యువత రాజకీయాల్లోకి రావాలి.. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలి: ఈటీ నర్సింహా దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించగలదని, అందుకే యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ నర్సింహా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల లోగోను హిమాయత్ నగర్ లోని కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య, భద్రత కల్పించే దిశగా కాకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకోవడం సరికాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఉద్యోగ హక్కు, విద్య హక్కు, వైద్య హక్కు, కార్మిక హక్కులు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం వంటి అంశాలపై ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ యాదగిరిగుట్టలో జరిగే రాష్ట్ర మహాసభలు యువతకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తాయని తెలిపారు. మహాసభల్లో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్య, వైద్య రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి.. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలి: ఈటీ నర్సింహా దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించగలదని, అందుకే యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ నర్సింహా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల లోగోను హిమాయత్ నగర్ లోని కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య, భద్రత కల్పించే దిశగా కాకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకోవడం సరికాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఉద్యోగ హక్కు, విద్య హక్కు, వైద్య హక్కు, కార్మిక హక్కులు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం వంటి అంశాలపై ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ యాదగిరిగుట్టలో జరిగే రాష్ట్ర మహాసభలు యువతకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తాయని తెలిపారు. మహాసభల్లో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్య, వైద్య రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్లను నమ్ముకుని లోన్లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ3
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దమ్మాయిగూడ రోడ్లపై శాశ్వత పరిష్కారం కోరుతూ డిమాండ్ నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై గుంతలు, నీటి నిల్వలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురికావడంతో అధికారులు వెంటనే స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్సుఖ్నగర్లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.4