ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీ ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ చర్యలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గోదాం భద్రతకు సంబంధించి అమలు చేస్తున్న ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను కూడా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల భద్రత, గోదాం నిర్వహణ విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీ ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ చర్యలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గోదాం భద్రతకు సంబంధించి అమలు చేస్తున్న ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను కూడా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల భద్రత, గోదాం నిర్వహణ విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
- బొమ్మాబొరుసుఆడుతున్న ఏడుగురు అరెస్టు24510నగదుఆరు సెల్ ఫోన్లుస్వాదీనంఎస్పీశ్రీనివాస్ రావు బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్రూ.24,510 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్దుర్తి మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి జూదం ఆడుతున్న . వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్రెడ్డి, గాండ్ల రాజు లనుఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం4 చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జూదంఆడుతున్న సమాచారం 100కాల్ చేసి సమాచారం ఇవ్వాన్నారు. జూదంవల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ జూదం, బెట్టింగ్కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీశ్రీనివాస్ రావు కోరారు.సమాచారం ఇచ్చిన వారిపేర్లను గుప్తంగా ఉంచుతామన్నారు.1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- బోధన్ రకాసిపేట్లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్లు, ఆలిమ్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.1
- ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్ కు హాజరైన ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రామాయంపేట అక్కన్నపేట మండలంలోని ఝాoసింగ్ లింగాపూర్ లోగ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ రజనీతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్లోడింగ్ ప్రక్రియలనుపర్యవేక్షించి , అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2002 సంవత్సరానికి చెందిన ఓటర్ల పేర్ల జాబితాను పరిశీలించి, సరిపోల్చుకోవాలని తెలిపారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించిన *కలెక్టర్*, అప్లోడింగ్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది ఓటర్లు హియరింగ్కు వస్తున్నారు? ఎన్ని దరఖాస్తులు ధ్రువీకరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు జారీ చేసిన ప్రతి వ్యక్తి హియరింగ్కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.1
- యువతకు అండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భరోసా ఎల్లారెడ్డి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల డీజే పర్మిషన్ల విషయంలో యువతకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అండగా నిలిచారు. యువత విజ్ఞప్తి మేరకు పోలీసు అధికారులతో మాట్లాడి, ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యువత సమస్యలపై స్పందిస్తూ, శాంతియుతంగా మరియు నిబంధనలకు అనుగుణంగా వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు.1
- విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- వెంకటరత్నాపూర్లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్లో గుర్తుతెలియని వ్యక్తులు బైకులను ధ్వంసం చేయడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. రత్నాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో గ్రామస్థులు తమ ద్విచక్ర వాహనాలను తూప్రాన్ వైపు రహదారి పక్కన పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడ నిలిపి ఉంచిన బైకులపై గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ బైక్ హ్యాండిల్ డోమ్ను ధ్వంసం చేయడంతో పాటు మరో ఐదు బైకుల్లో ఇసుక పోసి, వాటికి సంబంధించిన పైపులను తొలగించినట్లు పేర్కొన్నారు. ఉదయం బైకుల పరిస్థితిని గమనించిన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, బైకులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.1