Shuru
Apke Nagar Ki App…
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. జి.మాడుగుల మండలంలోని వంజరి పంచాయతీ ములకాయపుట్టు వద్ద గల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హైవే పనులు నిమిత్తం వచ్చిన ట్రాలీ లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Nava surya
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. జి.మాడుగుల మండలంలోని వంజరి పంచాయతీ ములకాయపుట్టు వద్ద గల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హైవే పనులు నిమిత్తం వచ్చిన ట్రాలీ లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధి పందిరిమామిడిలో జరిగిన అగ్నిప్రమాదంలో తామరపెళ్లి అప్పారావుకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తులం బంగారం అవసరం నిమిత్తం ఇంట్లో దాచుకున్న రూ.50 వేలు, 50 కేజీల బియ్యంతో పాటు ఇంట్లో సామాగ్రి కాలిపోయాయన్ని బాధితులు వాపోయారు.1
- అల్లూరి పాడేరు జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయతీ కేంద్రంలో సోమవారం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. సర్పంచి కాసులమ్మ, వైస్ ఎంపీపీ రాజు బాబు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, ఆధునిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- ఎస్సీల భూములను కాపాడాలి గరుగుబిల్లి ఫిబ్రవరి 16 : పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో అలాగే 40 ఎస్సీ మాదిగ కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇందులో ఐదు కుటుంబాలు అనగా ఒకటి బండపల్లి ఆనందరావు తండ్రి లేటు గంగయ్య, అలజంగి ఏసోబు తండ్రి సీతయ్య లేటు, అలజంగి పైడమ్మ భర్త వీరయ్య లేటు, చింతాడు జార్జి తండ్రి అక్కులు లేటు, పూతి బుజ్జి తండ్రి నారాయణరావు లేటు పై గల ఐదు కుటుంబాలు పూర్వం అనగా 60, 70 సంవత్సరాలు నుండి వీళ్ళ తాత తండ్రులు ఈ భూమిని సాగు చేసి పంట పండిస్తున్నారన్నారని సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం తెలిపారు. ఈ భూమి సర్వే నెంబరు 78/1 ,82/1 మరియు 91లో పంటలు పండిస్తూ దీనిపై జీవనాధారంగా సాగిస్తున్నారని, వీళ్లకు ఈ సాగు చేసిన భూములు తప్ప వీరి జీవనాధారానికి ఎలాంటి భూములు లేవని తెలిపారు. వీళ్ళు పంట సాగు చేస్తున్నప్పుడు కొత్తపల్లి గ్రామ రైతు బడే మృత్యుంజయ అనే వ్యక్తి వీళ్ళని అడ్డుకొని ఈ భూమి మీది కాదు సాగు చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళ సాగును అడ్డగించి ఈ భూమి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉందని ప్రభావిత బోర్డు పెట్టించారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి సాగులో ఉన్నటువంటి బోర్డును తీయించి ఆ ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేసి ఆదుకుంటారని కోరుతున్నామని అలా జరగని ఎడల వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా రామారావు, బండపల్లి సంఘయ్య, అలజంగి సోమయ్య, దేవాతి పుష్పరావు, అలజంగి రాజేష్,అలజంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం చిన్న హరిచంద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన శివ పంచదామ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వర లింగాలను భక్తు స్వయంభుగా ప్రతిష్టించి భక్తులచేతే పూజించే భాగ్యాన్ని ఇక్కడ నిర్వాహకులు కల్పించారు. ఈ క్షతుల్లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం విశేష పూజలు ప్రత్యేకమైన ఆకర్షణగా భక్తులకు ఎంతగానో మనస్సును భక్తిపారవంలో ముంచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొన్నారు క్షేత్రాన్ని దర్శించుకున్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- డుంబ్రిగుడ మండలంలోని టుడుంగుడ, బడిమెల, పరిడి, లైగండ, గుంటసీమ, గుంటగన్నేల, అర్మ తదితర గ్రామాల్లో వేసవి వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతు కూలీలు నాట్లు వేయడంలో బిజీగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన వర్షాలతో పొలాల్లో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయంటున్నారు. సుమారు 100 ఎకరాల్లో వేసవి వరి నాట్లను వేస్తున్నట్లు ఆయా గ్రామాల గిరి రైతులు తెలిపారు.1