logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్ రావు వెల్లడించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ స్థాయిలో "అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రైతన్న మీకోసం 2026-27" తొలి విడత పంపిణీ కార్యక్రమం, అలాగే పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయ్ రావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనులను సకాలంలో చేపట్టేందుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు రైతు కుటుంబాల జీవనోపాధి మెరుగుదలకు దోహదపడుతోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఆయన సూచించారు. ఏడీఏ మంగళగిరి పి. సంధ్యారాణి మాట్లాడుతూ, పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకాల కింద మంగళగిరి నియోజకవర్గంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.8.91 కోట్ల ఆర్థిక సాయం జమ కానుందని వెల్లడించారు. ఈ ఆర్థిక సహాయం రైతులకు సాగు ఖర్చుల భారం తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అధికారులు పథకాల అమలు విధానం, అర్హతలు, నిధుల జమ ప్రక్రియపై రైతులకు వివరాలు అందించారు. అనంతరం లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు ఇతర రకాల ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచామని, డోర్ టు డోర్ అగ్రికల్చర్ (2.0) కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పి. సంధ్యారాణి తెలిపారు. ప్రస్తుతం ఎరువుల కొరత ఎక్కడా లేదని, అన్ని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగిన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ఎరువులను అధికారిక కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ సేవలు, సాంకేతిక సలహాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు ఆమె పిలుపునిచ్చారు. రైతుల అభ్యున్నతి కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబదయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల జయసత్య, స్వచంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ తోట పార్థసారథి, మంగళగిరి సొసైటీ అధ్యక్షులు గాదె పిచ్చిరెడ్డి, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేసంనేని అనిత, తెలుగు రైతు అధ్యక్షులు జిల్లా కళ్ళం రాజశేఖర్ రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రభారాణి, అగ్రికల్చర్ ఏవో శైలాజరాణి, యార్డ్ డైరెక్టర్లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

19 hrs ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago
0dec38d9-129e-48ed-9c8e-14c4295d583e

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్ రావు వెల్లడించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ స్థాయిలో "అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రైతన్న మీకోసం 2026-27" తొలి విడత పంపిణీ కార్యక్రమం, అలాగే పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయ్ రావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనులను సకాలంలో చేపట్టేందుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు రైతు కుటుంబాల జీవనోపాధి మెరుగుదలకు దోహదపడుతోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఆయన సూచించారు. ఏడీఏ మంగళగిరి పి. సంధ్యారాణి మాట్లాడుతూ, పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకాల కింద మంగళగిరి నియోజకవర్గంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.8.91 కోట్ల ఆర్థిక సాయం జమ కానుందని వెల్లడించారు. ఈ ఆర్థిక సహాయం రైతులకు సాగు ఖర్చుల భారం తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అధికారులు పథకాల అమలు విధానం, అర్హతలు, నిధుల జమ ప్రక్రియపై రైతులకు వివరాలు అందించారు. అనంతరం లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు ఇతర రకాల ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచామని, డోర్ టు డోర్ అగ్రికల్చర్ (2.0) కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేస్తున్నామని పి. సంధ్యారాణి తెలిపారు. ప్రస్తుతం ఎరువుల కొరత ఎక్కడా లేదని, అన్ని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగిన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ఎరువులను అధికారిక కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ సేవలు, సాంకేతిక సలహాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు ఆమె పిలుపునిచ్చారు. రైతుల అభ్యున్నతి కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబదయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల జయసత్య, స్వచంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ తోట పార్థసారథి, మంగళగిరి సొసైటీ అధ్యక్షులు గాదె పిచ్చిరెడ్డి, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేసంనేని అనిత, తెలుగు రైతు అధ్యక్షులు జిల్లా కళ్ళం రాజశేఖర్ రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రభారాణి, అగ్రికల్చర్ ఏవో శైలాజరాణి, యార్డ్ డైరెక్టర్లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు. నందికొట్కూరులో జరిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య, 'పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. రైతుల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి పేర్కొన్నారు.
    1
    కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు. నందికొట్కూరులో జరిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య, 'పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. రైతుల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి పేర్కొన్నారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు. పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, హెచ్‌ఎం, మరియు పిటి సాంబశివారెడ్డి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ, యోగా, ధ్యానం, నడక వల్లనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఈ సాధనలే నివారణ మార్గాలని ఆయన ఉద్ఘాటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, నడకను అలవర్చుకొని, తమ విలువైన సమయంలో రోజుకు కనీసం రెండు గంటలైనా వీటికి కేటాయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం, నడకల విశిష్టతను బ్రహ్మానంద చారి వివరించారు.

పిటి సాంబశివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు తమ హెచ్‌ఎం మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగా నేర్పుతున్నామని తెలిపారు. మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరం అని ఆయన వివరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.

SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.
    1
    ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బద్వేలు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ ఎం. కృష్ణ, ఆర్డీవో చంద్రమోహన్లు పిలుపునిచ్చారు. జూన్ 20న శనివారం, బద్వేలు పట్టణంలోని అన్న క్యాంటీన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్డీవో చంద్రమోహన్, కమిషనర్ కృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు చీపురు పట్టి క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా భాగస్వామ్యం అయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో అడ్మిన్లు, ఇతర సెక్రటరీలు కనిపించకపోవడం గమనార్హం. బద్వేలు మున్సిపాలిటీలో నిర్వహించిన ఈ ర్యాలీని 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ'గా అభివర్ణించారు.
    1
    బద్వేలు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ ఎం. కృష్ణ, ఆర్డీవో చంద్రమోహన్లు పిలుపునిచ్చారు. జూన్ 20న శనివారం, బద్వేలు పట్టణంలోని అన్న క్యాంటీన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ అనంతరం, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్డీవో చంద్రమోహన్, కమిషనర్ కృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు చీపురు పట్టి క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా భాగస్వామ్యం అయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో అడ్మిన్లు, ఇతర సెక్రటరీలు కనిపించకపోవడం గమనార్హం. బద్వేలు మున్సిపాలిటీలో నిర్వహించిన ఈ ర్యాలీని 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ'గా అభివర్ణించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నంద్యాల కోర్టులో జూలై 11న జరగనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయమూర్తి అమ్మనరాజా మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా అమూల్యమైన సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నొక్కిచెప్పారు.
    1
    నంద్యాల కోర్టులో జూలై 11న జరగనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యాయమూర్తి అమ్మనరాజా మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా అమూల్యమైన సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నొక్కిచెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.