Shuru
Apke Nagar Ki App…
కొమురం భీం జిల్లాకు రెండు సబ్స్టేషన్ల మంజూరు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అజ్మీర శ్యామ్ నాయక్ కృతజ్ఞతలు కొమురం భీం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్ మండలం వావుదం, లింగాపూర్ మండలాలకు రెండు విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీర శ్యామ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కొమురం భీం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తాను కోరిన ప్రతి పనికి సానుకూల స్పందన ఇస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్యామ్ నాయక్ క్యాంప్ కార్యాలయం, ఆసిఫాబాద్లో జరిగింది.
Krishna
కొమురం భీం జిల్లాకు రెండు సబ్స్టేషన్ల మంజూరు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అజ్మీర శ్యామ్ నాయక్ కృతజ్ఞతలు కొమురం భీం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్ మండలం వావుదం, లింగాపూర్ మండలాలకు రెండు విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీర శ్యామ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కొమురం భీం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తాను కోరిన ప్రతి పనికి సానుకూల స్పందన ఇస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్యామ్ నాయక్ క్యాంప్ కార్యాలయం, ఆసిఫాబాద్లో జరిగింది.
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా మల్లంపల్లి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.1
- వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఇద్దరు సస్పెండ్... వరంగల్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వరంగల్ వ్యవసాయ కాలేజీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలడంతో జూనియర్ అసిస్టెంట్ సిద్దార్థ, టెక్నికల్ అసిస్టెంట్ ప్రశ్నపత్రాల ఇంచార్జ్ రమేష్ ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, 5గురు ఇన్-సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు వ్యవసాయ కళాశాల అధికారులు తెలిపారు.1
- గజ్వేల్ మున్సిపల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.1
- పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని వారి ఇంటి ఆవరణలో మొక్క నాటిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సతీమణి సుంకే దీవెన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- వరంగల్ నగరంలో చిన్న పిల్లల కిడ్నాపింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదుగురు చిన్నారులతో పాటు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.1
- నర్సంపేట మండలంలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న యాన్యువల్ డే వేడుకల్లో భాగంగా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సౌమిత్, జోయల్, వరుణ్, వర్షిత్ జోన, విద్యార్థులు డ్యాన్సుల్లో పాల్గొని ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల నృత్యాలు హాజరైన తల్లిదండ్రులు, అతిథులను ఆకట్టుకోగా, వారి కేరింతలు, చప్పట్లతో కాలేజీ ప్రాంగణం మొత్తం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. తమ పిల్లల ప్రతిభను చూసిన తల్లిదండ్రులు గర్వంతో ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యాన్యువల్ డే వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి.3