స్వస్థలం కోరుట్ల కు చేరిన మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్ జీ... తిరిగొస్తానని కళలో కూడా ఊహించలేదని వెల్లడి 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్వగ్రామం కోరుట్ల కు చేరుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంత ఇంటికి చేరుకున్న దేవ్ జీ బావోద్వేగానికి గురయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా కుటుంబ సభ్యులు తిరుపతి కి నుదుట తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఫోటోకు దండం పెట్టి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. బంధుమిత్రులు గుండెలకు హత్తుకుని ఆత్మీయ సత్కారం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ దేవ్ జీ కాసేపు ఆవేదనతో, ఆనందంతో స్పందించారు. తిరిగోస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజీ స్టూడెంట్ గా అజ్ఞాతంలోకి పోయానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా అంతరాలు ఉండకూడదని కుల మత ప్రాంతాల అంతరాలు ఉండొద్దని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని తెలిపారు. నాకంటూ కుటుంబం లేదని, కోరుట్ల ప్రజలే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబసభ్యులని తెలిపారు. ఇల్లు ఎంత ముఖ్యమో, దేశం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నానని తెలిపారు. ప్రజల కోసమే తాను పని చేస్తానని, తన సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. బైట్ - దేవ్ జీ - మావోయిస్టు పార్టీ మాజీ నేత.
స్వస్థలం కోరుట్ల కు చేరిన మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్ జీ... తిరిగొస్తానని కళలో కూడా ఊహించలేదని వెల్లడి 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్వగ్రామం కోరుట్ల కు చేరుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత స్వంత ఇంటికి చేరుకున్న దేవ్ జీ బావోద్వేగానికి గురయ్యారు. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా కుటుంబ సభ్యులు తిరుపతి కి నుదుట తిలకం దిద్ది మంగళహారతితో స్వాగతం పలికారు. తల్లిదండ్రుల ఫోటోకు దండం పెట్టి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. బంధుమిత్రులు గుండెలకు హత్తుకుని ఆత్మీయ సత్కారం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ దేవ్ జీ కాసేపు ఆవేదనతో, ఆనందంతో స్పందించారు.
తిరిగోస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాలేజీ స్టూడెంట్ గా అజ్ఞాతంలోకి పోయానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వచ్చానో మీ అందరికీ తెలుసని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా అంతరాలు ఉండకూడదని కుల మత ప్రాంతాల అంతరాలు ఉండొద్దని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని తెలిపారు. నాకంటూ కుటుంబం లేదని, కోరుట్ల ప్రజలే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబసభ్యులని తెలిపారు. ఇల్లు ఎంత ముఖ్యమో, దేశం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నానని తెలిపారు. ప్రజల కోసమే తాను పని చేస్తానని, తన సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. బైట్ - దేవ్ జీ - మావోయిస్టు పార్టీ మాజీ నేత.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి గౌరవ ప్రతిపక్ష నాయకులు మరియు తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.1
- ములుగు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా చట్ట విరుద్ధమని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో గోపాలరావు హెచ్చరించారు.కలెక్టరేట్లో నిర్వహించిన “సురక్షిత మాతృత్వం – లింగ నిర్ధారణ నిరోధక చట్టం” పై వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ పరీక్షలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఆసుపత్రుల అనుమతులు రద్దు చేయడమే కాక, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.1
- Post by Tagore1
- గారేపల్లి, ఏప్రిల్ 8: గారేపల్లి-మహాదేవపూర్ జాతీయ రహదారిపై చిన్నవాగు సమీపంలో కోడి వ్యర్థాలను విచ్చలవిడిగా పారబోస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చికెన్ వ్యాపార నిర్వహకులు నిర్లక్ష్యంగా ఈ వ్యర్థాలను పారబోస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వ్యర్థాల నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా హైవేపై ప్రయాణించే వాహనదారులు, సమీప రైతులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పరిస్థితి మరింత విషమిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి హానికరంగా మారుతున్న ఈ చర్యలపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేటలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలనే డిమాండ్తో నిరవధిక సమ్మెకు దిగారు. రిజల్ట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విధానంలో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ నుంచి పర్మినెంట్గా మార్పు ప్రక్రియను పారదర్శకంగా, విద్యార్హతలకు అనుగుణంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.2
- ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ... రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ లో విరాళాల సేకరణ రెండో రోజు సందర్భంగా ప్రజా పోరాటాల కోసం నిత్యం సిపిఐ పోరాడుతుందని పేద మధ్యతరగతి ప్రజల కోసం నిత్యం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అదేవిధంగా సామాన్యులు జీవించే హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆమె అన్నారు కార్మికుల విద్యార్థుల కర్షకుల మేధావుల గొంతులను ప్రశ్నించే గొంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుద్యోగులకు విద్యార్థులకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె అన్నారు ప్రజా సమస్య పరిష్కరించుకుంటే భారత కమ్యూనిస్టు పార్టీగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తామని ఆమె కింద రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి . ఎల్. దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ సిపిఐ నాయకులు ప్రవీణ్ సాయిలు ఆముదాల గంగాధర్. ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్ శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- సింగరేణిలో మెడికల్ బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు 3 మెడికల్ బోర్డులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే రెండు మెడికల్ బోర్డు నిర్వహించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మెడికల్ బోర్డులో అవకతవకులు జరిగాయని, దానిపై విజిలెన్స్ అధికారులచే విచారణ చేపడుతామన్నారు. దాన్ని సాకుగా తీసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అన్ ఫిట్ అయిన వారి వారసులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర సాయిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో నిరసనలు చేపడుందని తెలిపారు.1
- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన అడ్లూరి సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమికి పట్టా కోసం 8 ఏళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫైలు ముందుకు కదలడం లేదని వాపోయారు. 75 ఏళ్ల వృద్ధుడైన ఆయనకు ఆరుగురు సంతానం ఉండగా, వారిలో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- Post by Tagore1