మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా, మహబూబాబాద్ జిల్లా, క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ సంబంధం లేకున్నా డైవర్షన్ కోసం కెసిఆర్ కి లీగల్ నోటీసులు మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా, సెల్ ఫోన్ కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు ఆదుపులో పెట్టుకోవాలి అవినీతి తప్ప, అభివృద్ధి చేతకాదు మీకు ఆంధ్రా లో 5జి ఫోటోలు తెలంగాణలో ఇచ్చినట్లు ఫోటోలలో ప్రచారం చేసుకోవడం దారుణం, 38 వెల ఫోన్లు అంగన్ వాడీలకు ఇచ్చి 6వెల ధర ఉన్న ఫోనుకు 14 వెలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కదా సీతక్క అవినీతి చేయలేదంటే ఫోన్ల కొనుగోలుపై విచారణ చేపించాలి, మహిళ మంత్రిగా ఉండి మాట్లాడే మాటలూ ఇవ్వేనా సీతక్క, బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాల చెప్పులు ఉన్నాయి .మేము మీ కంటే ఎక్కువగా మాట్లాడగలం.
మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా, మహబూబాబాద్ జిల్లా, క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న: మాజీ మంత్రి,శ్రీమతి సత్యవతి రాథోడ్ సంబంధం లేకున్నా డైవర్షన్ కోసం కెసిఆర్ కి లీగల్ నోటీసులు మాజీ సీఎం కెసిఆర్ గారికి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపడం చాల సిగ్గు చేటు అవినీతి చేసిన సీతక్క కెసిఆర్ ,కేటీఆర్ పై ఆనేక ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా, సెల్ ఫోన్ కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు ఆదుపులో పెట్టుకోవాలి అవినీతి తప్ప, అభివృద్ధి చేతకాదు మీకు ఆంధ్రా లో 5జి ఫోటోలు తెలంగాణలో ఇచ్చినట్లు ఫోటోలలో ప్రచారం చేసుకోవడం దారుణం, 38 వెల ఫోన్లు అంగన్ వాడీలకు ఇచ్చి 6వెల ధర ఉన్న ఫోనుకు 14 వెలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కదా సీతక్క అవినీతి చేయలేదంటే ఫోన్ల కొనుగోలుపై విచారణ చేపించాలి, మహిళ మంత్రిగా ఉండి మాట్లాడే మాటలూ ఇవ్వేనా సీతక్క, బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల దగ్గర చాల చెప్పులు ఉన్నాయి .మేము మీ కంటే ఎక్కువగా మాట్లాడగలం.
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం ఘనంగా మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వ భావనలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన అలుపెరుగని కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ రూపకర్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ మహా అన్నదానం ద్వారా అంబేద్కర్ చూపిన సామాజిక సమానత్వ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందని వారు తెలిపారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- Post by Ramprasad islavath1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించి పక్కనే లాటుగా వేసి ఉంచిన సుమారు 58 మిర్చి బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై వెంకటాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.1