Shuru
Apke Nagar Ki App…
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) కీలక సమావేశం ఈనెల 13న (సోమవారం) ఉదయం 11 గంటలకు జోగిపేట్ రోడ్డులోని జీఆర్కే (GRK) గార్డెన్స్లో జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కొండాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల బూత్ లెవల్ ఏజెంట్లు, గ్రామ స్థాయి నాయకులు, మండల ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
Yahia Ahmed
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) కీలక సమావేశం ఈనెల 13న (సోమవారం) ఉదయం 11 గంటలకు జోగిపేట్ రోడ్డులోని జీఆర్కే (GRK) గార్డెన్స్లో జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కొండాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల బూత్ లెవల్ ఏజెంట్లు, గ్రామ స్థాయి నాయకులు, మండల ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
More news from Sangareddy and nearby areas
- సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో మాంగల్య షాపింగ్ మాల్ను సినీ నటి రాశి ఖన్నా ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటి రాశి ఖన్నా విచ్చేయడంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అక్కడకు చేరుకున్న ఆమె అభిమానులకు అభివాదం చేయడమే కాకుండా, వారిని ఉత్సాహపరిచేందుకు వేదికపై స్టెప్పులు వేసి అలరించారు. ఈ సందర్భంగా ప్రియమైన నటితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంది.2
- మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలగించాలని గ్రామ మహిళలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ వల్ల జరుగుతున్న కాలుష్యంపై తాము ప్రశ్నించినా, లేదా దానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినా తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత బాధాకరమని వారు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే ఇక్కడి నుండి తరలించాలని, రంగాయపల్లిని కాలుష్య రహిత గ్రామంగా మార్చాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.1
- కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రి చెప్పినట్లే బ్యారేజ్ కొట్టుకుపోయినా కూడా, ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ఆ పోయే నీళ్ళలోనే కలుస్తాయని ఆయన వివరించారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.1
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- Post by Assalamualikumjj3
- తెలంగాణలో రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు గారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నీకు రక్తమే కావాలనుకుంటే, రైతుల కోసం మా రక్తాన్ని కూడా ధారపోస్తామంటూ హరీష్ రావు గారు స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.1
- జిన్నారం మండలం బొల్లారం ఐడీఏలోని సెంచరీ పరుపుల పరిశ్రమ గోడౌన్లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పటాన్చెరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజిన్ ఆలస్యంగా చేరుకోవడం వల్ల ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు రంగంలోకి దిగి, షార్ట్సర్క్యూట్ కారణంగానే ఇది జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే రసాయన పరిశ్రమ ఉన్నప్పటికీ, మంటలు అటువైపు వ్యాపించకపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పింది.1