Shuru
Apke Nagar Ki App…
జిల్లాకు విచ్చేసిన హైకోర్టు జడ్జీ సూరేపల్లి నందా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ తెలంగాణ హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్, జనగామ జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జీ సురేపల్లి నందా జిల్లాకు విచ్చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిర్వహించిన గౌరవ వందనాన్ని హైకోర్టు జడ్జీ స్వీకరించారు.ఈ నేపథ్యంలో పోలీసు కమిషనర్ (సీపీ) శ్వేత, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మర్యాదపూర్వకంగా హైకోర్టు జడ్జీని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
Shareef pasha
జిల్లాకు విచ్చేసిన హైకోర్టు జడ్జీ సూరేపల్లి నందా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ తెలంగాణ హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్, జనగామ జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జీ సురేపల్లి నందా జిల్లాకు విచ్చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిర్వహించిన గౌరవ వందనాన్ని హైకోర్టు జడ్జీ స్వీకరించారు.ఈ నేపథ్యంలో పోలీసు కమిషనర్ (సీపీ) శ్వేత, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మర్యాదపూర్వకంగా హైకోర్టు జడ్జీని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత కొనసాగింపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 10.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ప్రస్తుతం 8,03,370 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అధికారులు బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లను ఎత్తి, వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- వరద ప్రభావం తగ్గడంతో బొగత జలపాతానికి గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి పర్యాటకులకు అనుమతి ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొగత జలపాతాన్ని శనివారం నుంచి సందర్శకులకు తిరిగి అనుమతిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాతం కొలనులోకి దిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. సందర్శకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటిస్తూ, అధికారుల సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.1