logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఒగ్గు అక్షయ, ఒగ్గు అఖిల, నర్మెట్ట మనస్విని అత్యుత్తమ మార్కులు సాధించడంతో వారిని ట్రిపుల్ ఐటీకి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఒగ్గు అక్షయ 569 మార్కులు, ఒగ్గు అఖిల 566 మార్కులు, నర్మెట్ట మనస్విని 559 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఒగ్గు అక్షయ, ఒగ్గు అఖిల కవలలు కావడం విశేషం. చంద్రంపేట గ్రామం నుండి ముగ్గురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంతో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ, వేముల అంజలి, వి. మధుసూధన్, పి. అనిల్ కుమార్, యం. చక్రపాణి, మిరియం, లత, త్రివేణి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

3 hrs ago
user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
Bollam Saireddy జయం న్యూస్ మీడ
Interior designer Manakondur, Karimnagar•
3 hrs ago
710c2b3c-5fce-46f3-8f6b-d1f58a22881d

సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఒగ్గు అక్షయ, ఒగ్గు అఖిల, నర్మెట్ట మనస్విని అత్యుత్తమ మార్కులు సాధించడంతో వారిని ట్రిపుల్ ఐటీకి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఒగ్గు అక్షయ 569 మార్కులు, ఒగ్గు అఖిల 566 మార్కులు, నర్మెట్ట మనస్విని 559 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఒగ్గు అక్షయ, ఒగ్గు అఖిల కవలలు కావడం విశేషం. చంద్రంపేట గ్రామం నుండి ముగ్గురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంతో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ, వేముల అంజలి, వి. మధుసూధన్, పి. అనిల్ కుమార్, యం. చక్రపాణి, మిరియం, లత, త్రివేణి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

More news from Telangana and nearby areas
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద జనసేన నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు నాగేశ్వరరావు చిత్రపటాలను దహనం చేసి తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన నాయకులు నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
    3
    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద జనసేన నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులు నాగేశ్వరరావు చిత్రపటాలను దహనం చేసి తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జనసేన నాయకులు నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో గల ఇల్లంతకుంట మండల కేంద్రంలో వీఓఏల (గ్రామ సంఘ సహాయకులు) సమ్మె నేటి శనివారం, 30/05/2026 నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కేంద్రంలోని వీఓఏలు బతుకమ్మలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వీఓఏల అధ్యక్షురాలు బాలలక్ష్మి, కార్యదర్శి బంగారు అంజలి, కోశాధికారి మహంకాళి ఉమారాణి పాల్గొన్నారు. వారితో పాటు వివిధ గ్రామాల నుండి రాణి, వినోద, దేవేంద్ర, లావణ్య, స్వప్న, రజిత, రాజశ్రీ, అంజలి, వనిత, జ్యోతి, వజ్రవ్వ, సంధ్య, రేణుక, నిర్మల, ఇందిరా, సంధ్య అరుణ, రాజశ్రీ, అనిత తదితర వీఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో గల ఇల్లంతకుంట మండల కేంద్రంలో వీఓఏల (గ్రామ సంఘ సహాయకులు) సమ్మె నేటి శనివారం, 30/05/2026 నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కేంద్రంలోని వీఓఏలు బతుకమ్మలతో వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో వీఓఏల అధ్యక్షురాలు బాలలక్ష్మి, కార్యదర్శి బంగారు అంజలి, కోశాధికారి మహంకాళి ఉమారాణి పాల్గొన్నారు. వారితో పాటు వివిధ గ్రామాల నుండి రాణి, వినోద, దేవేంద్ర, లావణ్య, స్వప్న, రజిత, రాజశ్రీ, అంజలి, వనిత, జ్యోతి, వజ్రవ్వ, సంధ్య, రేణుక, నిర్మల, ఇందిరా, సంధ్య అరుణ, రాజశ్రీ, అనిత తదితర వీఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    23 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ల మధ్య, శివశక్తుల పూనకాలతో, బైండ్ల పూజారులతో కలిసి పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వరాల మల్లేశం మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ వేడుకలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ లో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (TS PECET-2026) శారీరక, నైపుణ్య పరీక్షలు శాతవాహన యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ నాలుగు రోజుల పరీక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్ణారెడ్డి ప్రారంభించారు. తొలిరోజు 993 మంది పురుష అభ్యర్థులకు స్కిల్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున శాతవాహన విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్ మరియు శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ శారీరక పరీక్షలు జూన్ 3 వరకు కొనసాగుతాయని, అనంతరం జూన్ 6న ఫలితాలను వెల్లడించనున్నారని అధికారులు తెలిపారు. కన్వీనర్ రాజేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ శారీరక పరీక్షలకు మొత్తం 500 మార్కులు కేటాయించారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 400 మార్కులకు ఉంటుందని, ఇందులో అందరికీ తప్పనిసరి అయిన 4 అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉంటాయని, ప్రతీ ఈవెంట్ కు 100 మార్కులు ఉంటాయని తెలిపారు. స్కిల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కు 100 మార్కులు కేటాయించారు, ఇందులో అభ్యర్థులు ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ర్యాంకు సాధించడానికి, అభ్యర్థులు మొత్తం మార్కుల్లో కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
    2
    కరీంనగర్ లో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (TS PECET-2026) శారీరక, నైపుణ్య పరీక్షలు శాతవాహన యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ నాలుగు రోజుల పరీక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్ణారెడ్డి ప్రారంభించారు. తొలిరోజు 993 మంది పురుష అభ్యర్థులకు స్కిల్ పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున శాతవాహన విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్ మరియు శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ శారీరక పరీక్షలు జూన్ 3 వరకు కొనసాగుతాయని, అనంతరం జూన్ 6న ఫలితాలను వెల్లడించనున్నారని అధికారులు తెలిపారు.

