బి గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలను మంగళవారం కళాశాల యాజమాన్యం, ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ అన్ని విభాగాలతో పాటు డిప్లొమా, ఎంబీఏ విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబరు 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో విశ్వేశ్వరయ్య అందించిన సేవలు దేశ, విదేశాల్లో భారతీయుల ప్రతిభను చాటిచెప్పాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ.. సర్ ఎం. విశ్వేశ్వరయ్య జీవిత ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన నిస్వార్థ సేవలు ఆదర్శనీయమన్నారు. ఆనకట్టలు, వంతెనలు, సాగునీటి, తాగునీటి పథకాల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు రూపొందించిన వ్యవస్థ, విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి కాపాడే చర్యల్లో ఆయన సేవలను గుర్తుచేశారు. కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణంతో పాటు భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం, మైసూరు చందనపు నూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపనలో ఆయన పాత్రను వివరించారు. 1955లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మసంతృప్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్ మాట్లాడుతూ.. ఇంజనీర్స్ డే కేవలం ఇంజనీర్లను గౌరవించే రోజు మాత్రమే కాదని, జ్ఞానం, ఆవిష్కరణలు, కష్టపడి పనిచేసే నిబద్ధత సమాజాన్ని మార్చగలవనే విషయాన్ని గుర్తుచేసే రోజని అన్నారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణ, దేశసేవ వంటి విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను ప్రోత్సహించి మెరుగైన భవిష్యత్తు కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యుడు, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ బండి అన్విద వర్చువల్గా పాల్గొని ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, డిప్లొమా డీన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
బి గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలను మంగళవారం కళాశాల యాజమాన్యం, ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ అన్ని విభాగాలతో పాటు డిప్లొమా, ఎంబీఏ విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబరు 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో విశ్వేశ్వరయ్య అందించిన సేవలు దేశ, విదేశాల్లో భారతీయుల ప్రతిభను చాటిచెప్పాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ.. సర్ ఎం. విశ్వేశ్వరయ్య జీవిత ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన నిస్వార్థ సేవలు ఆదర్శనీయమన్నారు. ఆనకట్టలు, వంతెనలు, సాగునీటి, తాగునీటి పథకాల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు రూపొందించిన వ్యవస్థ, విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి కాపాడే చర్యల్లో ఆయన సేవలను గుర్తుచేశారు. కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణంతో పాటు భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం, మైసూరు చందనపు నూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపనలో ఆయన పాత్రను వివరించారు. 1955లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మసంతృప్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్ మాట్లాడుతూ.. ఇంజనీర్స్ డే కేవలం ఇంజనీర్లను గౌరవించే రోజు మాత్రమే కాదని, జ్ఞానం, ఆవిష్కరణలు, కష్టపడి పనిచేసే నిబద్ధత సమాజాన్ని మార్చగలవనే విషయాన్ని గుర్తుచేసే రోజని అన్నారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణ, దేశసేవ వంటి విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను ప్రోత్సహించి మెరుగైన భవిష్యత్తు కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యుడు, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ బండి అన్విద వర్చువల్గా పాల్గొని ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, డిప్లొమా డీన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.1
- భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు1
- దేవదేవునికి సతీసమేతంగా 15 సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం పొందటం నువ్వు చేసుకున్న పుణ్యం🙏🙏అలాంటి నీకు ప్రాణమిచ్చే సైనికులుగా మమ్మల్ని పుట్టించిన ఆ శ్రీవారికి ఏమి చేయగలం,ఇవ్వగలం,భక్తితో సాష్టాంగ ప్రణామం చేయటం తప్ప🙏🙏....1
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1
- ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు *ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. *స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు. *కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది. *ప్రత్యేక ప్రేరణ:* ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1
- హైదరాబాద్లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు1