logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. సోమవారం నాడు రెవెన్యూ అధికారుల‌తో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు. గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, అయితే ఇప్పుడు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందేలా పారదర్శకమైన, వేగవంతమైన వ్యవస్థను రూపొందించామని ఆయన వివరించారు. అలాగే, భూభారతి చట్టంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఐదు మండలాల్లోని పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ విధానం విజయవంతం కావడంతో, అక్కడి అనుభవాలు, సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో దీనిని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి గారు సూచించారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో, ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ పూర్తి చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన ద‌ర‌ఖాస్తుల‌ను పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారానికి 2020 ఆర్వోఆర్ చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. అయితే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం నిబంధనలను సవరించి, దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

1 hr ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
dc377d35-7134-49b9-8a86-618d497decf0

రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. సోమవారం నాడు రెవెన్యూ అధికారుల‌తో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు. గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, అయితే ఇప్పుడు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందేలా పారదర్శకమైన, వేగవంతమైన వ్యవస్థను రూపొందించామని ఆయన వివరించారు. అలాగే, భూభారతి చట్టంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఐదు మండలాల్లోని పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ విధానం విజయవంతం కావడంతో, అక్కడి అనుభవాలు, సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో దీనిని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి గారు సూచించారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో, ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ పూర్తి చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన ద‌ర‌ఖాస్తుల‌ను పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారానికి 2020 ఆర్వోఆర్ చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి విమర్శించారు. అయితే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం నిబంధనలను సవరించి, దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో, తాసిల్దార్ మరియు ఎమ్మార్వో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వార్డు నెంబర్లు, సర్పంచులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు) మరియు BLA (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
    4
    ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో, తాసిల్దార్ మరియు ఎమ్మార్వో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో SIR ప్రోగ్రాంపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వార్డు నెంబర్లు, సర్పంచులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. BLO (బూత్ లెవల్ ఆఫీసర్లు) మరియు BLA (బూత్ లెవల్ ఏజెంట్లు)లకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వివాహ మహోత్సవం సందర్భంగా, ఆయనకు, ఆయన దంపతులకు నియోజకవర్గం తరఫున వివాహ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, మరియు పలువురు నాయకులు కలిసి ఈ శుభ సందర్భంలో తమ అభినందనలను తెలియజేశారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వివాహ మహోత్సవం సందర్భంగా, ఆయనకు, ఆయన దంపతులకు నియోజకవర్గం తరఫున వివాహ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, మరియు పలువురు నాయకులు కలిసి ఈ శుభ సందర్భంలో తమ అభినందనలను తెలియజేశారు.
    user_Ajmera Sunitha
    Ajmera Sunitha
    Electrician పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    4
    సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్న సందర్భంగా కోణంనేని సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొగ్గు చోరీ జరిగిందని కార్మిక వర్గాల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బొగ్గును ఎవరు దోచుకుపోతారు, ఎందుకు దోచుకుపోతారని ప్రశ్నించిన కోణంనేని, 40 మిలియన్ల బొగ్గు, 40 లక్షల టన్నుల బొగ్గును దోచుకోవడం సాధ్యమేనా అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పదే పదే కుంభకోణం ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులకు బీజేపీ పార్టీ మడుగులోతుతోందని, కోతిని చూసి నక్క గిక్కున్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఇప్పటికే సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన కోణంనేని, కొత్త మైనింగ్ ల కోసం అందరూ సహకరించాలని కోరుతూ కార్మిక కుటుంబాలను రోడ్డున పడే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. పదే పదే మైనింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ బొగ్గు చోరీ జరిగిందంటూ కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా న్యాయమైన బొగ్గును అమ్మడానికే చూస్తుంది గానీ, చోరీ చేయదని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదని కోణంనేని సాంబశివరావు అన్నారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొన్న సందర్భంగా కోణంనేని సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొగ్గు చోరీ జరిగిందని కార్మిక వర్గాల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బొగ్గును ఎవరు దోచుకుపోతారు, ఎందుకు దోచుకుపోతారని ప్రశ్నించిన కోణంనేని, 40 మిలియన్ల బొగ్గు, 40 లక్షల టన్నుల బొగ్గును దోచుకోవడం సాధ్యమేనా అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పదే పదే కుంభకోణం ఆరోపణలను ఖండించారు.

బీఆర్ఎస్ పార్టీ అడుగులకు బీజేపీ పార్టీ మడుగులోతుతోందని, కోతిని చూసి నక్క గిక్కున్నట్లుగా రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఇప్పటికే సింగరేణి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన కోణంనేని, కొత్త మైనింగ్ ల కోసం అందరూ సహకరించాలని కోరుతూ కార్మిక కుటుంబాలను రోడ్డున పడే విధంగా చూస్తున్నారని మండిపడ్డారు. పదే పదే మైనింగ్ ప్రాంతాల్లో పర్యటిస్తూ బొగ్గు చోరీ జరిగిందంటూ కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా న్యాయమైన బొగ్గును అమ్మడానికే చూస్తుంది గానీ, చోరీ చేయదని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలను కార్మికులు నమ్మే పరిస్థితి లేదని కోణంనేని సాంబశివరావు అన్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై, తీర్థాల, కామంచికల్, పడమటితండా, జాన్ బాద్ తండా, దారేడు తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా అన్ని రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఉదయం నుంచి భానుడి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ చల్లని వాతావరణం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. అంతేకాకుండా, వర్షం రాకతో రైతులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
    1
    ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై, తీర్థాల, కామంచికల్, పడమటితండా, జాన్ బాద్ తండా, దారేడు తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా అన్ని రోడ్లు వరద నీటితో నిండిపోయాయి.

ఉదయం నుంచి భానుడి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ చల్లని వాతావరణం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. అంతేకాకుండా, వర్షం రాకతో రైతులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
    user_Bhukya Gangadhar
    Bhukya Gangadhar
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ఈనెల 30న జరగనున్న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చింతకాని మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి సీఎం సభ కోసం అనువైన ప్రాంతాలను మరియు సభా స్థలిని పరిశీలించారు.
    1
    ఈనెల 30న జరగనున్న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు సంబంధించి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చింతకాని మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి సీఎం సభ కోసం అనువైన ప్రాంతాలను మరియు సభా స్థలిని పరిశీలించారు.
    user_Fayaz
    Fayaz
    Photography Khammam Urban, Telangana•
    6 hrs ago
  • చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
    1
    చింతకాని మండలంలోని మత్కేపల్లి – జగన్నాధపురం ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు అధికారికంగా 'రైతు ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సభ వేదికగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఈ సభ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో ఒక విద్యార్థిని నీట్ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఈ పరిణామంతో విద్యార్థి తండ్రి పడిన ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
    1
    ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో ఒక విద్యార్థిని నీట్ పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఈ పరిణామంతో విద్యార్థి తండ్రి పడిన ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
    user_Chandu
    Chandu
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.