_జనవరి 06, 2026 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని 27వ వార్డులో, నందవరం మండలం సోమల గూడూరు గ్రామానికి చెందిన మాజీ గ్రామ వార్డు వాలంటీర్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీ రాఘవేందర్ రెడ్డి ముద్దుల చిన్నారి కుమార్తె భవ్య రెడ్డి జన్మదిన వేడుకలు ఆనందం, ఆప్యాయత, చిరునవ్వులతో నిండిన వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి._ _ఈ ముద్దుల చిన్న పాప జన్మదిన వేడుకలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్ ముఖ్య అతిథులుగా హాజరై, చిన్నారి భవ్య రెడ్డితో కలిసి కేక్ కటింగ్ చేసి, ప్రేమతో కేక్ తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు._ _ఈ సందర్భంగా వారు చిన్నారి భవ్య రెడ్డి భవిష్యత్తు వెలుగులా ప్రకాశించాలని, మంచి విద్య, సంపూర్ణ ఆరోగ్యం, సద్గుణాలు అలవరచుకొని తల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణంగా ఎదగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు._ _చిన్నారి అమాయకమైన చిరునవ్వులు, చిలిపి కదలికలు వేడుకకు మరింత శోభను చేకూర్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులను హత్తుకున్నాయి._ _ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందవరం మండల కన్వీనర్ జె. శివారెడ్డి గౌడ్ , రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి ముగతి వీరుపాక్షి రెడ్డి , పార్టీ సీనియర్ నాయకులు కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు సోమల గూడూరు వెంకటేశ్వర రెడ్డి , నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ , పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప , చేనేత జిల్లా అధ్యక్షులు ఎం.కె. శివ ప్రసాద్ , ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కోరిశెట్టి మధుబాబు , సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ , పట్టణ రైతు విభాగ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బనవాసి బసిరెడ్డి , పట్టణ యువజన విభాగ అధ్యక్షులు బోయరాజు , పట్టణ ప్రధాన కార్యదర్శి గుడికల్ అల్తాఫ్ గారు, కరే రాము , పట్టణ కార్యదర్శులు గురువ మాభాష , జెరుబండి రఘువీర , 2వ వార్డు ఇన్చార్జ్ గడిగే చంద్ర , 4వ వార్డు ఇన్చార్జ్ కనికే నాగేంద్ర , 3వ వార్డు చేనేత మల్లి , పట్టణ బీసీ సెల్ కార్యదర్శి మాచాని రఘు , 5వ వార్డు నాయకులు ఇబ్రహీం, మిట్ట సోమపురం సర్పంచ్ నరసింహులు , గురుజాల సర్పంచ్ వీరాస్వామి, హాలహర్వి జయ రాముడు , తిమ్మాపురం వీరాంజనేయులు , మాసుమాన్ దొడ్డి బి. శ్రీనివాసులు, మాసుమాన్ దొడ్డి హనుమంతు, మాసుమాన్ దొడ్డి పోస్ట్ శ్రీనివాసులు , బనవాసి రాజ్ కుమార్, కోటేకల్ పాపన్న, సొగనూరు ప్రతాప్ గౌడ్, కనకవీడు చంద్రశేఖర్ ఆచారి , గురుజాల కోట వీరేష్ గారు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు._
_జనవరి 06, 2026 తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని 27వ వార్డులో, నందవరం మండలం సోమల గూడూరు గ్రామానికి చెందిన మాజీ గ్రామ వార్డు వాలంటీర్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీ రాఘవేందర్ రెడ్డి ముద్దుల చిన్నారి కుమార్తె భవ్య రెడ్డి జన్మదిన వేడుకలు ఆనందం, ఆప్యాయత, చిరునవ్వులతో నిండిన వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి._ _ఈ ముద్దుల చిన్న పాప జన్మదిన వేడుకలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్ ముఖ్య అతిథులుగా హాజరై, చిన్నారి భవ్య రెడ్డితో కలిసి కేక్ కటింగ్ చేసి, ప్రేమతో కేక్ తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు._ _ఈ సందర్భంగా వారు చిన్నారి భవ్య రెడ్డి భవిష్యత్తు వెలుగులా ప్రకాశించాలని, మంచి విద్య, సంపూర్ణ ఆరోగ్యం, సద్గుణాలు అలవరచుకొని తల్లిదండ్రులకు, సమాజానికి గర్వకారణంగా ఎదగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు._ _చిన్నారి అమాయకమైన చిరునవ్వులు, చిలిపి కదలికలు వేడుకకు మరింత శోభను చేకూర్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులను హత్తుకున్నాయి._ _ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందవరం మండల కన్వీనర్ జె. శివారెడ్డి గౌడ్ , రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి ముగతి వీరుపాక్షి రెడ్డి , పార్టీ సీనియర్ నాయకులు కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు సోమల గూడూరు వెంకటేశ్వర రెడ్డి , నియోజకవర్గ
