రంగాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవం. పలమనేరు ఆగస్టు 1( ప్రజా ప్రతిభ) పలమనేరు టౌన్ రంగాపురం అంగన్వాడి కేంద్రం నందు వర్కర్ చిలకమ్మ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవం నిర్వహించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తల్లిపాలు వారోత్సవాలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా ముఖ్యఅతిథిగా హాజరై అక్కడ వచ్చిన గర్భవతులు బాలింతలతో మాట్లాడుతూ గర్భవతులు ప్రసవించిన గంట వ్యవధిలో బిడ్డకు మురుపాలు తాగించాలని సూచించారు. తల్లి పాలు వలన బిడ్డ ఆరోగ్యంతో పాటు చాలా లాభాలు ఉన్నాయని దానివలన బిడ్డకు సరైన పోషకాహారం అందుతుందని, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని, సులువుగా జీర్ణశక్తి కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా బిడ్డకు అలర్జీ ప్రమాదాలు తగ్గుతాయని, త్వరగా బ్రెయిన్ అభివృద్ధి చెందుతుందని వివరించారు. తల్లిపాలు వలన తల్లికి ప్రసవం నుండి త్వరగా రికవరీ అవుతుందని, త్వరగా బరువు తగ్గడానికి దోహదపడుతుందని, తల్లి బిడ్డల మధ్య దృఢత్వం అవుతుందని, తల్లుల్లో క్యాన్సర్ డయాబెటిన్ ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి అన్నారు. ప్రస్తుతం తల్లిపాలు వలన తల్లికి బిడ్డకి కలిగే ప్రయోజనాలను ఇప్పటివరకు తెలుసుకున్నాం అని వాటిని పాటించాలని పిలుపునిచ్చారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాలకు గర్భవతులు బాలింతల కోసం పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారని వివరించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పౌష్టికాహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకొని దుర్వినియోగం చేయకుండా వినియోగం చేసుకొని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అదేవిధంగా డబ్బా పాలతో పోలిస్తే తల్లిపాలు ఆధా అవుతుందన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలని 7వ నెల నుండి రెండు సంవత్సరాల వరకు అనుబంధ ఆహారంతో పాటు తల్లి పాలు ఇవ్వాలన్నారు. 1000 రోజులు సంరక్షణ గురించి అక్కడికి వచ్చిన గర్భవతులు బాధితులకు క్లుప్తంగా వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనిలా, అంగన్వాడి హెల్పర్ పరిమళ, ఆశా వర్కర్ లతా, గర్భవతులు , బాలింతలు పాల్గొన్నారు.
రంగాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవం. పలమనేరు ఆగస్టు 1( ప్రజా ప్రతిభ) పలమనేరు టౌన్ రంగాపురం అంగన్వాడి కేంద్రం నందు వర్కర్ చిలకమ్మ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాలు వారోత్సవం నిర్వహించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తల్లిపాలు వారోత్సవాలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా ముఖ్యఅతిథిగా హాజరై అక్కడ వచ్చిన గర్భవతులు బాలింతలతో మాట్లాడుతూ గర్భవతులు ప్రసవించిన గంట వ్యవధిలో బిడ్డకు మురుపాలు తాగించాలని సూచించారు. తల్లి పాలు వలన బిడ్డ ఆరోగ్యంతో పాటు చాలా లాభాలు ఉన్నాయని దానివలన బిడ్డకు సరైన పోషకాహారం అందుతుందని, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని, సులువుగా జీర్ణశక్తి కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా బిడ్డకు అలర్జీ ప్రమాదాలు తగ్గుతాయని, త్వరగా బ్రెయిన్ అభివృద్ధి చెందుతుందని వివరించారు. తల్లిపాలు వలన తల్లికి ప్రసవం నుండి త్వరగా రికవరీ అవుతుందని, త్వరగా బరువు తగ్గడానికి దోహదపడుతుందని, తల్లి బిడ్డల మధ్య దృఢత్వం అవుతుందని, తల్లుల్లో క్యాన్సర్ డయాబెటిన్ ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి అన్నారు. ప్రస్తుతం తల్లిపాలు వలన తల్లికి బిడ్డకి కలిగే ప్రయోజనాలను ఇప్పటివరకు తెలుసుకున్నాం అని వాటిని పాటించాలని పిలుపునిచ్చారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాలకు గర్భవతులు బాలింతల కోసం పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారని వివరించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పౌష్టికాహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకొని దుర్వినియోగం చేయకుండా వినియోగం చేసుకొని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అదేవిధంగా డబ్బా పాలతో పోలిస్తే తల్లిపాలు ఆధా అవుతుందన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలని 7వ నెల నుండి రెండు సంవత్సరాల వరకు అనుబంధ ఆహారంతో పాటు తల్లి పాలు ఇవ్వాలన్నారు. 1000 రోజులు సంరక్షణ గురించి అక్కడికి వచ్చిన గర్భవతులు బాధితులకు క్లుప్తంగా వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనిలా, అంగన్వాడి హెల్పర్ పరిమళ, ఆశా వర్కర్ లతా, గర్భవతులు , బాలింతలు పాల్గొన్నారు.
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1