*అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటుచేసిన సూచిక బోర్డులు* *జిల్లా లో 20% ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యం* *40 సైన్ బోర్డులు ఏర్పాటు.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మార్చి 31 :- *అదిలాబాద్ నుండి మహారాష్ట్ర మాండ్వి (కిన్వట్) కి వెళ్లే రహదారి మొత్తంలో సూచిక బోర్డులు ఏర్పాటు.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* జిల్లాలో గణనీయంగా ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నూతన విధానాలతో ప్రజలలోకి వెళ్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ పట్టణం నుండి మహారాష్ట్ర- మాండ్వి (కిన్వట్) కి వెళ్లే రహదారిపై రాంపూర్ రోడ్డు ప్రారంభం నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు 40 సూచిక బోర్డులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తాంసి మండలం పొన్నారి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డు లను ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారులలో ఒకటైన ఈ జాతీయ రహదారి పై సూచిక బోర్డులను ఏర్పాటు చేసి గణనీయంగా ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే కల్వట్ల వద్ద, క్రాసింగ్ వద్ద, బ్రిడ్జిల వద్ద, గ్రామాల వద్ద మరియు ప్రమాదకర మూల మలుపుల వద్ద వాహనదారులకు అర్థమయ్యేలా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల లో మరణాలను 20% తగ్గించడమే లక్ష్యం అని ప్రతి గ్రామం నందు ప్రతి వాహనదారునికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరుస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేయవద్దని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించడం ద్వారా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సమయాలలో అన్ని రహదారులపై పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణి ధర్, ఎస్సై తాంసి ఎస్ జీవన్ రెడ్డి, పున్నారి గ్రామ సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచి రామిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటుచేసిన సూచిక బోర్డులు* *జిల్లా లో 20% ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యం* *40 సైన్ బోర్డులు ఏర్పాటు.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మార్చి 31 :- *అదిలాబాద్ నుండి మహారాష్ట్ర మాండ్వి (కిన్వట్) కి వెళ్లే రహదారి మొత్తంలో సూచిక బోర్డులు ఏర్పాటు.* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* జిల్లాలో గణనీయంగా ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నూతన విధానాలతో ప్రజలలోకి వెళ్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ పట్టణం నుండి మహారాష్ట్ర- మాండ్వి (కిన్వట్) కి వెళ్లే రహదారిపై రాంపూర్ రోడ్డు ప్రారంభం నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు 40 సూచిక బోర్డులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తాంసి మండలం పొన్నారి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డు లను ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారులలో ఒకటైన ఈ జాతీయ రహదారి పై సూచిక బోర్డులను ఏర్పాటు చేసి గణనీయంగా ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే కల్వట్ల వద్ద, క్రాసింగ్ వద్ద, బ్రిడ్జిల వద్ద, గ్రామాల వద్ద మరియు ప్రమాదకర మూల మలుపుల వద్ద వాహనదారులకు అర్థమయ్యేలా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల లో మరణాలను 20% తగ్గించడమే లక్ష్యం అని ప్రతి గ్రామం నందు ప్రతి వాహనదారునికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరుస్తుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లాంటివి చేయవద్దని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించడం ద్వారా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సమయాలలో అన్ని రహదారులపై పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణి ధర్, ఎస్సై తాంసి ఎస్ జీవన్ రెడ్డి, పున్నారి గ్రామ సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచి రామిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది1
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- తెలంగాణ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాదులో బతుకుతెరువు కోసం వెళ్లి, కూకట్పల్లిలో ఇద్దరు పిల్లలను చంపి, స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో మృతురాలి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ, భర్త ఇంటిని, ఫర్నిచర్ను తగలబెట్టారు.1
- Post by Solanke Ravi4
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీపీఎం నేతలు అంతర్జాతీయ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, యుద్ధం వెంటనే ఆపి శాంతి చర్చలు ప్రారంభించాలని కోరారు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.2
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- చండీయాగాన్నికీ భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి హోమం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని పిలుపునిస్తున్న చండీ యాగం నిర్వాహకులు శ్రీ కృష్ణ స్వామి గారు... పాత ఉట్నూర్ 16వ వార్డు సభ్యులు టెకం.రేఖ2