logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆదిలాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 12 నాటికే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదని ఎస్ఎఫ్ఐ నేతలు విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులైనా విద్యార్థులకు ఇంకా పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందలేదని, కొన్ని పాఠ్యపుస్తకాల టైటిల్స్ కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అనేక సమస్యలు వేధిస్తున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీల నిధులు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కష్టంగా మారిందని మండిపడ్డారు. అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థల ద్వారా సరఫరా అవుతున్న భోజనం నాణ్యతపై పలు ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయని ఎస్ఎఫ్ఐ ధ్వజమెత్తింది. పాఠశాలల పరిసరాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్టులు, టైలు, షూలు, సాక్సులు వంటి వస్తువులను అధిక ధరలకు విద్యార్థులతో బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలకు ఆకర్షణీయమైన పేర్లు తగిలించి నర్సరీ స్థాయి నుంచే లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేట్ ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలుగా కుదించే ప్రతిపాదనను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి, ఉన్నవాటిని బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ఎస్ఎఫ్ఐ తన ప్రధాన డిమాండ్లను తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెంటనే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ పూర్తి చేయాలని కోరింది. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ నిధులు పెంచి, నాణ్యమైన భోజనం అందించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు వెంటనే నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పాఠశాలల యాజమాన్యాలు సాగిస్తున్న పుస్తకాలు, యూనిఫాంల బలవంతపు విక్రయాలను నిలిపివేయాలని, ప్రభుత్వ పాఠశాలల కుదింపు, మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సందల్ వార్, ఇషాంత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Adilabad Urban, Telangana•
1 hr ago
8541273d-b910-4d6b-b2e9-25dbf4a31bcd

రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆదిలాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 12 నాటికే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదని ఎస్ఎఫ్ఐ నేతలు విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులైనా విద్యార్థులకు ఇంకా పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందలేదని, కొన్ని పాఠ్యపుస్తకాల టైటిల్స్ కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అనేక సమస్యలు వేధిస్తున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీల నిధులు పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కష్టంగా మారిందని మండిపడ్డారు. అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థల ద్వారా సరఫరా అవుతున్న భోజనం నాణ్యతపై పలు ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయని ఎస్ఎఫ్ఐ ధ్వజమెత్తింది. పాఠశాలల పరిసరాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, బెల్టులు, టైలు, షూలు, సాక్సులు వంటి వస్తువులను అధిక ధరలకు విద్యార్థులతో బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలకు ఆకర్షణీయమైన పేర్లు తగిలించి నర్సరీ స్థాయి నుంచే లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేట్ ఫీజులను నియంత్రించే ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలుగా కుదించే ప్రతిపాదనను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, పాఠశాలల సంఖ్యను తగ్గించకుండా జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి, ఉన్నవాటిని బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ఎస్ఎఫ్ఐ తన ప్రధాన డిమాండ్లను తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెంటనే యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ పూర్తి చేయాలని కోరింది. మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ నిధులు పెంచి, నాణ్యమైన భోజనం అందించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు వెంటనే నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పాఠశాలల యాజమాన్యాలు సాగిస్తున్న పుస్తకాలు, యూనిఫాంల బలవంతపు విక్రయాలను నిలిపివేయాలని, ప్రభుత్వ పాఠశాలల కుదింపు, మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, జనాభా ప్రాతిపదికన కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సందల్ వార్, ఇషాంత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన ఖండించారు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ్ జొన్న పంట కొనుగోలు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao (కేటీఆర్) బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని జోగు రామన్న తెలిపారు. కేటీఆర్ పర్యటనను కాంగ్రెస్ నాయకులు రాజకీయ కోణంలో చూడడం, వక్రీకరించి మాట్లాడడం యావత్ రైతాంగాన్ని అవమానించే చర్య అని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతు కుటుంబానికి భరోసా కల్పించేందుకే కేటీఆర్ వెళ్లారని, ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు వివరించారు. డీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా జోగు రామన్న ఈ సందర్భంగా ఖండించారు. బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడం రాజకీయమా? అని ప్రశ్నించిన జోగు రామన్న, ఇప్పటివరకు రైతు కుటుంబాన్ని పరామర్శించని జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన కాకుండా కక్షపూరితంగా మాట్లాడటం తగదన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకులకు ఆయన సూచించారు. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మొండిగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ నాయకులు రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్నగారు డిమాండ్ చేశారు.
    1
    కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన ఖండించారు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ్ జొన్న పంట కొనుగోలు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao (కేటీఆర్) బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని జోగు రామన్న తెలిపారు. కేటీఆర్ పర్యటనను కాంగ్రెస్ నాయకులు రాజకీయ కోణంలో చూడడం, వక్రీకరించి మాట్లాడడం యావత్ రైతాంగాన్ని అవమానించే చర్య అని ఆయన విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతు కుటుంబానికి భరోసా కల్పించేందుకే కేటీఆర్ వెళ్లారని, ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు వివరించారు. డీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా జోగు రామన్న ఈ సందర్భంగా ఖండించారు.

బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడం రాజకీయమా? అని ప్రశ్నించిన జోగు రామన్న, ఇప్పటివరకు రైతు కుటుంబాన్ని పరామర్శించని జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన కాకుండా కక్షపూరితంగా మాట్లాడటం తగదన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకులకు ఆయన సూచించారు. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మొండిగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ నాయకులు రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్నగారు డిమాండ్ చేశారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    1 hr ago
  • నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ నివాస గృహంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు ఈ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బూత్ కమిటీలు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాలుపంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులైన రవి శంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    28 min ago
  • జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    3
    జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం ఆదవిపదిర గ్రామస్తులు తమ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రం నుండి ఆదవిపదిరకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద తాత్కాలికంగా వేసిన డైవర్షన్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నామని తెలిపారు. వర్షాలు పడితే ఆ రోడ్డు కొట్టుకుపోయి, మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రానికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆందోళన చెందారు. కావున, అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు.

ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    1
    కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • భారతదేశం యొక్క పెరుగుతున్న సముద్ర ఆధిపత్యాన్ని చాటిచెబుతూ, స్వదేశీ యుద్ధ నౌకలు 'ఆత్మనిర్భర్ భారత్'కు శక్తివంతమైన ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ నౌకలు సముద్రాలను మ్యాపింగ్ చేస్తూ, దేశ భవిష్యత్తును సురక్షితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ స్వదేశీ నౌకలలో ఐఎన్ఎస్ దునాగిరి తన స్టీల్త్, స్ట్రైక్, ఆధిపత్య సామర్థ్యాలను కలిగి ఉంది, ఐఎన్ఎస్ ఆగ్రేను నీటి అడుగున వేటగాడిగా అభివర్ణించారు. ఐఎన్ఎస్ సంశోధక్ కూడా ఈ దేశీయ యుద్ధ నౌకల జాబితాలో చేరి, భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
    1
    భారతదేశం యొక్క పెరుగుతున్న సముద్ర ఆధిపత్యాన్ని చాటిచెబుతూ, స్వదేశీ యుద్ధ నౌకలు 'ఆత్మనిర్భర్ భారత్'కు శక్తివంతమైన ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ నౌకలు సముద్రాలను మ్యాపింగ్ చేస్తూ, దేశ భవిష్యత్తును సురక్షితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ స్వదేశీ నౌకలలో ఐఎన్ఎస్ దునాగిరి తన స్టీల్త్, స్ట్రైక్, ఆధిపత్య సామర్థ్యాలను కలిగి ఉంది, ఐఎన్ఎస్ ఆగ్రేను నీటి అడుగున వేటగాడిగా అభివర్ణించారు. ఐఎన్ఎస్ సంశోధక్ కూడా ఈ దేశీయ యుద్ధ నౌకల జాబితాలో చేరి, భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.