*వెలగలేరుకు చేరిన పట్టిసీమ జలాలు* _మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచనల మేరకు ఘనంగా జలహారతి_ *జి.కొండూరు, జులై 11,(గళమ్ న్యూస్)* కృష్ణా డెల్టాకు జీవనాడిగా నిలిచిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామానికి చేరాయి.ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచనల జలహారతి కార్యక్రమాన్ని వెలగలేరులో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య,పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.శ్రీనివాస్,తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి హారతి ఇచ్చి సారె సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కృష్ణా డెల్టాకు అండగా నిలుస్తూ రైతాంగానికి భరోసా కల్పిస్తోందన్నారు. గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం ద్వారా సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని తెలిపారు.దీంతో సాగునీటి అవసరాలు తీరడంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.పట్టిసీమ ద్వారా చేరిన గోదావరి జలాలకు కృతజ్ఞతగా వెలగలేరులో నిర్వహించిన జలహారతి కార్యక్రమం విజయవంతంగా సాగింది.నీరు చేరడంతో డెల్టా ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పట్టిసీమ పథకం మరోసారి వ్యవసాయానికి ఊపిరి పోసిందని ఆనందం వ్యక్తం చేశారు.మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగ అన్నాడని విమర్శించారు.సీఎం చంద్రబాబు అప్పట్లో పట్టిసీమను సమర్ధవంతంగా పూర్తిచేయబట్టే నేడు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకున్నా రైతులకు న్సకాలంలో సాగునీరు లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని,టీడీపీ మండల అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు,మండల కార్యదర్శి లంకా నాగేశ్వరరావు,వెలగలేరు సొసైటీ అధ్యక్షుడు మంచినేని రాజశేఖర్,కూటమి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
*వెలగలేరుకు చేరిన పట్టిసీమ జలాలు* _మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచనల మేరకు ఘనంగా జలహారతి_ *జి.కొండూరు, జులై 11,(గళమ్ న్యూస్)* కృష్ణా డెల్టాకు జీవనాడిగా నిలిచిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం జి.కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామానికి చేరాయి.ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచనల జలహారతి కార్యక్రమాన్ని వెలగలేరులో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య,పోలవరం కుడి ప్రధాన కాలువ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.శ్రీనివాస్,తదితరులు గోదావరి జలాలకు పూలు చల్లి హారతి ఇచ్చి సారె సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,పట్టిసీమ ఎత్తిపోతల పథకం కరువు కాలంలో కృష్ణా డెల్టాకు అండగా నిలుస్తూ రైతాంగానికి భరోసా కల్పిస్తోందన్నారు. గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడం ద్వారా సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని తెలిపారు.దీంతో సాగునీటి అవసరాలు తీరడంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.పట్టిసీమ ద్వారా చేరిన గోదావరి జలాలకు కృతజ్ఞతగా వెలగలేరులో నిర్వహించిన జలహారతి కార్యక్రమం విజయవంతంగా సాగింది.నీరు చేరడంతో డెల్టా ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పట్టిసీమ పథకం మరోసారి వ్యవసాయానికి ఊపిరి పోసిందని ఆనందం వ్యక్తం చేశారు.మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగ అన్నాడని విమర్శించారు.సీఎం చంద్రబాబు అప్పట్లో పట్టిసీమను సమర్ధవంతంగా పూర్తిచేయబట్టే నేడు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకున్నా రైతులకు న్సకాలంలో సాగునీరు లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని,టీడీపీ మండల అధ్యక్షుడు వేములకొండ వెంకటేశ్వరరావు,మండల కార్యదర్శి లంకా నాగేశ్వరరావు,వెలగలేరు సొసైటీ అధ్యక్షుడు మంచినేని రాజశేఖర్,కూటమి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
- నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వద్ద నూతనంగా ప్రారంభమైన 'శుభప్రదం షాపింగ్ మాల్' ఓపెనింగ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా విచ్చేసి, మాల్ను ప్రారంభించారు. అనసూయ గారి రాకతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత కళ వచ్చింది. ఆమెను చూడటానికి, ఆమెతో ఫోటోలు దిగడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పల్నాడు ప్రజలకు సరికొత్త షాపింగ్ డెస్టినేషన్గా ఈ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్యాషన్, గృహోపకరణాలు మరియు వివిధ రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరికేలా ఈ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేశారు.1
- గుంటూరు నుండి పలకలూరు వెళ్లే మార్గంలో మసీదు సెంటర్ వద్ద పైప్లైన్ లీకేజీ కారణంగా రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా, గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద కూడా రోడ్డుపై మరొక భారీ గుంత ఏర్పడింది. ఈ గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.4
- భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వేమూరు గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 84 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించిన ఆయన, మిగిలిన ప్రక్రియను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారులు, కలెక్టర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తుండటాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సర్వే విజయవంతానికి ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరిస్తున్నారని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సర్వే చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు లేదా ఓటర్ల వివరాలలో మార్పులు చేసుకోవాల్సిన వారు ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.1
- సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.3
- ఖమ్మంలో సురక్షితమైన మరియు విలువ పెరిగే పెట్టుబడి కోసం చూస్తున్న వారికి శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్ ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రాంత పరిస్థితులతో సంబంధం లేకుండా తెలివైన పెట్టుబడిని ఎంచుకోవాలని సూచించడమైనది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఓపెన్ ప్లాట్లు DTCP మరియు RERA ద్వారా ఆమోదం పొందాయి. మరిన్ని వివరాలు మరియు పెట్టుబడి అవకాశాల కోసం 8008165564 నంబర్ను సంప్రదించవచ్చు.1