Shuru
Apke Nagar Ki App…
రక్షాబంధన్ పండుగ విశిష్టమైనది అన్నా చెల్లెలు, అక్కదమ్ముల అనుబంధాన్ని తెలిపే రక్షాబంధన్ పండుగ విశిష్టమైందని లక్షెట్టిపేట ఇంచార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కట్ల రాకేష్, ఎంఐఎస్ ఆపరేటర్ ఏ.వినోద్ కుమార్ అన్నారు. రక్షాబంధన్ పురస్కరించుకొని గురువారం పట్టణంలోని శిశు మందిర్ విద్యార్థినులతో వారు రాఖీ కట్టించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, శిశు మందిర్ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Gourinatha p.g
రక్షాబంధన్ పండుగ విశిష్టమైనది అన్నా చెల్లెలు, అక్కదమ్ముల అనుబంధాన్ని తెలిపే రక్షాబంధన్ పండుగ విశిష్టమైందని లక్షెట్టిపేట ఇంచార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కట్ల రాకేష్, ఎంఐఎస్ ఆపరేటర్ ఏ.వినోద్ కుమార్ అన్నారు. రక్షాబంధన్ పురస్కరించుకొని గురువారం పట్టణంలోని శిశు మందిర్ విద్యార్థినులతో వారు రాఖీ కట్టించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, శిశు మందిర్ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More news from Tirupati and nearby areas
- Post by Omnamashivaya S1
- సుపరిపాలనకు వాజ్పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1