానా విధించినట్లు పురపాలక సంఘం అధికారులు వెల్లడించారు. నగరంలోని మాంసం వ్యాపారులందరూ ప్రభుత్వం అనుమతించిన స్లాటర్ హౌస్‌లలోనే జంతువులను వధించాలని, ప్రజలకు కేవలం పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ వధలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించడం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మున్సిపల్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జనగామ మున్సిపాలిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అపరిశుభ్రంగా లేదా నాణ్యత లేని మాంసం, చికెన్ విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే జనగామ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇటువంటి ఫిర్యాదులపై తాము తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని పలు మాంసం విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 20 కిలోల నాసిరకం, పరిశుభ్రత లేని మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యాపారిపై రూ. లక్ష భారీ జరిమానా విధించినట్లు పురపాలక సంఘం అధికారులు వెల్లడించారు.

నగరంలోని మాంసం వ్యాపారులందరూ ప్రభుత్వం అనుమతించిన స్లాటర్ హౌస్‌లలోనే జంతువులను వధించాలని, ప్రజలకు కేవలం పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ వధలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించడం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మున్సిపల్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు.

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జనగామ మున్సిపాలిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అపరిశుభ్రంగా లేదా నాణ్యత లేని మాంసం, చికెన్ విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే జనగామ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇటువంటి ఫిర్యాదులపై తాము తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    10 hrs ago
  • సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్‌పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
    1
    సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్‌పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_Hanumadri Srinivas Goud
    Hanumadri Srinivas Goud
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రి చెప్పినట్లే బ్యారేజ్ కొట్టుకుపోయినా కూడా, ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ఆ పోయే నీళ్ళలోనే కలుస్తాయని ఆయన వివరించారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
    1
    కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రి చెప్పినట్లే బ్యారేజ్ కొట్టుకుపోయినా కూడా, ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ఆ పోయే నీళ్ళలోనే కలుస్తాయని ఆయన వివరించారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    1 hr ago
  • Post by Assalamualikumjj
    3
    Post by Assalamualikumjj
    user_Assalamualikumjj
    Assalamualikumjj
    ఆసిఫ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా భద్రాద్రి భద్రాచలం చేరుకున్న జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్‌కు స్థానిక తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విచ్చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనం ద్వారా రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకోగా, ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధమైన, బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే పంచాయతీ రాజ్ చాంబర్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీర్వాదంతో తమ ఆశయం సిద్ధించే వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఏపీ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు శశికళ యాదవ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పుస్కూరి అశోక్ రావు, శ్రీశైలం యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ మరియు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై. వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, గోగినేని వసుధ, జల్లు కొండయ్యలతో పాటు వివిధ జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఈ స్వాగత వేడుకలో పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా భద్రాద్రి భద్రాచలం చేరుకున్న జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్‌కు స్థానిక తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విచ్చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనం ద్వారా రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకోగా, ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధమైన, బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే పంచాయతీ రాజ్ చాంబర్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీర్వాదంతో తమ ఆశయం సిద్ధించే వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఏపీ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు శశికళ యాదవ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పుస్కూరి అశోక్ రావు, శ్రీశైలం యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ మరియు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై. వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, గోగినేని వసుధ, జల్లు కొండయ్యలతో పాటు వివిధ జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఈ స్వాగత వేడుకలో పాల్గొన్నారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.