Shuru
Apke Nagar Ki App…
ఇళ్లలోకి చేరిన వరద నీరు లక్షెట్టిపేట పట్టణంలోని పలు కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మండలంలో ఉదయం నుండి కుండపోత వర్షం నమోదయింది. దీంతో పట్టణంలోని సత్యసాయి నగర్, తదితర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేక, బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ ఆ కాలనీలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.
Gourinatha p.g
ఇళ్లలోకి చేరిన వరద నీరు లక్షెట్టిపేట పట్టణంలోని పలు కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మండలంలో ఉదయం నుండి కుండపోత వర్షం నమోదయింది. దీంతో పట్టణంలోని సత్యసాయి నగర్, తదితర ప్రాంతాలలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేక, బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ ఆ కాలనీలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.
More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- జై హొ సనాతన ధర్మం3
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1