కన్వీనర్ రాజేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ శారీరక పరీక్షలకు మొత్తం 500 మార్కులు కేటాయించారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 400 మార్కులకు ఉంటుందని, ఇందులో అందరికీ తప్పనిసరి అయిన 4 అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉంటాయని, ప్రతీ ఈవెంట్ కు 100 మార్కులు ఉంటాయని తెలిపారు. స్కిల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కు 100 మార్కులు కేటాయించారు, ఇందులో అభ్యర్థులు ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ర్యాంకు సాధించడానికి, అభ్యర్థులు మొత్తం మార్కుల్లో కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాష్ట్రంలో భారీ ఇసుక తుఫాను (బవండర్) తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురూ, బికనేర్, శ్రీగంగానగర్ జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశమంతటా దాదాపు కిలోమీటరు ఎత్తున దట్టమైన నలుపు, పసుపు రంగు ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో, పగటిపూటే దట్టమైన చీకటి అలుముకుంది. సుమారు అరగంట పాటు వీధులన్నింటినీ చుట్టుముట్టేసిన ఈ తుఫాను జీరో విజిబిలిటీకి దారితీయగా, రహదారులపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు కొట్టుకుపోగా, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండలు, హీట్‌వేవ్‌లతో అల్లాడుతున్న ప్రజలకు ఈ తుఫాను భయాందోళనలు కలిగించినప్పటికీ, దీని అనంతరం కురిసిన వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ధోల్‌పూర్ పరిధిలోని బారిలో గరిష్టంగా 58 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. పశ్చిమ విక్షోభం (Western Disturbance) ప్రభావం వల్ల రాబోయే మరికొద్ది రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని జైపూర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.
    1
    శనివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాష్ట్రంలో భారీ ఇసుక తుఫాను (బవండర్) తీవ్ర బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చురూ, బికనేర్, శ్రీగంగానగర్ జిల్లాలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశమంతటా దాదాపు కిలోమీటరు ఎత్తున దట్టమైన నలుపు, పసుపు రంగు ఇసుక మేఘాలు కమ్ముకోవడంతో, పగటిపూటే దట్టమైన చీకటి అలుముకుంది. సుమారు అరగంట పాటు వీధులన్నింటినీ చుట్టుముట్టేసిన ఈ తుఫాను జీరో విజిబిలిటీకి దారితీయగా, రహదారులపై వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.

గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు కొట్టుకుపోగా, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన ఎండలు, హీట్‌వేవ్‌లతో అల్లాడుతున్న ప్రజలకు ఈ తుఫాను భయాందోళనలు కలిగించినప్పటికీ, దీని అనంతరం కురిసిన వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయి. ధోల్‌పూర్ పరిధిలోని బారిలో గరిష్టంగా 58 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

పశ్చిమ విక్షోభం (Western Disturbance) ప్రభావం వల్ల రాబోయే మరికొద్ది రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని జైపూర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, కోట, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ డివిజన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో వివోఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నాయకులు సంఘీభావం తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో వివోఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నాయకులు సంఘీభావం తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్‌లోని రామకృష్ణ కాలనీలోని అంగారక టౌన్‌షిప్‌ను మోడల్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేయడానికి సుడా ఆధ్వర్యంలో ₹30 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సుడా చైర్మన్ ప్రకటించారు. గతంలో 830 మంది ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ, పూర్వ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వన్‌టౌన్ సమీపంలో ₹5 కోట్లతో సుందర కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతోందని చైర్మన్ వెల్లడించారు. 2006-07లో ప్రారంభమైన ఈ నిర్మాణం మధ్యలో ఆగిపోవడానికి కారణం తెలియదని, అయితే ఇప్పుడు సుడా నిధులతో దానిని పార్కింగ్ సౌకర్యాలతో కూడిన ఉపయోగకరమైన కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో ₹1.27 కోట్లతో ఫుడ్ కోర్టు నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులను తిరిగి ప్రారంభించి, రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహంతో ఆ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరమైన చోట్ల రోడ్లు, డ్రెయిన్లు, హైమాస్ట్ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని సుడా చైర్మన్ తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, అధికారుల సహకారంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నామని, నగర సుందరీకరణను వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జూన్ 1 నుంచి 15 వరకు సుడా పక్షోత్సవాలు నిర్వహించి, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. రేకుర్తి గార్డెన్ వద్ద వర్టికల్ నాలా పనులు ప్రారంభించనున్నట్లు, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బద్దిపెల్లిలో కూడా మోడల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను విడుదల చేసి, పండుగ వాతావరణంలో పక్షోత్సవాలను నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు. సుడా కాంప్లెక్స్ పూర్తయితే సంస్థకు ఆదాయం పెరిగి మరిన్ని నిధులు సమకూరుతాయని, భవిష్యత్తులో ఇంకా నిధులు తెచ్చి సుడా ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
    4
    కరీంనగర్‌లోని రామకృష్ణ కాలనీలోని అంగారక టౌన్‌షిప్‌ను మోడల్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేయడానికి సుడా ఆధ్వర్యంలో ₹30 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సుడా చైర్మన్ ప్రకటించారు. గతంలో 830 మంది ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ, పూర్వ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

వన్‌టౌన్ సమీపంలో ₹5 కోట్లతో సుందర కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతోందని చైర్మన్ వెల్లడించారు. 2006-07లో ప్రారంభమైన ఈ నిర్మాణం మధ్యలో ఆగిపోవడానికి కారణం తెలియదని, అయితే ఇప్పుడు సుడా నిధులతో దానిని పార్కింగ్ సౌకర్యాలతో కూడిన ఉపయోగకరమైన కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో ₹1.27 కోట్లతో ఫుడ్ కోర్టు నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులను తిరిగి ప్రారంభించి, రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహంతో ఆ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు.

నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరమైన చోట్ల రోడ్లు, డ్రెయిన్లు, హైమాస్ట్ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని సుడా చైర్మన్ తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, అధికారుల సహకారంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నామని, నగర సుందరీకరణను వేగవంతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జూన్ 1 నుంచి 15 వరకు సుడా పక్షోత్సవాలు నిర్వహించి, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. రేకుర్తి గార్డెన్ వద్ద వర్టికల్ నాలా పనులు ప్రారంభించనున్నట్లు, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బద్దిపెల్లిలో కూడా మోడల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను విడుదల చేసి, పండుగ వాతావరణంలో పక్షోత్సవాలను నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు. సుడా కాంప్లెక్స్ పూర్తయితే సంస్థకు ఆదాయం పెరిగి మరిన్ని నిధులు సమకూరుతాయని, భవిష్యత్తులో ఇంకా నిధులు తెచ్చి సుడా ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • శుక్రవారం అర్ధరాత్రి భువనేశ్వర్‌లోని హైవేపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. సైడ్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్, ఒక కారును ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. పలాసునీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ భయానక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో, ప్రాణాపాయం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    శుక్రవారం అర్ధరాత్రి భువనేశ్వర్‌లోని హైవేపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. సైడ్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్, ఒక కారును ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. పలాసునీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ భయానక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో, ప్రాణాపాయం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.