యువజన విభాగ అధ్యక్షులు మరియు మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ , పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప , చేనేత జిల్లా అధ్యక్షులు ఎం.కె. శివ ప్రసాద్ , ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కోరిశెట్టి మధుబాబు , సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ , పట్టణ రైతు విభాగ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బనవాసి బసిరెడ్డి , పట్టణ యువజన విభాగ అధ్యక్షులు బోయరాజు , పట్టణ ప్రధాన కార్యదర్శి గుడికల్ అల్తాఫ్ గారు, కరే రాము , పట్టణ కార్యదర్శులు గురువ మాభాష , జెరుబండి రఘువీర , 2వ వార్డు ఇన్చార్జ్ గడిగే చంద్ర , 4వ వార్డు ఇన్చార్జ్ కనికే నాగేంద్ర , 3వ వార్డు చేనేత మల్లి , పట్టణ బీసీ సెల్ కార్యదర్శి మాచాని రఘు , 5వ వార్డు నాయకులు ఇబ్రహీం, మిట్ట సోమపురం సర్పంచ్ నరసింహులు , గురుజాల సర్పంచ్ వీరాస్వామి, హాలహర్వి జయ రాముడు , తిమ్మాపురం వీరాంజనేయులు , మాసుమాన్ దొడ్డి బి. శ్రీనివాసులు, మాసుమాన్ దొడ్డి హనుమంతు, మాసుమాన్ దొడ్డి పోస్ట్ శ్రీనివాసులు , బనవాసి రాజ్ కుమార్, కోటేకల్ పాపన్న, సొగనూరు ప్రతాప్ గౌడ్, కనకవీడు చంద్రశేఖర్ ఆచారి , గురుజాల కోట వీరేష్ గారు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు._
- https://youtu.be/P9WXAO2ja7w?si=3xBMG0ylNV1frBB21
- *ఎన్నికలలో హామీలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన అక్రమ కేసుల?* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థి విజన సంఘాల నాయకుల పైన రౌడీషీట!?* *రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న నారా లోకేష్* *విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ ను ఎత్తివేయాలి* *రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం* *ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైయస్సార్ విద్యార్థి విభాగం* *రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ ప్రెస్ క్లబ్ నందు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్ర, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు బాబు, వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తూ జైలుకు పంపడాన్ని ఖండించారు.. ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అడగడం లేదు ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు యువజనలకు వాటిని అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి దొంగ కేసులను బయటికి తోడి విద్యార్థి యువజన సంఘాల నాయకులను జైలుకు పంపుతూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులను కేసుల ద్వారానో జైల్లోకు పంపడం ద్వారానో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారానో విద్యార్థి యువజన ఉద్యమాలను అనిచివేయాలని చూస్తూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పులు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెడతారా అని మన ప్రభుత్వం వస్తే మీకు విద్యార్థులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి నేరుగా తీసుకురండి మేము కేసులు పెట్టడం అరెస్టు చేయడం గృహనిర్బంధాలు చేయడం ఇలాంటివి మా ప్రభుత్వంలో ఉండదని చెప్పిన నారా లోకేష్ ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఎలా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వేయాలని విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు తేజ అరుణ్ నాగరాజు మహేష్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*1
- నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ సార్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పార్థసారథి నగర్కు చెందిన దివ్యాంగురాలు ఊర్మిళ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద చీటీ వేశారు. చదువుల కోసం దాచుకున్న నగదును సదరు ఉపాధ్యాయుడు నెలల తరబడి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ యాదవ్ స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఆమె వీడియో విడుదల చేశారు.1
- కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.2
- సంగారెడ్డిలో సీఎం కప్-2025 టార్చ్ ర్యాలీ1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- టిడిపి నుండి వైసీపీలోకి ఎవరు పోలేదు చేరలేదు :- టిడిపి నాయకులు1