logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అఖిలభారత రైతు మహాసభలు జయప్రదం చేయండి : జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నవంబర్ లో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగు అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. రైతాంగానికి మద్దతు ధర చట్టం చేయకుండా విద్యుత్ సంస్కరణల బిల్లు తెచ్చి మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని ,అంబానీలకు అప్పచెప్పుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రైతు చేతిలో భూమి లేకుండా కార్పోరేట్ వ్యవసాయాన్ని తెచ్చి రైతులు కూలిగా మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతాంగం వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఉపాధి హామీ రక్షణ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమం అన్ని మండల పట్టణ కేంద్రాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడికి భూమి దక్కాలని సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాట లో ప్రముఖ పాత్ర పోషించిన నల్లగొండ గడ్డ పై ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహాసభల నిర్వహణ, సెమినార్లు వేలాదిమందితో కవాతు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించి రైతు ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి వరకు బస్తీ దవాఖానలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా హాస్పిటల్స్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యా ,వైద్య విధానంపై సర్వే నిర్వహించి అందులో జరుగుతున్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించి సమస్యలపై అధ్యయనం చేసి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని అన్నారు ఎస్ ఐ ఆర్ పై బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులు ఓట్లు పోకుండా చూడాలని అన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ,జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, కొండ అనురాధ ,నల్లగొండ తిప్పర్తి మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి పట్టణ,మండల తుమ్మల పద్మ ,అవుట రవీందర్ , దండెంపల్లి సరోజ, బ్రహ్మానంద రెడ్డి, దొంగరి వెంకన్న, భీమగాని గణేష్ ,సుల్తానా, గుండాల నరేష్, గండమల్ల రాములు, కొండ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Praneeth
Praneeth
Nalgonda, Telangana•
2 hrs ago
94956bd4-2c0b-47d9-9f9e-c22bbd3f71c9

అఖిలభారత రైతు మహాసభలు జయప్రదం చేయండి : జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నవంబర్ లో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగు అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. రైతాంగానికి మద్దతు ధర చట్టం చేయకుండా విద్యుత్ సంస్కరణల బిల్లు తెచ్చి మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని ,అంబానీలకు అప్పచెప్పుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రైతు చేతిలో భూమి లేకుండా కార్పోరేట్ వ్యవసాయాన్ని తెచ్చి రైతులు కూలిగా మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతాంగం వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఉపాధి హామీ రక్షణ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమం అన్ని మండల పట్టణ కేంద్రాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడికి భూమి దక్కాలని సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాట లో ప్రముఖ పాత్ర పోషించిన నల్లగొండ గడ్డ పై ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగడం ఎంతో

5a9c36f0-5c06-4e77-a418-6352e4859326

స్ఫూర్తిదాయకమని అన్నారు. మహాసభల నిర్వహణ, సెమినార్లు వేలాదిమందితో కవాతు, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించి రైతు ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి వరకు బస్తీ దవాఖానలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా హాస్పిటల్స్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యా ,వైద్య విధానంపై సర్వే నిర్వహించి అందులో జరుగుతున్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించి సమస్యలపై అధ్యయనం చేసి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని అన్నారు ఎస్ ఐ ఆర్ పై బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులు ఓట్లు పోకుండా చూడాలని అన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ,జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, కొండ అనురాధ ,నల్లగొండ తిప్పర్తి మండల కార్యదర్శి నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి పట్టణ,మండల తుమ్మల పద్మ ,అవుట రవీందర్ , దండెంపల్లి సరోజ, బ్రహ్మానంద రెడ్డి, దొంగరి వెంకన్న, భీమగాని గణేష్ ,సుల్తానా, గుండాల నరేష్, గండమల్ల రాములు, కొండ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను
    1
    నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను
    user_M Swamy
    M Swamy
    చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం
    1
    మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    22 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన
బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    1
    జనసంద్రంగా మారిన నల్లబెల్లి

పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు
 దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది
 కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు
జనసంద్రంగా మారిన నల్లబెల్లి
పెద్ది సుదర్శన్‌ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు
దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది
కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
    user_Yakesh Goud Sudagani
    Yakesh Goud Sudagani
    పెద్దవంగర, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    2
    తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత 
హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.
    user_P Jithender, Sr Reportar
    P Jithender, Sr Reportar
    Local News Reporter జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
    1
    ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి 
ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం
-కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    54 min ago
  • డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
    1
    డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగాదేవి గుడి దగ్గర నైట్ నైట్ మట్టి అమ్ముతున్నారు చెరువు మట్టి అమ్ముతున్నారు అమ్మే దొంగలు ఎవరు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాను
    1
    నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగాదేవి గుడి దగ్గర నైట్ నైట్ మట్టి అమ్ముతున్నారు చెరువు మట్టి అమ్ముతున్నారు అమ్మే దొంగలు ఎవరు అధికారులు తీసుకోవాలని కోరుతున్నాను
    user_M Swamy
    M Swamy
    చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.