మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి ఫలితంతో ధర్మవరం లో కంటి వెలుగులకు నూతన దిశ – ఉచిత నేత్ర శస్త్రచికిత్సలతో ప్రజలకు కొత్త జీవితం ధర్మవరం, ఏప్రిల్ 15:– ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా కంటి ఆరోగ్య రంగంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందనను పొందుతున్నాయని మంత్రి కార్యాలయం పేర్కొంది. మంత్రి గారి ప్రత్యేక చొరవతో సంస్కృతి సేవా సమితి సహకారంతో, ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన శంకర నేత్రాలయ (Sankara Nethralaya – USA) ఆధ్వర్యంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ద్వారా ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు బుధవారం కూడా విజయవంతంగా కొనసాగినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలకు నిపుణుల వైద్యం చేరువ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ శిబిరానికి హాజరవుతున్నారని కార్యాలయం వివరించింది. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న కంటి పరీక్షల్లో కంటిశుక్లం (క్యాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్న పలువురు రోగులను గుర్తించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసినట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది. ఆ క్రమంలో బుధవారం ఒక్కరోజే 30 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపిన విషయాన్ని మంత్రి కార్యాలయం వెల్లడించింది. శస్త్రచికిత్స అనంతరం రోగులు వేగంగా కోలుకుంటూ తమ సాధారణ జీవనశైలికి తిరిగి చేరుకుంటున్నారని, ఇది ఈ కార్యక్రమం విజయాన్ని ప్రతిబింబిస్తున్న ముఖ్య సూచికగా భావించవచ్చని మంత్రి కార్యాలయం వివరించింది. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన నేత్ర చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించడం ద్వారా వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కార్యాలయం స్పష్టం చేసింది. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ వంటి ఆధునిక సదుపాయాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకే అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మంత్రి సత్య కుమార్ యాదవ్ కట్టుబాటును ప్రతిబింబిస్తున్నదని మంత్రి కార్యాలయం పేర్కొంది. ధర్మవరం నియోజకవర్గాన్ని ఆరోగ్య సేవల విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి కొనసాగుతోందని కార్యాలయం తెలియజేసింది.
మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి ఫలితంతో ధర్మవరం లో కంటి వెలుగులకు నూతన దిశ – ఉచిత నేత్ర శస్త్రచికిత్సలతో ప్రజలకు కొత్త జీవితం ధర్మవరం, ఏప్రిల్ 15:– ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యంగా కంటి ఆరోగ్య రంగంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందనను పొందుతున్నాయని మంత్రి కార్యాలయం పేర్కొంది. మంత్రి గారి ప్రత్యేక చొరవతో సంస్కృతి సేవా సమితి సహకారంతో, ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన శంకర నేత్రాలయ (Sankara Nethralaya – USA) ఆధ్వర్యంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ద్వారా ధర్మవరం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు బుధవారం కూడా విజయవంతంగా కొనసాగినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలకు నిపుణుల వైద్యం చేరువ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ శిబిరానికి హాజరవుతున్నారని కార్యాలయం వివరించింది. గత
వారం రోజులుగా నిర్వహిస్తున్న కంటి పరీక్షల్లో కంటిశుక్లం (క్యాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్న పలువురు రోగులను గుర్తించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసినట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది. ఆ క్రమంలో బుధవారం ఒక్కరోజే 30 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపిన విషయాన్ని మంత్రి కార్యాలయం వెల్లడించింది. శస్త్రచికిత్స అనంతరం రోగులు వేగంగా కోలుకుంటూ తమ సాధారణ జీవనశైలికి తిరిగి చేరుకుంటున్నారని, ఇది ఈ కార్యక్రమం విజయాన్ని ప్రతిబింబిస్తున్న ముఖ్య సూచికగా భావించవచ్చని మంత్రి కార్యాలయం వివరించింది. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఖరీదైన నేత్ర చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించడం ద్వారా వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కార్యాలయం స్పష్టం చేసింది. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ వంటి ఆధునిక సదుపాయాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకే అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మంత్రి సత్య కుమార్ యాదవ్ కట్టుబాటును ప్రతిబింబిస్తున్నదని మంత్రి కార్యాలయం పేర్కొంది. ధర్మవరం నియోజకవర్గాన్ని ఆరోగ్య సేవల విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి కొనసాగుతోందని కార్యాలయం తెలియజేసింది.
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- ✒️- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు1