ప్రాణదాతకు సన్మానం. ఏ ఐ బి ఎస్ పి. పలమనేరు మార్చి 14( ప్రజా ప్రతిభ) తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజుకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఘనంగా సన్మానించారు. అందులో భాగంగా శనివారం పలమనేర్ పట్టణంలోని మానవ హక్కుల కార్యాలయం నందు ఏఐబిఎస్పి రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం,మణీ, సరస్వతి, చంద్ర మాట్లాడుతూ పెద్దపంజాణి మండలం గోను మాకులపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడని, గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపడుతుండగా జనరేటర్ అకస్మాత్తుగా ఆన్ కావడంతో మహేంద్ర షాక్కు గురై అక్కడే కుప్పకూలిపోయాడని తెలిపారు. అటువైపు వెళుతున్న మానవ హక్కుల నాయకులు సోమరాజు విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్నారు. అతన్ని కాపాడ్డానికి ఎవరు సాహసించ లేకపోవడంతో ప్రాణానికి తెగించి కొయ్యలతో బాధితుడు వేలాడుతున్న కరెంట్ ఎగ్జిఫీజులను తొలగించాడు. అనంతరం సోమరాజు కరెంటు స్తంభం పైకి ఎక్కి చాకచక్యంగా మహేంద్రను కిందకి దింపి ఇతరుల సహాయముతో పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. అతను చేసిన సాహసాన్ని గుర్తించిన ఏఐబిఎస్పి నాయకులు సోమరాజును అభినందించి శాలువలతో ఘనంగా సన్మానించారు. సోమరాజు ఈ త్యాగంతో పాటు గతంలో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు అందించారని కొనియాడారు. ఒక పేద కుటుంబం నుండి పొట్టకూటి కోసం ప్రమాదం అని తెలిసినా విద్యుత్ శాఖలో పనిచేస్తూ ప్రమాదంలో ఇరుక్కున్న మనిషిని చూసి కాపాడుడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో తన ప్రాణం పోయిన పరవాలేదు బాధితుని కాపాడి వారి కుటుంబానికి పెద్ద దిక్కును అందించిన సోమరాజు సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం.సుబ్రమణ్యం, అమానుల్లా, సాంబశివ, ఆనంద్, బుజ్జి, శివన్న, రాజు, సూర, శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు
ప్రాణదాతకు సన్మానం. ఏ ఐ బి ఎస్ పి. పలమనేరు మార్చి 14( ప్రజా ప్రతిభ) తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజుకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఘనంగా సన్మానించారు. అందులో భాగంగా శనివారం పలమనేర్ పట్టణంలోని మానవ హక్కుల కార్యాలయం నందు ఏఐబిఎస్పి రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం,మణీ, సరస్వతి, చంద్ర మాట్లాడుతూ పెద్దపంజాణి మండలం గోను మాకులపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడని, గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపడుతుండగా జనరేటర్ అకస్మాత్తుగా ఆన్ కావడంతో మహేంద్ర షాక్కు గురై అక్కడే కుప్పకూలిపోయాడని తెలిపారు. అటువైపు వెళుతున్న మానవ హక్కుల నాయకులు సోమరాజు విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్నారు. అతన్ని కాపాడ్డానికి ఎవరు సాహసించ లేకపోవడంతో ప్రాణానికి తెగించి కొయ్యలతో బాధితుడు వేలాడుతున్న కరెంట్ ఎగ్జిఫీజులను తొలగించాడు. అనంతరం సోమరాజు కరెంటు స్తంభం పైకి ఎక్కి చాకచక్యంగా మహేంద్రను కిందకి దింపి ఇతరుల సహాయముతో పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. అతను చేసిన సాహసాన్ని గుర్తించిన ఏఐబిఎస్పి నాయకులు సోమరాజును అభినందించి శాలువలతో ఘనంగా సన్మానించారు. సోమరాజు ఈ త్యాగంతో పాటు గతంలో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు అందించారని కొనియాడారు. ఒక పేద కుటుంబం నుండి పొట్టకూటి కోసం ప్రమాదం అని తెలిసినా విద్యుత్ శాఖలో పనిచేస్తూ ప్రమాదంలో ఇరుక్కున్న మనిషిని చూసి కాపాడుడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో తన ప్రాణం పోయిన పరవాలేదు బాధితుని కాపాడి వారి కుటుంబానికి పెద్ద దిక్కును అందించిన సోమరాజు సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం.సుబ్రమణ్యం, అమానుల్లా, సాంబశివ, ఆనంద్, బుజ్జి, శివన్న, రాజు, సూర, శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు
- చంద్రబాబు పాపాలన్నీ బద్దలవ్వుతున్నాయి. చంద్రగిరిలోని హెరిటేజ్ కి చెందిన డెయిరీకి మాత్రమే ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చుకుంది నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కేబినెట్ లో ఎందుకు బయటపెట్టలేదు? భాగోతాలకు అలవాటు పడ్డ బీఆర్ నాయుడుని పవిత్రమైన టీటీడీ పదవిలో ఎందుకు కూర్చోబెట్టారు? ఆ పాపాలు బట్టబయలు అయినా ఎందుకు రిజైన్ చేయించడం లేదు? -పేర్ని నాని గారు, మాజీ మంత్రి1
- రాయదుర్గం రూరల్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలించిన, డంపు చేసిన కఠిన చర్యలు తప్పవని రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బొమ్మనహల్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న కొంతమంది పై నేడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.1
- రోజు కూటమి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు అలాగే మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు అయితే నేమి అభివృద్ధి పనులు అయితే నేమి ప్రజలకు తెలియజేయడమే మన బాధ్యత అంటూ అలాగే కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం చేయడమే మా యొక్క లక్ష్యం అంటూ డాక్టర్ పార్థసారథి మదిరే భాస్కర్ రెడ్డి తెలిపారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు అభిమానులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను..1
- పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలో జండా చెట్టు సెంటర్ వద్ద మసీదు నందు మరియు బడే పురం రోడ్డు లోని మసీదు నందు రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ చేసి నమాజులో పాల్గొన్న కూటమి శ్రేణులు ఈ కార్యక్రమంలో దనేకుల హరిబాబు, తాయి కాంతి కిరణ్,కొణతాల ఏసుబాబు, ధనికుల నాగేశ్వరరావు, కగ్గా శ్రీను,మతపెద్దలు పాల్గొన్నారు1
- AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం నేలపాడులోని హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. AP హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ AP హైకోర్టుకు బదిలీపై వచ్చారు.1
- రాజంపేటలో *ఇంత శాడిస్ట్ గానికి ఈ సమాజం లో బతికే అర్హత లేదు* *మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి* *భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అడ్డుకోవాల్సిన భర్తే ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత దారుణం* *కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన శాడిస్ట్ భర్త శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది* *శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్ ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు* *ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది* ఈ శాడిస్ట్ గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే వంకలో, నదులల్లో దూకి చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి1
- నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)1
- రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.1