logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వనపర్తి జిల్లా ప్రజలకు సంగం డెయిరీ తీపి కబురు అందించింది. వనపర్తిలోని కొత్తకోట రోడ్డు, శ్రీరామ ఎలక్ట్రికల్ షాప్ పక్కన ఉన్న వివేకానంద చౌరస్తాలో శ్రీ గాయత్రి మిల్క్ ఏజెన్సీ నూతనంగా ప్రారంభమైన సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. గత 48 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాణ్యత, స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ పాలు, పాల పదార్థాలను అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛమైన పాలు, దాదాపు 20 రకాల పాల పదార్థాలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రత్యేక ఆఫర్‌ కింద ప్రతి 500 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ కొనుగోలు చేసిన వారికి రూ.10 విలువైన పెరుగు ప్యాకెట్‌ను ఉచితంగా అందించనున్నారు. ఈ అవకాశాన్ని వనపర్తి జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కంపెనీ డి.ఎస్.ఎం అచ్యుతరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో కూడా శ్రీ గాయత్రి మిల్క్ ఏజెన్సీ ద్వారా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం శివశంకర్ ను 96660 65911 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.

3 hrs ago
user_A Rajashekar Pangal
A Rajashekar Pangal
Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
3 hrs ago
2fa7c0f7-f1f3-49a3-b197-5e8d8cd92e1e

వనపర్తి జిల్లా ప్రజలకు సంగం డెయిరీ తీపి కబురు అందించింది. వనపర్తిలోని కొత్తకోట రోడ్డు, శ్రీరామ ఎలక్ట్రికల్ షాప్ పక్కన ఉన్న వివేకానంద చౌరస్తాలో శ్రీ గాయత్రి మిల్క్ ఏజెన్సీ నూతనంగా ప్రారంభమైన సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. గత 48 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాణ్యత, స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ పాలు, పాల పదార్థాలను అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛమైన పాలు, దాదాపు 20 రకాల పాల పదార్థాలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రత్యేక ఆఫర్‌ కింద ప్రతి 500 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్ కొనుగోలు చేసిన వారికి రూ.10 విలువైన పెరుగు ప్యాకెట్‌ను ఉచితంగా అందించనున్నారు. ఈ అవకాశాన్ని వనపర్తి జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కంపెనీ డి.ఎస్.ఎం అచ్యుతరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో కూడా శ్రీ గాయత్రి మిల్క్ ఏజెన్సీ ద్వారా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం శివశంకర్ ను 96660 65911 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.

More news from Telangana and nearby areas
  • కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ మూర్ఖులు చెప్పినట్లు బ్యారేజ్ కొట్టుకుపోయినా.. ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ప్రవహించే నీళ్ళలోనే కలుస్తాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన "మూర్ఖుల్లారా" అని ప్రశ్నిస్తూ సీఎంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు.

ఒకవేళ ఈ మూర్ఖులు చెప్పినట్లు బ్యారేజ్ కొట్టుకుపోయినా.. ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ప్రవహించే నీళ్ళలోనే కలుస్తాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన "మూర్ఖుల్లారా" అని ప్రశ్నిస్తూ సీఎంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    2 hrs ago
  • కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సదరు వైసీపీ నేతకు టీడీపీ నాయకులు ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు.
    1
    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సదరు వైసీపీ నేతకు టీడీపీ నాయకులు ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • కర్నూలు జిల్లాలో యూరియా సరఫరా సజావుగా కొనసాగుతోందని, జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 28,540 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది రైతులకు 17,900 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఎరువుల పంపిణీ ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎరువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 537 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 20 మంది డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు.
    1
    కర్నూలు జిల్లాలో యూరియా సరఫరా సజావుగా కొనసాగుతోందని, జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 28,540 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది రైతులకు 17,900 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఎరువుల పంపిణీ ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎరువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 537 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 20 మంది డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రి చెప్పినట్లే బ్యారేజ్ కొట్టుకుపోయినా కూడా, ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ఆ పోయే నీళ్ళలోనే కలుస్తాయని ఆయన వివరించారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
    1
    కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి, మంత్రి మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నెపల్లి దగ్గర 10 టీఎంసీల నీళ్ళు పోతుంటే అందులో నుండి కేవలం 2 టీఎంసీల నీళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయమని తాము అడుగుతున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి, మంత్రి చెప్పినట్లే బ్యారేజ్ కొట్టుకుపోయినా కూడా, ఆ 2 టీఎంసీల నీళ్ళు కిందికి జారి ఆ పోయే నీళ్ళలోనే కలుస్తాయని ఆయన వివరించారు. దీనికి భద్రాచలం, 44 ఊర్లు ఎలా కొట్టుకుపోతాయంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    57 min ago
  • Post by Assalamualikumjj
    3
    Post by Assalamualikumjj
    user_Assalamualikumjj
    Assalamualikumjj
    ఆసిఫ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం మానిక్‌గూడ, వాంకిడి మండలం కోమటిగూడ గ్రామాల్లో రూ. 20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తాయని, పంచాయతీలు పారదర్శక సేవలకు కేంద్రాలుగా మారాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇదే సమయంలో కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సాగులోకి వెళ్లకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేస్తున్న పాత పోడు భూముల విషయంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. అయితే కొత్తగా అటవీ భూములను ఆక్రమించవద్దని స్పష్టం చేస్తూ, ఈ భూ సమస్యపై జిల్లా, అటవీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి చట్టపరమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తుల కంటే పిల్లల చదువే నిజమైన ఆస్తి అని, వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం తల్లిదండ్రుల బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
    1
    ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం మానిక్‌గూడ, వాంకిడి మండలం కోమటిగూడ గ్రామాల్లో రూ. 20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తాయని, పంచాయతీలు పారదర్శక సేవలకు కేంద్రాలుగా మారాలని అధికారులను ఆదేశించారు.

మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

ఇదే సమయంలో కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సాగులోకి వెళ్లకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేస్తున్న పాత పోడు భూముల విషయంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. అయితే కొత్తగా అటవీ భూములను ఆక్రమించవద్దని స్పష్టం చేస్తూ, ఈ భూ సమస్యపై జిల్లా, అటవీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి చట్టపరమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తుల కంటే పిల్లల చదువే నిజమైన ఆస్తి అని, వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం తల్లిదండ్రుల బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    23 hrs ago
  • 😋😋😋
    1
    😋😋😋
    user_Assalamualikumjj
    Assalamualikumjj
    ఆసిఫ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పాటు రూ. 35,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లాలో పేకాట, జూదం వంటి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
    1
    వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పాటు రూ. 35,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

జిల్లాలో పేకాట, జూదం వంటి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ బృందం నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.