logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్టీసీ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: SWF రీజనల్ అధ్యక్షుడు భీం రావు ADB: ఆర్టీసీ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని SWF రీజనల్ అధ్యక్షుడు భీం రావు అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన SWF ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి పని భారాన్ని తగ్గించాలన్నారు. అధికారుల వేధింపులు, ప్రైవేట్ విద్యుత్ బస్సులు, ఆర్టీసీ ఆస్తుల మళ్లింపును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

2 hrs ago
user_Mallaiah Potta
Mallaiah Potta
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
2 hrs ago
2e707399-21ee-4b64-bd40-81037a255186

ఆర్టీసీ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: SWF రీజనల్ అధ్యక్షుడు భీం రావు ADB: ఆర్టీసీ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని SWF రీజనల్ అధ్యక్షుడు భీం రావు అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన SWF ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి పని భారాన్ని తగ్గించాలన్నారు. అధికారుల వేధింపులు, ప్రైవేట్ విద్యుత్ బస్సులు, ఆర్టీసీ ఆస్తుల మళ్లింపును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.
    3
    రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    11 min ago
  • *​ (ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు):* *​2016 దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి అమలు* రాష్ట్రంలో దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీనికై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. ​దివ్యాంగులందరికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇళ్లు': సురక్షితమైన నివాసం మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి దివ్యాంగుడికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇల్లు' మంజూరు చేయాలి. ​పెన్షన్ల పెంపు: దివ్యాంగుల పెన్షన్‌ను ₹6,000కు, అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి ₹15,000కు తక్షణమే పెంచాలి. ​బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ: ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ​ఉచిత ప్రయాణ సౌకర్యం: ఆర్టీసీ బస్సులతో పాటు హెచ్‌ఎంఆర్ (HMR) మెట్రో రైళ్లలో కూడా దివ్యాంగులందరికీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి. ​స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలి. ​స్వతంత్ర కార్యాలయాల ఏర్పాటు: జీవో 34 ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల వ్యవహారాల కోసం ప్రత్యేక స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. ​ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: దివ్యాంగ విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన (Special Education) ఉపాధ్యాయులను నియమించాలి. ​సదరమ్ (SADAREM) సేవల మార్పు: రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్థోపెడిక్ సదరన్ క్యాంపులను హైదరాబాద్‌కు మార్చి, దివ్యాంగులకు సేవలను మరింత చేరువ చేయాలి.
    3
    *​ (ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు):* 

*​2016 దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి అమలు*

రాష్ట్రంలో దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీనికై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి.
​దివ్యాంగులందరికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇళ్లు': సురక్షితమైన నివాసం మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి దివ్యాంగుడికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇల్లు' మంజూరు చేయాలి.
​పెన్షన్ల పెంపు: దివ్యాంగుల పెన్షన్‌ను ₹6,000కు, అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి ₹15,000కు తక్షణమే పెంచాలి.
​బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ: ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి.
​ఉచిత ప్రయాణ సౌకర్యం: ఆర్టీసీ బస్సులతో పాటు హెచ్‌ఎంఆర్ (HMR) మెట్రో రైళ్లలో కూడా దివ్యాంగులందరికీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి.
​స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలి.
​స్వతంత్ర కార్యాలయాల ఏర్పాటు: జీవో 34 ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల వ్యవహారాల కోసం ప్రత్యేక స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.
​ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: దివ్యాంగ విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన (Special Education) ఉపాధ్యాయులను నియమించాలి.
​సదరమ్ (SADAREM) సేవల మార్పు: రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్థోపెడిక్ సదరన్ క్యాంపులను హైదరాబాద్‌కు మార్చి, దివ్యాంగులకు సేవలను మరింత చేరువ చేయాలి.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    36 min ago
  • ఉండం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి: సర్పంచ్ మహేందర్ తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, పాఠశాల హెచ్‌ఎం సారికతో పాటు గ్రామ సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొండ్ల మహేందర్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. గ్రామంలోనే ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ మహేందర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్రావు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    ఉండం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి: సర్పంచ్ మహేందర్
తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, పాఠశాల హెచ్‌ఎం సారికతో పాటు గ్రామ సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొండ్ల మహేందర్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. గ్రామంలోనే ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ మహేందర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్రావు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • kamaraddy dist banswada lo ex m la bajirddy press meet, news
    1
    kamaraddy dist banswada lo ex  m la bajirddy press meet, news
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము


న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    17 hrs ago
  • Post by Shaikshada
    1
    Post by Shaikshada
    user_Shaikshada
    Shaikshada
    Dancer ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    1
    శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    21 hrs ago
  • కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి కలెక్టర్ ద్వారా వేతనాలు చెల్లించాలి ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కొత్త టెండర్లు పూర్తయ్యే వరకు కలెక్టర్ రాజర్షి షా చొరవచూపి సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ల పేరుతో తక్కువ వేతనాలు ఇస్తూ కార్మికులను మోసం చేయడం తగదని హెచ్చరించారు.
    1
    కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి కలెక్టర్ ద్వారా వేతనాలు చెల్లించాలి
ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కొత్త టెండర్లు పూర్తయ్యే వరకు కలెక్టర్ రాజర్షి షా చొరవచూపి సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ల పేరుతో తక్కువ వేతనాలు ఇస్తూ కార్మికులను మోసం చేయడం తగదని హెచ్చరించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.