logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ రక్షణ సేనలోకి కార్యకర్తల చేరిక దొంగ్లీ మండలంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ. దొంగ్లీ మండలంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ వేణు మాధవ్ గారు, రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్ గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు ఆదిల్ గారు, కామారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. సాయిలు గారు, జుక్కల్ కార్యకర్త రమేష్ గారు, బిచ్కుంద మహిళా అధ్యక్షురాలు మాధవి గారు, దొంగ్లీ మండల అధ్యక్షులు మారుతి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు స్వాగతం పలికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

1 hr ago
user_Dantulwar Sopan D
Dantulwar Sopan D
మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago
d4d28cda-54b4-4ea5-9f44-4537cfa8abab

తెలంగాణ రక్షణ సేనలోకి కార్యకర్తల చేరిక దొంగ్లీ మండలంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ. దొంగ్లీ మండలంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ వేణు మాధవ్ గారు, రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్ గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు ఆదిల్ గారు, కామారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం. సాయిలు గారు, జుక్కల్ కార్యకర్త రమేష్ గారు, బిచ్కుంద మహిళా అధ్యక్షురాలు మాధవి గారు, దొంగ్లీ మండల అధ్యక్షులు మారుతి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు స్వాగతం పలికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు... బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు...
బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే  బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • సిరికొండ:చినుకు పడితే చిత్తడే.. కోడూరు హై లెవెల్ బ్రిడ్జి సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    సిరికొండ:చినుకు పడితే చిత్తడే.. కోడూరు హై లెవెల్ బ్రిడ్జి 
సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_RC REDDY
    RC REDDY
    Local News Reporter Nizamabad Rural, Telangana•
    6 hrs ago
  • *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి *రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది* *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి – పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా - 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ నిజామాబాద్‌, ఆగస్టు 25,2026: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్‌ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్‌ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు. అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్‌ అన్నారు. మార్కెట్‌ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్‌, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్‌ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్‌ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్‌ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ శ్రీ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్‌ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్‌ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ భవేష్‌ మిశ్రా, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా
    3
    *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి 

*రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది*
*-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి 
– పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర 
గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా
- 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ 
నిజామాబాద్‌, ఆగస్టు 25,2026: 
రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర 
గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు.
పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని  గవర్నర్‌  పిలుపునిచ్చారు. 
నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు.
అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్‌ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. 
ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.
పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశ  వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు.
భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్‌ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు.
సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు.
అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్‌ అన్నారు. మార్కెట్‌ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్‌, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్‌ అన్నారు.
రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్‌ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
“అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్‌ ఆకాంక్షించారు. 
ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు
రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు
క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, 
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ శ్రీ పల్లె గంగారెడ్డి, 
నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా,
ఆర్మూర్‌ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్‌ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ,
నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ భవేష్‌ మిశ్రా, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* *రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ, ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్ లు, నాయకులు బయల్దేరటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 'ఫీజుల బకాయి - బిజెపి లడాయి' పేరుతో తెలంగాణ బిజెపి నేత ఎన్. రామచందర్ రావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్షకు యువత నుండి వెల్లువెత్తుతున్న మద్దతు వస్తుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఇకనైనా ఆపాలనీ, ఫీజుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు కి మద్దతుగా *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ లు, మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలినట్లు తెలిపారు.
    1
    రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు*
*రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు*
40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ, ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్ రాంచందర్ రావు  చేపట్టిన 48 గంటల నిరహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్ లు, నాయకులు బయల్దేరటం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 'ఫీజుల బకాయి - బిజెపి లడాయి' పేరుతో తెలంగాణ బిజెపి నేత  ఎన్. రామచందర్ రావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్షకు యువత నుండి వెల్లువెత్తుతున్న మద్దతు వస్తుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఇకనైనా ఆపాలనీ,  ఫీజుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు కి మద్దతుగా  *కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ లు, మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలినట్లు తెలిపారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.
    1
    రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులు 
రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే, బుధవారం నుంచి అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఆర్ఎం స్పష్టం చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • సిరికొండ మండల కేంద్రంలో చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో మంగళవారం చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
    1
    సిరికొండ మండల కేంద్రంలో చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం
మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో మంగళవారం చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
    user_RC REDDY
    RC REDDY
    Local News Reporter Nizamabad Rural, Telangana•
    18 hrs ago
  • మెదక్ : వృద్ధురాలి బంగారు పుస్తెలతాడు చోరీ కేసు ను చేదించిన పోలీసులు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణం సాయి నగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల బాలెశెట్టి సులోచన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన పై క్రైం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. దయారా స్ట్రీట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన చాకలి మొగులయ్య (34) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి చోరీ కి గురైన 4 లక్షల 50 వేల విలువ గల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి పై గతంలో ఆటో దొంగతనం, రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన క్రైమ్ టీం నర్సింలు, మల్లేశం ను ఇన్‌స్పెక్టర్ మహేష్ అభినందించారు.
    1
    మెదక్ : వృద్ధురాలి బంగారు పుస్తెలతాడు చోరీ కేసు ను చేదించిన పోలీసులు
వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణం సాయి నగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల బాలెశెట్టి సులోచన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన పై క్రైం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. దయారా స్ట్రీట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన చాకలి మొగులయ్య (34) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి చోరీ కి గురైన 4 లక్షల 50 వేల విలువ గల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి పై గతంలో ఆటో దొంగతనం, రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన క్రైమ్ టీం నర్సింలు, మల్లేశం ను ఇన్‌స్పెక్టర్ మహేష్ అభినందించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.