గోమాత సేవలో ముందున్న జ్యోతుల నెహ్రూ – గోశాలకు భారీగా పశుగ్రాసం అందజేసి అనంతరం శ్రీవారి దర్శనం తిరుమల గోశాలకు 180 లారీల ఉట్టి గడ్డి అందజేసిన టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ గోసేవే మహాసేవ అంటూ తిరుమల గోశాలలో సేవా కార్యక్రమం – అనంతరం శ్రీవారిని దర్శించుకున్న జ్యోతుల నెహ్రూ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోశాలకు టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉట్టి గడ్డి సరఫరా చేయడం విశేషంగా నిలిచింది. ఈరోజు మొత్తం 180 లారీల ఉట్టి గడ్డిని తిరుమల గోశాలకు తీసుకెళ్లి అధికారులకు అప్పగించారు. గోమాతల సంరక్షణకు తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. గోశాలలో ఉన్న ఆవులకు అవసరమైన పశుగ్రాసం కొరత లేకుండా చూడడం ప్రతి భక్తుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు, గోశాల సిబ్బంది జ్యోతుల నెహ్రూ సేవలను అభినందించారు. గోసేవకు అంకితభావంతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్న అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గోమాత సేవలో ముందున్న జ్యోతుల నెహ్రూ – గోశాలకు భారీగా పశుగ్రాసం అందజేసి అనంతరం శ్రీవారి దర్శనం తిరుమల గోశాలకు 180 లారీల ఉట్టి గడ్డి అందజేసిన టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ గోసేవే మహాసేవ అంటూ తిరుమల గోశాలలో సేవా కార్యక్రమం – అనంతరం శ్రీవారిని దర్శించుకున్న జ్యోతుల నెహ్రూ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోశాలకు టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉట్టి గడ్డి సరఫరా చేయడం విశేషంగా నిలిచింది. ఈరోజు మొత్తం 180 లారీల ఉట్టి గడ్డిని తిరుమల గోశాలకు తీసుకెళ్లి అధికారులకు అప్పగించారు. గోమాతల సంరక్షణకు తమ వంతు
సహకారం అందించడం ఆనందంగా ఉందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. గోశాలలో ఉన్న ఆవులకు అవసరమైన పశుగ్రాసం కొరత లేకుండా చూడడం ప్రతి భక్తుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు, గోశాల సిబ్బంది జ్యోతుల నెహ్రూ సేవలను అభినందించారు. గోసేవకు అంకితభావంతో ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్న అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ బస్ స్టేషన్లో బస్సు ఢీకొని 51 ఏళ్ల భావన ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో బస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది.4
- కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఒక నిరుపేద కుటుంబం పక్షవాతంతో అల్లాడుతోంది. జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోవడంతో వారు దీనస్థితిలో ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.1
- మండపేట ఏడిద బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ బైక్ను ఢీకొనడంతో దార్ల ప్రసాద్, శివకుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ వారి శరీరాలపై నుంచి వెళ్లడంతో తలలు నుజ్జయ్యాయి, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.4
- రంపచోడవరం రేలా ఉత్సవాలకు అడివి వెంకన్నగూడెం గ్రామస్తుల సన్నద్ధత రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వి.ఆర్.పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ రేలా నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన గ్రామస్తులు, ఆదివారం గ్రామంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. అనంతరం 24న నిర్వహించే 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భారీగా నినాదాలు చేశారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.1
- అమలాపురం ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబం మూడు పూటలా అన్నం కోసం తీవ్ర ఆవేదన చెందుతోంది. కనీస ఆహారం కూడా లభించక, వారు ఆకలితో అలమటిస్తున్నారు, సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.1
- అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1
- ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం1
- 😭🙏1